అన్వేషించండి

Indiramma Housing Scheme Rules: ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు అలర్ట్, ఈ రూల్ తెలియకుండా ఇల్లు కడితే అనర్హులయ్యే అవకాశం

TS Indiramma Houses Rules | ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనలు తెలియక, అర్థంకాక ఆందోళన చెందుతున్నారు. తమకు విడత సాయం అందడం లేదని, అనర్హులు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Telangana Indiramma Housing Scheme | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ హౌసింగ్ స్కీం పై లబ్ధిదారులు ఆందోళన గురవుతున్నారు. అర్హులైన నిరుపేదలకు సొంతింటి కలను సహకారం చేయడానికి ఈ పథకాన్ని తీసుకొచ్చామని రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు చెబుతున్నారు. అయితే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం విషయంలో షరతులతో లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపే ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకోవాలని ప్రభుత్వం షరతు పెట్టింది. మొదటి విడతలో 70 వేల 122 ఇందిరమ్మ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం తెలిసిందే.

తొలి విడత సాయం అందడం లేదని ఆవేదన 

ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన 2,830 మంది లబ్ధిదారులు ఇంటి పునాది పూర్తి చేసుకున్నారు. వీరిలో కొందరు లబ్ధిదారులకు తొలివిడతగా రావాల్సిన లక్ష రూపాయల సాయాన్ని ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. 600 చదరపు అడుగుల పైనే ఇంటిని నిర్మించుకొంటున్న లబ్ధిదారులకు మొదటి విడత సాయం ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోకి ఉండేలా పునాదుల మార్పులు చేపడితే తొలి విడత సాయం లక్ష రూపాయలు అందిస్తామని అధికారులు చెబుతున్నారు.

కచ్చితంగా అంత విస్తీర్ణంలోనే ఇల్లు కట్టుకోవాలి 

సొంత జాగా ఉన్నవారు తమ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టవచ్చని ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా తీయమ రేవంత్ రెడ్డి అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఐదు లక్షలు ప్రభుత్వం సహాయం చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం పలుమార్లు చెప్పారు. కానీ ఇంటిని 400 నుంచి 600 చదరపు అడుగుల మధ్యలోనే నిర్మించుకోవాలని అధికారులు చెప్పడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం తమకు 5 లక్షల రూపాయలు సాయం చేస్తుందని, అదనపు ఖర్చులు పడితే తానే భరిస్తామని లబ్ధిదారులు చెబుతున్నారు. ఒకవేళ ఇంటి జాగా 600 చదరపు అడుగులు దాటితే ఆ లబ్ధిదారులు బిపిఎల్ పరిధిలోకి రారని.. ఇందిరమ్మ ఇళ్లకు వారిని అనర్హులుగా ప్రకటిస్తామని చెబుతున్నారు. 

లబ్ధి పొందాలంటే అర్హులైన పేదలు తమ ఇళ్లను 400 చదరపు అడుగుల్లోనే నిర్మించుకోవాలి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా 200 చదరపు అడుగులు పెంచుకునేందుకు వీలు కనిపిస్తూ 600 చదరపు అడుగులను లిమిట్ పెట్టినట్లు హౌసింగ్ శాఖ పేర్కొంది. మే 5వ తేదీలకు రెండో విడత జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధి పొందాలంటే 400 నుంచి 600 చదరపు అడుగుల లోపే ఇల్లు కట్టుకోవాలని నిబంధనను గృహనిర్మాణ శాఖ అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

లబ్ధిదారులకు సూచనలు

ఇందిరమ్మ యాప్‌ సర్వే చేసిన సమయంలోచూపిన స్థలంలోనే లబ్ధిదారుడు ముగ్గు పోసుకోవాలి. మరోచోట ఇల్లు కట్టే వారికి ఇందిరమ్మ ఇంటిని రద్దు చేస్తారు. నిర్మాణానికి ముగ్గు పోసిన తర్వాత గ్రామ కార్యదర్శి పరిశీలించి, ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తారు. నిర్మాణ ప్రదేశాన్ని జియో ట్యాగింగ్‌ చేస్తారు. 400 నుంచి 600 చదరపు అడుగులు లోపే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇంటి పునాది పూర్తి చేస్తే మొదటి విడతలో లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో రూ.1 లక్షను జమ చేస్తారు. ఇంటి నిర్మాణం పూర్తయిన దశలను బట్టి ఏఈ/ఎంపీడీవోలు ఫీల్డ్ విజిట్ చేసి.. లబ్ధిదారుడికి ఆర్థిక సాయం కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Allu Cinemas: 'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Farmhouse Drug Party: రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget