అన్వేషించండి

Pahalgam Terror Attack: పహల్గాం దాడిపై పార్లమెంట్‌లో చర్చిద్దాం, ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే లేఖ

Mallikarjun Kharge Letter to PM Modi | పహల్గాంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిపై చర్చించేందుకు పార్లమెంట్ సభయ సభల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు.

Kashmir Terror Attack | న్యూఢిల్లీ | కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడితో  తలెత్తిన పరిస్థితిని ఎదుర్కోవడంపై సమిష్టిగా చర్చించడానికి పార్లమెంట్ సమావేశం కావాలని లేఖలో పేర్కొన్నారు. అందుకోసం పార్లమెంటు ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీకి రాసిన లేఖలో కోరారు.

 

ప్రధాని మోదీ తీరు సరికాదన్న కాంగ్రెస్..

పహల్గాం ఉగ్రదాడిపై చర్చించేందుకు ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ గైర్హాజరు కావడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ మల్లికార్జున ఖర్గే తప్పు పట్టారు. రాజస్థాన్లోని జైపూర్ లో సోమవారం (ఏప్రిల్ 28న) జరిగిన సంవిదాన్ బచావో ర్యాలీలో పాల్గొన్న మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ఢిల్లీలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీల ముఖ్య నేతలు హాజరయ్యారు. కానీ మోడీ ఈ కీలక సమావేశానికి డుమ్మా కొట్టడాన్ని ఖర్గే తప్పు పట్టారు. ఒకవేళ ప్రధాని మోదీ ఈ సమావేశానికి హాజరై పహల్గాం ఉగ్రదాడిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది, వారి ప్లాన్స్ వివరించి ఉంటే బాగుండేది అన్నారు.

బిహార్ వెళ్లి పొలిటికల్ స్పీచ్

అదే సమయంలో ప్రధాని మోదీ బిహార్ కు వెళ్లి పొలిటికల్ స్పీచ్ ఇవ్వడం సరి కాదన్నారు. పార్టీలు, మతాల కంటే మనకు దేశమే ముఖ్యం. దేశం కోసం అంతా ఏకం కావాలి. అందుకోసమే మేము కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మద్దతు ప్రకటిస్తున్నాం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ఛాయ్ అమ్ముకున్న మోడీ ప్రధానమంత్రి అయ్యారు. అందుకే రాజ్యాంగాన్ని అందరూ పాటిస్తూ.. ఇలాంటి సమయంలో సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటే దేశానికి ప్రయోజనం ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఐక్యమత్యం గురించి చెబుతుంటే బిజెపి నేతలు మాత్రం విభజన వాదంతో ముందుకెళ్తున్నారని ఖర్గే విమర్శించారు. 

జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై ఎన్డీయే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు తమ కట్టుబడి ఉంటామన్నారు. ఏ రూపంలో ఉన్నా ఉగ్రవాదాన్ని సహించేది లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని, విపక్ష నేతలపై వేధింపులకు మాత్రం బాగా వాడుతుందన్నారు. బిజెపి నేతలు దేవుళ్ళ పేర్లు స్మరిస్తారో లేదో కానీ కాంగ్రెస్ సహా విపక్ష నేతల పేర్లు ప్రతిరోజు తలుచుకుంటారని ఎద్దేవా చేశారు.

కాగా, పాక్ పౌరులకు భారత ప్రభుత్వం విధించిన గడువు నేటితో ముగియనుంది. రెగ్యూలర్ వీసాల వాళ్లు 27నే భారత్ ను వీడి వెళ్లిపోయాలి, మెడికల్ వీసాలాంటి ఎమర్జెన్సీ వీసాల మీద భారత్ లో ఉంటున్న వారు సైతం నేడు (ఏప్రిల్ 29న) దేశం నుంచి తిరిగి పాక్ వెళ్లిపోవాల్సి ఉంది. డెడ్ లైన్ నేటితో ముగియనున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశం త్వరగా ఏర్పాటు చేసి పహల్గాం ఉగ్రదాడి అనంతరం చర్యలపై చర్చిద్దామని కోరారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Movie Ticket Rates: సినిమా టిక్కెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్ సంచలన ప్రకటన - కార్మికులకు వాటా ఇస్తేనే ఇక జీవో !
సినిమా టిక్కెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్ సంచలన ప్రకటన - కార్మికులకు వాటా ఇస్తేనే ఇక జీవో !
Montha Cyclone Update: ఏపీ వ్యాప్తంగా సైక్లోన్ మొంథా ప్రభావం -  పలు చోట్ల వర్షాలు గాలులు - అధికారయంత్రాంగం అప్రమత్తం !
ఏపీ వ్యాప్తంగా సైక్లోన్ మొంథా ప్రభావం - పలు చోట్ల వర్షాలు గాలులు - అధికారయంత్రాంగం అప్రమత్తం !
UPSC aspirant murder case: ప్రేమికుడ్ని మాజీ లవర్స్‌తో కలిసి చంపేసిన కేసులో ట్విస్ట్ - వెబ్ సిరిస్ చూసే ప్లాన్ చేసింది !
ప్రేమికుడ్ని మాజీ లవర్స్‌తో కలిసి చంపేసిన కేసులో ట్విస్ట్ - వెబ్ సిరిస్ చూసే ప్లాన్ చేసింది !
Fact Check: అమిత్ షా బీహార్ ఓటర్లను బెదిరించారని చెప్పే  ABP న్యూస్  వైరల్  గ్రాఫిక్ ఫేక్ - ఇదిగో నిజం
అమిత్ షా బీహార్ ఓటర్లను బెదిరించారని చెప్పే ABP న్యూస్ వైరల్ గ్రాఫిక్ ఫేక్ - ఇదిగో నిజం
Advertisement

వీడియోలు

India vs Australia Playing 11 | టీ20 మ్యాచ్ కు భారత్ ప్లేయింగ్ 11 ఇదే
Pratika Rawal Ruled Out | ప్ర‌పంచ‌క‌ప్ నుంచి త‌ప్పుకున్న ప్ర‌తీకా రావ‌ల్‌
Australia vs India T20 Preview | రేపే ఇండియా ఆసీస్ మధ్య మొదటి టీ20
India vs South Africa Test Team | టీమ్ ను ప్రకటించిన దక్షిణాఫ్రికా
Voyager Space Crafts Golden Record | కోట్లాది ఆశలను మోస్తూ 48ఏళ్లుగా విశ్వంలో ప్రయాణిస్తున్న స్పేస్ క్రాఫ్ట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Movie Ticket Rates: సినిమా టిక్కెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్ సంచలన ప్రకటన - కార్మికులకు వాటా ఇస్తేనే ఇక జీవో !
సినిమా టిక్కెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్ సంచలన ప్రకటన - కార్మికులకు వాటా ఇస్తేనే ఇక జీవో !
Montha Cyclone Update: ఏపీ వ్యాప్తంగా సైక్లోన్ మొంథా ప్రభావం -  పలు చోట్ల వర్షాలు గాలులు - అధికారయంత్రాంగం అప్రమత్తం !
ఏపీ వ్యాప్తంగా సైక్లోన్ మొంథా ప్రభావం - పలు చోట్ల వర్షాలు గాలులు - అధికారయంత్రాంగం అప్రమత్తం !
UPSC aspirant murder case: ప్రేమికుడ్ని మాజీ లవర్స్‌తో కలిసి చంపేసిన కేసులో ట్విస్ట్ - వెబ్ సిరిస్ చూసే ప్లాన్ చేసింది !
ప్రేమికుడ్ని మాజీ లవర్స్‌తో కలిసి చంపేసిన కేసులో ట్విస్ట్ - వెబ్ సిరిస్ చూసే ప్లాన్ చేసింది !
Fact Check: అమిత్ షా బీహార్ ఓటర్లను బెదిరించారని చెప్పే  ABP న్యూస్  వైరల్  గ్రాఫిక్ ఫేక్ - ఇదిగో నిజం
అమిత్ షా బీహార్ ఓటర్లను బెదిరించారని చెప్పే ABP న్యూస్ వైరల్ గ్రాఫిక్ ఫేక్ - ఇదిగో నిజం
Driverless car: ఇండియాలో తొలి డ్రైవర్ లెస్ కార్ రెడీ -  విప్రో సహకారంతో నిర్మాణం - బెంగళూరులో ఫస్ట్ లుక్
ఇండియాలో తొలి డ్రైవర్ లెస్ కార్ రెడీ - విప్రో సహకారంతో నిర్మాణం - బెంగళూరులో ఫస్ట్ లుక్
ప్రైవేట్‌ జెట్‌ ఫీల్‌ ఇచ్చే లగ్జరీ MPV Lexus LM350h - ఇదంటే సెలబ్రెటీలకు పిచ్చ క్రేజ్‌, ధర కేవలం...
Lexus LM350h - బాలీవుడ్‌ స్టార్లు, బిజినెస్‌ టైకూన్లు ఎందుకు ఫిదా అవుతున్నారు?
Raviteja : యంగ్ హీరోతో రవితేజ మల్టీస్టారర్ - క్రేజీ కాంబో వేరే లెవల్... మాస్ కామెడీ మామూలుగా ఉండదంతే...
యంగ్ హీరోతో రవితేజ మల్టీస్టారర్ - క్రేజీ కాంబో వేరే లెవల్... మాస్ కామెడీ మామూలుగా ఉండదంతే...
Artificial Rain: ఢిల్లీలో మొదటి సారి మేఘమథనం - వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి కృత్రిమ వర్షాలకు ప్రయత్నం..!
ఢిల్లీలో మొదటి సారి మేఘమథనం - వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి కృత్రిమ వర్షాలకు ప్రయత్నం..!
Embed widget