అన్వేషించండి

Pahalgam Terror Attack: హిందువులను చంపినా అతి మంచితనం పనికిరాదు, మీరు పాకిస్తాన్ వెళ్లిపోండి- పవన్ కళ్యాణ్ సంచలనం

Pahalgam Terror Attack | పహల్గాంలో కాల్పులు జరిపి 25 మంది హిందువులను చంపేసినా.. పాకిస్తాన్ మీద ప్రేమ కురిపిస్తున్న వారు ఆ దేశానికే వెళ్లిపోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.

మంగళగిరి: కాశ్మీర్ లోని పహల్గాంలో ఐడీ కార్డులు తీసుకుని చెక్ చేసి, మతం అడిగి మరీ హిందువులను దారుణంగా కాల్చి చంపారని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ కొందరు సెక్యూలర్, లౌకిక అనే పేరుతో పాకిస్తాన్ మీద ప్రేమ చూపిస్తున్నారు భారత్‌లో ఉండటం ఎందుకని ప్రశ్నించారు. అలాంటి వారు పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలంటూ మండిపడ్డారు.  పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో చనిపోయిన వారికి నివాళి అర్పిస్తూ జనసేన పార్టీ మంగళగిరిలో కార్యక్రమం నిర్వహించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడుతూ.. మతం పేరిట హిందువులపై జరిగిన ఉగ్రదాడిని ఉపేక్షించకూడదు అన్నారు.

25 మంది హిందువులు, ఓ ముస్లిం చనిపోయారు
‘నిరాయుధులైన వారిపై కాల్పులు జరపడం దారుణం. ఎంతో నమ్మకం ఉంటేగానీ కాశ్మీర్ కు ప్రజలు వెళ్లరు. అయితే ఆర్టికల్ 370 రద్దుతో పరిస్థితి మారిందని పర్యాటకులు వెళ్తున్నారు. కానీ తీవ్రవాదులు అలజడి సృష్టించారు. ప్రపంచమే గ్లోబల్ విలేజ్ అంటుంటారు. కాశ్మీర్ లో జరిగితే మనకెందుకు అనుకోకూడదు. ఇది మన దేశంలోనే ఉంది. కాశ్మీర్ మనదే. తక్కువ స్థాయి ఆలోచనా విధానంతో కొందరు మీ రాష్ట్రం కాదు కదా అంటారు. దేశ సరిహద్దుల్లో ఏమైనా జరిగితే దాని ప్రకంపనలు అన్ని రాష్ట్రాలను తాకుతాయి. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి ఫ్యామిలీతో కలిసి కాశ్మీర్ చూద్దామని వెళ్తే తూటాలతో ఆయన శరీరం నిండిపోయింది. చనిపోయిన వారి కుటుంబాలను బాధ చూశాక ఉగ్రవాదులను చంపేయాలి అనిపిస్తోంది. 26 మంది ఉగ్రదాడిలో చనిపోగా, అందులో 25 మంది హిందువులు, ఒకరు ముస్లిం. 

వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూపించాలి. కొన్ని విషయాల్లో టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తే దాని మీడియా కూడా చూపించాలి. కానీ ఇది దేశ ప్రజల మధ్య వివాదం కాదు. ఉగ్రవాదులపై కోపం. 1986 నుంచి 1989 వరకు అన్నయ్య సినిమాల షూటింగ్ కోసం ఎన్నోసార్లు కాశ్మీర్ వెళ్లాం. కాశ్మీర్ పండిట్ల వలసను ఆనాడు ఆపి ఉంటే వారు అక్కడే ఉండేవారు. లక్షలాది మంది కశ్మీరి పండిట్స్ ప్రాణభయంతో వలస వెళ్లారు. 1986లో తొలిసారి బాగుంది అనిపించింది. ఆతరువాత వచ్చినప్పుడు అక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడి దారుణాలను ఓ కశ్మీరి పండిట్ మాకు చెప్పాడు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తలెత్తకూడదని జనసేన భావిస్తోంది. కుటుంబాన్ని నడపాలంటే ఎన్నో ఇబ్బందులు. అలాంటివి ఇన్ని రాష్ట్రాలున్న పెద్ద దేశాన్ని నడపాలంటే నేతకు మద్దతు తెలపాలి.  కళ్ల ముందే మధుసూదన్ లాంటి ఎంతో మందిని దారుణంగా చంపేశారు. 

అతి మంచితనం అవసరం లేదు, మీరు పాక్ వెళ్లిపోండి

భారత్ కు సహనం ఎక్కువ. కానీ ఏదైనా అతి చేసినా.. మితిమీరిన మంచితనం సరికాదు. దానివల్ల మనకే నష్టం జరుగుతోంది. పాకిస్తాన్ మూడుసార్లు యుద్ధంలో ఓడిపోయినా, మనమీద ఉగ్రదాడులు చేస్తూనే ఉంది. ఈ సమయంలో దీనిపై ఓ కఠిన నిర్ణయం తీసుకోవాలి. రేపు యుద్ధం వచ్చినా, రాకపోయినా మనం జాతీయత అనేలా ఆలోచించాలి. తప్పు జరిగితే దాన్ని ఎదిరించాలి. 26 మందిని మత ప్రాతిపదికన చంపినా.. మతాన్ని చూసి చంపలేదని సో కాల్డ్ సెక్యూలర్ వాదులు వాదిస్తున్నారు. మీకు నిజంగానే పాకిస్తాన్ మీద అంత ప్రేమ ఉంటే ఆ దేశానికే వెళ్లిపోండి. కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్ పై జాలి చూపుతున్నారు. దేశంపై దాడి జరిగితే పాక్ కు మద్దతు తెలుపుతూ సెక్యూలరిజం అంటే చూస్తూ ఊరుకునేది లేదు. చనిపోయిన వారి కుటుంబాలకు ఆ ప్రాణాలకు తిరిగి తీసుకురాగలరా. టీవీలో కనిపిస్తామని అనుకోలేదు. కానీ మా బతుకులు ఇలా అయిపోయాయి. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై నమ్మకంతోనే కాశ్మీర్ కు వెళ్లాం. అలాంటిది ప్రాణాలు పోతే బాధ్యత ఎవరిరిది. మత ప్రాతిపదికన చంపితే సెక్యూలర్ అని వాదించే వారిని ఏమనాలి. తప్పు జరిగితే ఖండించాలి. వాటికి వ్యతిరేకంగా పోరాటం జరపాలని’ సూచించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget