అన్వేషించండి

Kavitha Hunger Strike: ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 

Kavitha Hunger Strike: ఖమ్మం నగరంలో మంగళవారం మధ్యాహ్నం నుంచే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెలుగుమట్ల బాధితులతో కలిసి కవిత తొలుత జిల్లా పరిషత్‌ కూడలిలో భారీ ఆందోళనకు దిగారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వెలుగుమట్ల భూ బాధితులకు కవిత నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు.
  • న్యాయం కోసం రోడ్డుపై బైఠాయించిన కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
  • పోలీసుల విడుదల తర్వాత అంబేడ్కర్ భవన్‌లో దీక్షను కొనసాగిస్తున్నారు.
  • పేదల భూ హక్కుల కోసం పోరాటం ఆగదని కవిత స్పష్టం చేశారు.

Kavitha Hunger Strike: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల భూ బాధితుల సమస్య ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. వెలుగుమట్ల బాధితులకు అండగా ఉంటానని ప్రకటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, ఇప్పుడు వారి కోసం నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఖమ్మం నగరంలోని అంబేడ్కర్‌ భవన్‌ ఈ చారిత్రాత్మక పోరాటానికి వేదికైంది. ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ, బాధితులకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని ఆమె భీష్మించుకొని కూర్చున్నారు. 

హైడ్రామా మధ్య సాగిన ఆందోళన! రోడ్డుపై బైఠాయింపు నుంచి పోలీస్ స్టేషన్‌ వరకు...

ఖమ్మం నగరంలో మంగళవారం మధ్యాహ్నం నుంచే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెలుగుమట్ల బాధితులతో కలిసి కవిత తొలుత జిల్లా పరిషత్‌ కూడలిలో భారీ ఆందోళనకు దిగారు. న్యాయం కోసం బాధితులతో కలిసి ఆమె ప్రధాన రహదారిపైనే బైఠాయించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయి, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. 

ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా పోలీసులు కవితను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను బలవంతంగా వాహనంలోకి తరలించి స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించడంతో కార్యకర్తలు, బాధితులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే చీకటి పడటంతో పోలీసులు ఆమెను స్టేషన్‌ నుంచి విడుదల చేశారు. స్టేషన్‌ నుంచి విడుదలైన వెంటనే కవిత వెనక్కి తగ్గకుండా, నేరుగా అంబేడ్కర్‌ భవన్‌కు చేరుకునే తన పోరాటాన్ని తదుపరి దశకు తీసుకెళ్లారు. 

అంబేడ్కర్‌ భవన్‌లో దీక్షా పర్వం- కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు 

ప్రస్తుతం అంబేడ్కర్‌  భవన్‌లో కవిత తన దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాధితులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

ఈ పోరాటం కేవలం ఒక నిరసన మాత్రమే కాదని, ఇది భూమిని నమ్ముకున్న పేదవాడి హక్కుల పోరాటమని ఆమె అభివర్ణించారు. భూదాన్ భూములు బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం ఆగదని, అందరూ కలిసికట్టుగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. వెలుగుమట్ల ప్రాంతంలో దశాబ్దాలుగా నెలకొన్న భూ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, పేదలకు దక్కాల్సిన భూములపై కన్నేసిన వారికి గుణపాఠం తప్పదని ఆమె హెచ్చరించారు. 

వెలుగుమట్ల బాధితుల వేదనకు కారణమేంటి?

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల పరిధిలోని భూదాన్ భూములకు సంబంధించిన గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. పేదలకు కేటాయించిన భూములను ఇతరులు ఆక్రమించుకుంటున్నారని లేదా సాంకేతిక కారణాలతో వారికి పట్టాలు దక్కడం లేదని బాధితులు వాపోతున్నారు. తమ గోడును వినేవారే కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఈ బాధితులకు కవిత మద్దతు తెలపడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 

Frequently Asked Questions

వెలుగుమట్ల భూ బాధితుల సమస్యపై కవిత నిరసన ఎందుకు చేపట్టారు?

వెలుగుమట్ల భూ బాధితులకు మద్దతుగా, వారి సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.

ఖమ్మంలో కవిత ఆందోళన ఎలా జరిగింది?

కవిత, వెలుగుమట్ల బాధితులతో కలిసి జిల్లా పరిషత్ కూడలిలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. దీనివల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.

పోలీసులు కవితను ఎందుకు అదుపులోకి తీసుకున్నారు?

ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు కవితను అదుపులోకి తీసుకున్నారు.

వెలుగుమట్ల భూదాన్ భూములకు సంబంధించిన సమస్య ఏమిటి?

పేదలకు కేటాయించిన భూదాన్ భూములను కొందరు ఆక్రమించుకుంటున్నారని లేదా సాంకేతిక కారణాలతో బాధితులకు పట్టాలు దక్కడం లేదని సమస్య ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Embed widget