అన్వేషించండి

Kavitha Hunger Strike: ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 

Kavitha Hunger Strike: ఖమ్మం నగరంలో మంగళవారం మధ్యాహ్నం నుంచే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెలుగుమట్ల బాధితులతో కలిసి కవిత తొలుత జిల్లా పరిషత్‌ కూడలిలో భారీ ఆందోళనకు దిగారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వెలుగుమట్ల భూ బాధితులకు కవిత నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు.
  • న్యాయం కోసం రోడ్డుపై బైఠాయించిన కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
  • పోలీసుల విడుదల తర్వాత అంబేడ్కర్ భవన్‌లో దీక్షను కొనసాగిస్తున్నారు.
  • పేదల భూ హక్కుల కోసం పోరాటం ఆగదని కవిత స్పష్టం చేశారు.

Kavitha Hunger Strike: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల భూ బాధితుల సమస్య ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. వెలుగుమట్ల బాధితులకు అండగా ఉంటానని ప్రకటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, ఇప్పుడు వారి కోసం నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఖమ్మం నగరంలోని అంబేడ్కర్‌ భవన్‌ ఈ చారిత్రాత్మక పోరాటానికి వేదికైంది. ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ, బాధితులకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని ఆమె భీష్మించుకొని కూర్చున్నారు. 

హైడ్రామా మధ్య సాగిన ఆందోళన! రోడ్డుపై బైఠాయింపు నుంచి పోలీస్ స్టేషన్‌ వరకు...

ఖమ్మం నగరంలో మంగళవారం మధ్యాహ్నం నుంచే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెలుగుమట్ల బాధితులతో కలిసి కవిత తొలుత జిల్లా పరిషత్‌ కూడలిలో భారీ ఆందోళనకు దిగారు. న్యాయం కోసం బాధితులతో కలిసి ఆమె ప్రధాన రహదారిపైనే బైఠాయించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయి, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. 

ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా పోలీసులు కవితను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను బలవంతంగా వాహనంలోకి తరలించి స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించడంతో కార్యకర్తలు, బాధితులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే చీకటి పడటంతో పోలీసులు ఆమెను స్టేషన్‌ నుంచి విడుదల చేశారు. స్టేషన్‌ నుంచి విడుదలైన వెంటనే కవిత వెనక్కి తగ్గకుండా, నేరుగా అంబేడ్కర్‌ భవన్‌కు చేరుకునే తన పోరాటాన్ని తదుపరి దశకు తీసుకెళ్లారు. 

అంబేడ్కర్‌ భవన్‌లో దీక్షా పర్వం- కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు 

ప్రస్తుతం అంబేడ్కర్‌  భవన్‌లో కవిత తన దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాధితులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

ఈ పోరాటం కేవలం ఒక నిరసన మాత్రమే కాదని, ఇది భూమిని నమ్ముకున్న పేదవాడి హక్కుల పోరాటమని ఆమె అభివర్ణించారు. భూదాన్ భూములు బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం ఆగదని, అందరూ కలిసికట్టుగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. వెలుగుమట్ల ప్రాంతంలో దశాబ్దాలుగా నెలకొన్న భూ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, పేదలకు దక్కాల్సిన భూములపై కన్నేసిన వారికి గుణపాఠం తప్పదని ఆమె హెచ్చరించారు. 

వెలుగుమట్ల బాధితుల వేదనకు కారణమేంటి?

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల పరిధిలోని భూదాన్ భూములకు సంబంధించిన గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. పేదలకు కేటాయించిన భూములను ఇతరులు ఆక్రమించుకుంటున్నారని లేదా సాంకేతిక కారణాలతో వారికి పట్టాలు దక్కడం లేదని బాధితులు వాపోతున్నారు. తమ గోడును వినేవారే కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఈ బాధితులకు కవిత మద్దతు తెలపడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 

Frequently Asked Questions

వెలుగుమట్ల భూ బాధితుల సమస్యపై కవిత నిరసన ఎందుకు చేపట్టారు?

వెలుగుమట్ల భూ బాధితులకు మద్దతుగా, వారి సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.

ఖమ్మంలో కవిత ఆందోళన ఎలా జరిగింది?

కవిత, వెలుగుమట్ల బాధితులతో కలిసి జిల్లా పరిషత్ కూడలిలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. దీనివల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.

పోలీసులు కవితను ఎందుకు అదుపులోకి తీసుకున్నారు?

ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు కవితను అదుపులోకి తీసుకున్నారు.

వెలుగుమట్ల భూదాన్ భూములకు సంబంధించిన సమస్య ఏమిటి?

పేదలకు కేటాయించిన భూదాన్ భూములను కొందరు ఆక్రమించుకుంటున్నారని లేదా సాంకేతిక కారణాలతో బాధితులకు పట్టాలు దక్కడం లేదని సమస్య ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో మూడు రోజులు జాగ్రత్త! 'సన్‌'చలన అలర్ట్ జారీ చేసిన అధికారులు!
తెలంగాణలో మూడు రోజులు జాగ్రత్త! 'సన్‌'చలన అలర్ట్ జారీ చేసిన అధికారులు!
Tejaswi Surya: ఆంధ్రప్రదేశ్ విభజన, రేవంత్‌పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన తేజస్వి సూర్య ఎవరు? బ్యాంక్‌గ్రౌండ్ ఏంటీ?
ఆంధ్రప్రదేశ్ విభజన, రేవంత్‌పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన తేజస్వి సూర్య ఎవరు? బ్యాంక్‌గ్రౌండ్ ఏంటీ?
Telangana News: ఎస్సీ, ఎస్టీ యువతకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం! పదివేల మందికి ఈవీల పంపిణీకి సిద్ధం!
ఎస్సీ, ఎస్టీ యువతకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం! పదివేల మందికి ఈవీల పంపిణీకి సిద్ధం!
MLA Qualifications: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఉండాల్సిన అర్హతలు ఇవే! రాజ్యాంగ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఉండాల్సిన అర్హతలు ఇవే! రాజ్యాంగ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
Advertisement

వీడియోలు

IPL 2026 RCB vs LSG Highlights | నాలుగో విజ‌యంతో స‌త్తా చాటిన బెంగుళూరు
Rasik Dar Salam vs LSG IPL 2026 | ఆర్‌సీబీ కొత్త సెన్సేషన్ రసిక్ సలామ్
Rishabh Pant Injury IPL 2026 vs RCB |నొప్పితో మైదానం వీడిన రిషబ్ పంత్
Virat Kohli Wins Orange Cap IPL 2026 | ఆరెంజ్ క్యాప్ అందుకున్న విరాట్ కోహ్లీ
Jasprit Bumrah Poor Form in IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై స్టార్ బౌలర్ దారుణ వైఫల్యం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prakash Raj : సినిమాల్లో సీఎం కావొచ్చు... పాలిటిక్స్‌లో కాదు - విజయ్‌పై ప్రకాష్ రాజ్ సెటైరికల్ కామెంట్స్
సినిమాల్లో సీఎం కావొచ్చు... పాలిటిక్స్‌లో కాదు - విజయ్‌పై ప్రకాష్ రాజ్ సెటైరికల్ కామెంట్స్
Pakistan: పాకిస్తాన్‌లో ఉన్న భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టల వరుస హత్యలు - ధురంధర్ ప్లానేనా - వణికిపోతున్న శత్రుదేశం
పాకిస్తాన్‌లో ఉన్న భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టల వరుస హత్యలు - ధురంధర్ ప్లానేనా - వణికిపోతున్న శత్రుదేశం
Vishu poster controversy: కేరళ హోటల్ నిర్వాకం - శ్రీకృష్ణుడి చిత్రంతో మాంసాహార ప్రకటన - క్షమాపణ చెప్పినా ఊరుకుంటారా?
కేరళ హోటల్ నిర్వాకం - శ్రీకృష్ణుడి చిత్రంతో మాంసాహార ప్రకటన - క్షమాపణ చెప్పినా ఊరుకుంటారా?
Prakash Raj Ram controversy: రాముడు, లక్ష్మణులను వలస కూలీలతో పోల్చిన ప్రకాష్ రాజ్ - హిందూవాదుల తీవ్ర ఆగ్రహం
రాముడు, లక్ష్మణులను వలస కూలీలతో పోల్చిన ప్రకాష్ రాజ్ - హిందూవాదుల తీవ్ర ఆగ్రహం
AKASA SPICEJET Collision:  ఢిల్లీ ఇందిరాగాంధీఎయిర్‌పోర్ట్‌లో AKASA AIR SPICE JET ఢీ: విచారణకు ఆదేశించిన DGCA
 ఢిల్లీ ఇందిరాగాంధీఎయిర్‌పోర్ట్‌లో రెండు విమానాల ఢీ: విచారణకు ఆదేశించిన DGCA
IT Jobs 2026: ఐటీ రంగంలో
ఐటీ రంగంలో "ఏఐ" ప్రకంపనలు! క్యాంపస్ హైరింగ్‌కు కంపెనీలు బ్రేక్‌! 
Viral News: హైదరాబాద్‌ పీవీఆర్‌ మాల్‌లో ఉద్యోగి మృతిపై వివాదం! ఫుట్‌పాత్‌పై పడేేశారని ప్రచారం! ఖండించిన యాజమాన్యం
హైదరాబాద్‌ పీవీఆర్‌ మాల్‌లో ఉద్యోగి మృతిపై వివాదం! ఫుట్‌పాత్‌పై పడేేశారని ప్రచారం! ఖండించిన యాజమాన్యం
Rahu Lok Sabha controversy: మోదీని మెజిషియన్ అన్న రాహుల్ - భగ్గుమన్న బీజేపీ - లోక్‌సభలో దుమారం
మోదీని మెజిషియన్ అన్న రాహుల్ - భగ్గుమన్న బీజేపీ - లోక్‌సభలో దుమారం
Embed widget