అన్వేషించండి

KTR: '8 మంది బీజేపీ ఎంపీలుంటే రూ.8లు కూడా రాలేదు' - బీహార్, ఏపీ బడ్జెట్‌లా ఉందంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Union Budget 2024: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పేరు ప్రస్తావించకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం కొన్ని రాష్ట్రాలకే నిధులు కేటాయించడం బాధాకరమన్నారు.

KTR Sensational Comments On Union Budget 2024: తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇచ్చినా.. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో తెలంగాణకు రూ.8 లు కూడా కేటాయించలేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అసహనం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మరోసారి మొండిచేయి చూపించారని.. బడ్జెట్‌లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమని అన్నారు. రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయిస్తారని ఆశించామని.. కానీ దక్కింది మాత్రం శూన్యమని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది కేంద్ర బడ్జెటా.? లేక బీహార్, ఏపీ బడ్జెటా.? అని చాలామంది అనుకుంటున్నట్లు చెప్పారు. 'రూ.48.21 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టినా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్ద పీట వేశారు. తెలంగాణకు మరోసారి గుండు సున్నానే దక్కింది. ములుగు వర్శిటీకి అదనపు నిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుకు ఎన్నిసార్లు జాతీయ హోదా అడిగినా పట్టించుకోలేదు.' అంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

'తెలంగాణ ప్రజలు ఆలోచించాలి'

తెలంగాణ సీఎం, మంత్రులు ఢిల్లీ వెళ్లి అడిగినా కేంద్రం పట్టించుకోలేదని.. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు 16 స్థానాలను ఇస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని కేటీఆర్ అన్నారు. 16 స్థానాలున్న ఏపీ, 12 సీట్లున్న బీహార్‌కు కేంద్ర బడ్జెట్‌లో దక్కిన నిధులు చూసి ఆలోచించాలని.. ఎందుకు ప్రాంతీయ శక్తులను బలోపేతం చేసుకోవాలి మరోసారి ఈ బడ్జెట్ తెలియజేస్తుందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా పార్లమెంట్‌లో మాట్లాడలేదని విమర్శించారు.

ఏపీకి నిధులపై..

అయితే, కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఎక్కువ నిధులు కేటాయించినందుకు తమకు బాధ లేదని.. సోదర రాష్ట్రంగా వారికి వచ్చిన కేటాయింపులు, వారు బాగుండాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్ అన్నారు. ఏపీ విభజన చట్టం పేరు చెప్పి తెలంగాణ డిమాండ్లు మాత్రం కేంద్రం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. 'ఏపీ విభజనం చట్టం పేరు చెప్పి తెలంగాణ రాష్ట్ర డిమాండ్లను మాత్రం పట్టించుకోవడం లేదు. అమరావతి, పోలవరంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి నిధులు ఇస్తాం అన్నారు. ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్లకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఏపీ, బీహార్‌కు మాత్రమే ఇచ్చి మిగిలిన రాష్ట్రాలను చిన్న చూపు చూడడం నిజంగా బాధాకరం.' అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఎందుకింత నిర్లక్ష్యం.?

కేంద్ర బడ్జెట్‌లో కనీసం తెలంగాణ పదమే పలకలేదని.. బీజేపీ, కాంగ్రెస్ కలిసి తెలంగాణకు అన్యాయం చేశాయని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. ఏపీకి నిధులు కేటాయించడం సంతోషమేనని.. అయితే బడ్జెట్‌లో కనీసం తెలంగాణ ప్రస్తావన లేదని అన్నారు. 'తెలంగాణ ప్రజలంటే బీజేపీ, కేంద్రానికి ఎందుకింత నిర్లక్ష్యం.? పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వొచ్చు కదా.?. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావనే లేదు. తెలంగాణ నుంచి ఎన్నికైన 8 మంది బీజేపీ ఎంపీలు తెలంగాణకు నిధుల్లో వాటా తేవాలి.' అని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Also Read: Memes on Budget : బీహార్, ఏపీకే నిధులు - నిర్మలమ్మ బడ్జెట్‌పై సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget