అన్వేషించండి

KTR: '8 మంది బీజేపీ ఎంపీలుంటే రూ.8లు కూడా రాలేదు' - బీహార్, ఏపీ బడ్జెట్‌లా ఉందంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Union Budget 2024: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పేరు ప్రస్తావించకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం కొన్ని రాష్ట్రాలకే నిధులు కేటాయించడం బాధాకరమన్నారు.

KTR Sensational Comments On Union Budget 2024: తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇచ్చినా.. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో తెలంగాణకు రూ.8 లు కూడా కేటాయించలేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అసహనం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మరోసారి మొండిచేయి చూపించారని.. బడ్జెట్‌లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమని అన్నారు. రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయిస్తారని ఆశించామని.. కానీ దక్కింది మాత్రం శూన్యమని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది కేంద్ర బడ్జెటా.? లేక బీహార్, ఏపీ బడ్జెటా.? అని చాలామంది అనుకుంటున్నట్లు చెప్పారు. 'రూ.48.21 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టినా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్ద పీట వేశారు. తెలంగాణకు మరోసారి గుండు సున్నానే దక్కింది. ములుగు వర్శిటీకి అదనపు నిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుకు ఎన్నిసార్లు జాతీయ హోదా అడిగినా పట్టించుకోలేదు.' అంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

'తెలంగాణ ప్రజలు ఆలోచించాలి'

తెలంగాణ సీఎం, మంత్రులు ఢిల్లీ వెళ్లి అడిగినా కేంద్రం పట్టించుకోలేదని.. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు 16 స్థానాలను ఇస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని కేటీఆర్ అన్నారు. 16 స్థానాలున్న ఏపీ, 12 సీట్లున్న బీహార్‌కు కేంద్ర బడ్జెట్‌లో దక్కిన నిధులు చూసి ఆలోచించాలని.. ఎందుకు ప్రాంతీయ శక్తులను బలోపేతం చేసుకోవాలి మరోసారి ఈ బడ్జెట్ తెలియజేస్తుందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా పార్లమెంట్‌లో మాట్లాడలేదని విమర్శించారు.

ఏపీకి నిధులపై..

అయితే, కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఎక్కువ నిధులు కేటాయించినందుకు తమకు బాధ లేదని.. సోదర రాష్ట్రంగా వారికి వచ్చిన కేటాయింపులు, వారు బాగుండాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్ అన్నారు. ఏపీ విభజన చట్టం పేరు చెప్పి తెలంగాణ డిమాండ్లు మాత్రం కేంద్రం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. 'ఏపీ విభజనం చట్టం పేరు చెప్పి తెలంగాణ రాష్ట్ర డిమాండ్లను మాత్రం పట్టించుకోవడం లేదు. అమరావతి, పోలవరంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి నిధులు ఇస్తాం అన్నారు. ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్లకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఏపీ, బీహార్‌కు మాత్రమే ఇచ్చి మిగిలిన రాష్ట్రాలను చిన్న చూపు చూడడం నిజంగా బాధాకరం.' అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఎందుకింత నిర్లక్ష్యం.?

కేంద్ర బడ్జెట్‌లో కనీసం తెలంగాణ పదమే పలకలేదని.. బీజేపీ, కాంగ్రెస్ కలిసి తెలంగాణకు అన్యాయం చేశాయని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. ఏపీకి నిధులు కేటాయించడం సంతోషమేనని.. అయితే బడ్జెట్‌లో కనీసం తెలంగాణ ప్రస్తావన లేదని అన్నారు. 'తెలంగాణ ప్రజలంటే బీజేపీ, కేంద్రానికి ఎందుకింత నిర్లక్ష్యం.? పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వొచ్చు కదా.?. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావనే లేదు. తెలంగాణ నుంచి ఎన్నికైన 8 మంది బీజేపీ ఎంపీలు తెలంగాణకు నిధుల్లో వాటా తేవాలి.' అని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Also Read: Memes on Budget : బీహార్, ఏపీకే నిధులు - నిర్మలమ్మ బడ్జెట్‌పై సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
ABP Network Ideas Of India 2025: గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
NTR Neel Movie :'డ్రాగన్' కోసం ఎన్టీఆర్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్... ప్రశాంత్ నీల్ ఈ మ్యాగ్నమ్ ఓపస్ కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు చేస్తున్నాడో తెలుసా?
'డ్రాగన్' కోసం ఎన్టీఆర్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్... ప్రశాంత్ నీల్ ఈ మ్యాగ్నమ్ ఓపస్ కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు చేస్తున్నాడో తెలుసా?
Free Health Insurance Scheme In AP: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్‌- త్వరలోనే ఉచిత ఆరోగ్య బీమా పథకం అమలు 
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్‌- త్వరలోనే ఉచిత ఆరోగ్య బీమా పథకం అమలు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ideas of India 2025 : ఏబీపీ నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ Atideb Sarkar ప్రారంభోపన్యాసం | ABP DesamIdeas of India 2025 | ముంబైలో ప్రారంభమైన ఐడియాస్ ఆఫ్ ఇండియా సదస్సు | ABP DesamBan vs Ind Match Highlights Champions Trophy 2025 | యువరాజు సెంచరీ..సూపర్ విక్టరీతో..మినీ వరల్డ్ కప్ వేట ఆరంభం | ABP DesamKadiyam Costly Bonsai Plant | చెట్టు దుంగలా కనిపిస్తున్న ఈ మొక్క రేట్ ఎంతో తెలుసా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
ABP Network Ideas Of India 2025: గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
NTR Neel Movie :'డ్రాగన్' కోసం ఎన్టీఆర్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్... ప్రశాంత్ నీల్ ఈ మ్యాగ్నమ్ ఓపస్ కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు చేస్తున్నాడో తెలుసా?
'డ్రాగన్' కోసం ఎన్టీఆర్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్... ప్రశాంత్ నీల్ ఈ మ్యాగ్నమ్ ఓపస్ కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు చేస్తున్నాడో తెలుసా?
Free Health Insurance Scheme In AP: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్‌- త్వరలోనే ఉచిత ఆరోగ్య బీమా పథకం అమలు 
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్‌- త్వరలోనే ఉచిత ఆరోగ్య బీమా పథకం అమలు 
HYDRA Latest News: హైడ్రా భుజాన తుపాకీ పెట్టి కాలుస్తున్నారు, రద్దు చేస్తాం జాగ్రత్త- హైకోర్టు సంచలన వ్యాఖ్యలు 
హైడ్రా భుజాన తుపాకీ పెట్టి కాలుస్తున్నారు, రద్దు చేస్తాం జాగ్రత్త- హైకోర్టు సంచలన వ్యాఖ్యలు 
Tirupati News: తిరుపతి మేయర్‌పై కార్పొరేటర్ల అసంతృప్తి- వచ్చే నెలలో   అవిశ్వాస తీర్మానం పెట్టే ఛాన్స్
తిరుపతి మేయర్‌పై కార్పొరేటర్ల అసంతృప్తి- వచ్చే నెలలో అవిశ్వాస తీర్మానం పెట్టే ఛాన్స్
Sourav Ganguly Accident: సౌరవ్‌ గంగూలీకి తప్పిన ముప్పు- కారును ఢీ కొట్టిన లారీ - వెస్ట్‌బెంగాల్‌లో దుర్ఘటన 
సౌరవ్‌ గంగూలీకి తప్పిన ముప్పు- కారును ఢీ కొట్టిన లారీ - వెస్ట్‌బెంగాల్‌లో దుర్ఘటన 
Daaku Maharaaj : 'డాకు మహారాజ్' నుండి ఊర్వశి రౌతేలా సీన్స్​ను నెట్‌ఫ్లిక్స్ నిజంగానే తొలగించిందా? ఈ వార్తల్లో నిజం ఎంతంటే ?
'డాకు మహారాజ్' నుండి ఊర్వశి రౌతేలా సీన్స్​ను నెట్‌ఫ్లిక్స్ నిజంగానే తొలగించిందా? ఈ వార్తల్లో నిజం ఎంతంటే ?
Embed widget