By: Ram Manohar | Updated at : 19 Mar 2023 04:16 PM (IST)
బంగ్లాదేశ్లో బస్సు అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో 17 మంది మృతి చెందారు. (Image Credits: Twitter)
Bangladesh Bus Accident:
17 మంది మృతి..
బంగ్లాదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 7.30 నిముషాలకు ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలిపారు. దగ్గర్లోని పలు ఆసుపత్రులకు వీరిని తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు మెకానికల్ ఫెయిల్యూర్ కారణంగా ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధరించారు. ఓ టైర్ పేలిపోయి బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయినట్టు స్థానిక మీడియా చెబుతోంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులున్నారు. బంగ్లాదేశ్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అక్కడి రహదారుల నిర్మాణంలో లోపాలున్నాయని, డ్రైవర్లకూ సరైన రీతిలో శిక్షణ ఇవ్వడం లేదన్న ఆరోపణలున్నాయి.
Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్న సీఎం జగన్
Hindenburg Research: మరో బాంబ్ పేల్చిన హిండెన్బర్గ్, కొత్త రిపోర్ట్పై సిగ్నల్
Chaitra Navratri 2023: 100 మందిని సన్యాసులుగా మార్చేయనున్న రామ్దేవ్ బాబా, ముహూర్తం కూడా పెట్టేశారు
QR code on Tombstone: కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్, జ్ఞాపకాలను సజీవంగా దాచిన కుటుంబం
New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా
KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ
NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల
‘సూర్య’కుమార్ కాదు, ‘శూణ్య’కుమార్- 3 డకౌట్లతో మిస్టర్ 360ని ఆటాడుకుంటున్న నెటిజన్లు