అన్వేషించండి

Telangana MLC Elections 2025:తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌

Telangana MLC Elections 2025:తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో సత్తా చాటినందుకు బీజేపీ శ్రేణులను అభినందించారు ప్రధానమంత్రి మోదీ. ప్రజలకు కృతజ్ఞత చెబుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Telangana MLC Elections 2025: తెలంగాణలో ఈ మధ్య జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండింటిని బీజేపీ కైవశం చేసుకోవడంతో ఆ పార్టీలో కొత్త జోష్ నింపింది. ఉమ్మడి కరీంనగర్‌- ఆదిలాబాద్‌- నిజామాబాద్‌- మెదక్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం, ఇక్కడి టీచర్స్‌ సీటు కూడా బీజేపీలో ఖాతాలో పడింది. బిజెపి అభ్యర్థులుగా మల్క కొమరయ్య, చిన్నమైల్‌ అంజిరెడ్డి ఘన విజయం సాధించారు. అంతేకాదు ఉమ్మడి వరంగల్- నల్గొండ- ఖమ్మం టీచర్ నియోజకవర్గంలో విజయం సాధించిన పిఆర్టియు టీఎస్ అభ్యర్థి ఎంగిలి శ్రీపాల్ రెడ్డికి కూడా బీజేపీ మద్దతు ప్రకటించింది. మొత్తానికి మూడు ఎన్నికల్లో బీజేపీ పై చేయి సాధించిందని చెప్పవచ్చు. 

మూడు ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో కచ్చితంగా గెలవాలని చెప్పి కాంగ్రెస్ తీవ్రంగా శ్రమించింది. ఇందులో ఒకటి సిట్టింగ్ స్థానం కావడంతో మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రి కూడా ప్రచారం చేశారు. అయిన పరాభవం తప్పలేదు. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ సొంత జిల్లా నిజామాబాద్‌లో కూడా కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు పడలేదని అంటున్నారు. అధికారంలో ఉండి కూడా మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ ఓడిపోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.  

అదే టైంలో బీజేపీకి నేతలకు కొత్త ఉత్సాహం ఇచ్చింది. భవిష్యత్ మాదే అని ప్రచారం చేస్తున్నట్టుగానే ప్రజలు తీర్పు ఇవ్వడం వారి వ్యూహాలకు మరింత పదును పెట్టనున్నారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. బీజేపీ అభ్యర్థులకు అవకాశం ఇచ్చిన ప్రజలకు మోదీ కృతజ్ఞత తెలిపారు. ఎన్నికల్లో కష్టపడిన పార్టీ శ్రేణులను అభినందించారు. "MLC ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కొత్తగా ఎన్నికైన మా అభ్యర్థులకు అభినందనలు. శ్రద్ధతో ప్రజల మధ్య ఉంటూ ఎంతో అభ్యర్థుల విజయానికి శ్రమించిన మా పార్టీ కార్యకర్తలను చూసి నేను చాలా గర్వపడుతున్నాను." అని ట్వీట్ చేశారు. 

తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల ఫలితాలు రెండు రోజుల క్రితమే వచ్చేశాయి. రాత్రి మూడో స్థానం ఫలితం వచ్చింది. ఉమ్మడి కరీంనగర్‌- ఆదిలాబాద్‌- నిజామాబాద్‌- మెదక్‌ జిల్లాల పట్టభద్రుల స్థానం ఫలితాన్ని అర్థరాత్రి ప్రకటించారు. బీజేపీ తరఫున పోటీ చేససిన చిన్నమైల్‌ అంజిరెడ్డి విజయం సాధించినట్టు వెల్లడించారు.  కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అల్ఫోర్స్‌ నరేందర్‌రెడ్డిపై 5,106 ఓట్ల తేడాతో విక్టరీ కొట్టారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాగుతున్న లెక్కింపు ప్రక్రియ బుధవారం రాత్రి 9 గంటలకు ముగిసింది. ఈ స్థానం కోసం మొత్తం 56 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.  

మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు సాగింది. చివరకు రెండో ప్రాధాన్యత ఓట్లతో విజేతను నిర్ణయించారు. బీజేపీ అభ్యర్థికి 98,637 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి 93,531 ఓట్లు వచ్చాయి. 28,686 ఓట్లు చెల్లకుండా పోయాయి. మొత్తం 11 రౌండ్లలో లెక్కింపు జరిగింది. ఉమ్మడి కరీంనగర్‌- ఆదిలాబాద్‌- నిజామాబాద్‌- మెదక్‌ జిల్లాల ఎమ్మెల్సీ స్థానం కాంగ్రెస్‌కు సిట్టింగ్ స్థానం. ఉత్తర తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ బీజేపీ గెలుచుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా విశ్లేషకులు భావిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Allu Arjun Political Party Rumors: ఐకాన్ స్టార్ టు పొలిటికల్ స్టార్? అల్లు అర్జున్ నయా పార్టీ ప్రచారం వెనుక అసలు నిజమెంత?
ఐకాన్ స్టార్ టు పొలిటికల్ స్టార్? అల్లు అర్జున్ నయా పార్టీ ప్రచారం వెనుక అసలు నిజమెంత?
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget