అన్వేషించండి

Telangana MLC Election Results 2025: కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్‌ ఫైర్‌! రేవంత్ రెడ్డికి టీచర్స్, పట్టభద్రుల పవర్‌ఫుల్ మెసేజ్‌!

Telangana MLC Election Results 2025:రేవంత్ రెడ్డి సర్కార్‌కు పట్టభద్రులు, టీచర్స్ పవర్‌ఫుల్ మెసేజ్ ఇచ్చారు. కమలానికి బూస్టులా మారిన ఎన్నికలపై విశ్లేషకులు ఏమంటున్నారు?

Telangana MLC Election Results 2025: తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా విషయాలను చెబుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు స్పష్టమైన సిగ్నల్స్ అన్ని పార్టీలకు పంపించారు. ఇక్కడ మూడు స్థానాలకు ఎన్నికలు జరిగితే రెండింటిని బీజేపీ గెలుచుకుంది. ఇది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి డేంజర్ బెల్స్‌ లాంటి ఫలితాలు. అందుకే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి మేల్కోవాల్సిన టైం వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు ప్రధానమైన గ్యారంటీలు ప్రజలకు ఇచ్చింది. వాటిని అమలు చేయడంలో తడబడుతోంది. అదే ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై స్పష్టంగా కనిపించింది. మహిళలకు ఉచిత బస్ హామీ ఒక్కటి తప్ప వేరే పథకాలు ఏవీ కూడా ప్రజలకు సరిగా అందడం లేదన్నది వినిపిస్తున్న మాట. అందుకే తాము ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని కాంగ్రెస్ నేతలే అంటున్నారు. వాటిని రూఢీ చేశాయని ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది వారి అభిప్రాయం. 

అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడానికి ఆపుసోపాలు పడుతోంది. వచ్చిన రోజే మహిళలకు ఫ్రీ బస్‌ పథకాన్ని అమలు చేసింది. తర్వాత ఆరోగ్య శ్రీలో రోగాల సంఖ్యతోపాటు అందులో కవర్ అయ్యే సొమ్మును కూడా పెంచింది. అక్కడికి ఏడాది తర్వాత రైతు రుణమాఫీ అమలులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మిగతా పథకాలు అమలుపరిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 

హామీల అమలులో తడబాటు

భారీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఖాళీ ఖజానా చూసి నివ్వెరపోయిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆర్థిక స్థితిగతులు తెలియకుండా హామీలు ఇవ్వడం ఏంటనే విమర్శ కూడా ఉండనే ఉంది. అందుకే ప్రజలు కాంగ్రెస్ పాలన పట్ల సంతృప్తికరంగా లేరని అంటున్నారు. అదే ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌లో స్పష్టమైంది. ప్రజల్లో ఉన్న కాస్త అసంతృప్తిని మరింతగా మండేలా ప్రతిపక్షాల ప్రచారం చేసిందని చెప్పాలి. ఓవైపు బీఆర్‌ఎస్, మరోవైపు బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. 

కత్తులు దూసుకుంటున్న నేతలు 

కాంగ్రెస్‌ డీఎన్‌ఏలో ఉన్న కుమ్ములాటలు ఇక్కడ కూడా సర్వసాధారణైపోయాయి. బయటకు అందకూ ఒక్కటిగా ఉన్నట్టే కనిపిస్తున్నప్పటికీ లుకలుకలు మాత్రం లోచెదలా పార్టీని, ప్రభుత్వాన్ని బలహీనపరుస్తున్నాయన్నది నిజం. ఎన్నికల తర్వాత పార్టీ బలోపేతానికి కానీ, ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పి కొట్టే ప్రతి వ్యూహం కాంగ్రెస్‌కు లేకుండా పోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆ పార్టీకి ముగ్గురు ఇన్‌ఛార్జ్‌లు మారారు. కానీ పార్టీలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ప్రత్యర్థులు దూసుకొస్తుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం తమపై తాము కత్తులు దూసుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడానికి ఇది కూడా ఓ కారణం.   

స్ట్రాంగ్ మెసేజ్

అన్నింటి కంటే ముఖ్యం మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసింది ఏదో తాయిళాలకు ఆశపడి వాళ్లు కాదు. అక్షరాస్యులు. అందరి కంటే ప్రభుత్వంపై వీరు పెట్టుకున్న ఆశలే ఎక్కువ. నిరుద్యోగ భృతి, ఉద్యోగ క్యాలెండర్ వంటి హామీలు పట్టభద్రులకు ఇచ్చింది కాంగ్రెస్, ఉపాధ్యాయులకు కూడా చాలా హమీలు ఇచ్చింది. ఏ హామీని కూడా నిలబెట్టుకోలేకపోయింది. ఇలాంటి చేదు ఫలితాలకు ఇవి కూడా మరో కారణం. అందుకే వీరు పంపించిన సిగ్నల్స్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేల్కొలుపు అంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ సర్కారు ఉన్నప్పుడు పట్టభద్రుల స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో వైసీపీ అభ్యర్థి ఓడిపోయారు. ఆ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. దీనిపై అప్పటి అధికార పార్టీ నేతలు మాట్లాడుతూ.... వాళ్లు తమ ఓటర్లు కారని అందుకే ఓడిపోయామన్నారు. తమ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వాళ్లు మాత్రమే వేరే ఉన్నారని వాళ్లే వచ్చే ఎన్నికల్లో తమకు ఓట్లు వేస్తారని భ్రమ పడ్డారు. కానీ డిగ్రీ చేసిన వాళ్లు మరికొందర్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తారని, వారి ఫ్యామిలీ మెంబర్స్‌ కూడా పథకాలు అందుకున్న వాళ్లే అన్న సంగతి మర్చిపోయారు. ఇదే వారి ఓటమికి మొదటి అడుగు వేసేలా చేసింది. 

రేవంత్ రెడ్డి అధికారులకు కత్తెర

ఇప్పటి వరకు ప్రభుత్వంలో, పార్టీలో రేవంత్ రెడ్డి ఏం చెబితే అది జరిగింది. మొత్తం తానే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఇప్పుడు ఈ ఓటమి ఆయన అధికారాలకు కత్తెర వేసే ఛాన్స్ లేకపోలేదనే వాదన ఉంది. ఆయనకు బయట శత్రువులు కంటే లోపల అంటే పార్టీలో ఉన్న ప్రత్యర్థులే ఎక్కువగా ఉన్నారు. అది ఆయన కేరీర్‌ను ప్రమాదంలోకి నెట్టేస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రేవంత్‌పై అధిష్ఠానానికి నమ్మకాలు సన్నగిల్లుతున్నాయనే ప్రచారం నడుస్తోంది. అపాయింట్‌మెంట్‌లు కూడా దొరకడం లేదనే మాటలు కూడా వినిపించాయి. 

తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను విశ్లేషించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తప్పులు జరగడం సహజమని వాటిని తెలుసుకొని సరి చేసుకొని ముందడుగు వేయడమే అసలైన నాయకత్వ పటిమకు నిదర్శనమని అంటున్నారు. ఓవైపు కాంగ్రెస్‌పై ప్రజల్లో అసంతృప్తి పెరగడమే కాకుండా బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోందనే భావన బలపడటం ప్రభుత్వానికి మంచిది కాదని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. బీజేపీని లైట్ తీసుకుంటే అసలకే ఎసరు వస్తుందని హెచ్చరిస్తున్నారు. 

Also Read :పట్టభద్రుల ఎమ్మెల్సీని గెల్చుకున్న బీజేపీ - హోరాహోరీ పోరులో ఓడిపోయిన కాంగ్రెస్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati YCP Strategy: పార్లమెంట్‌లో అమరావతిని వైసీపీ సమర్థిస్తుందా? వ్యతిరేకిస్తుందా?
పార్లమెంట్‌లో అమరావతిని వైసీపీ సమర్థిస్తుందా? వ్యతిరేకిస్తుందా?
BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
Tamil Nadu Elections 2026: పొత్తుల్లో ఉన్నా.. డీఎంకే, అన్నాడీఎంకే గుర్తులపైనే పోటీ - తమిళ రాజకీయాల్లో చిన్న పార్టీల స్టైల్ - ఇలా ఎలా ?
పొత్తుల్లో ఉన్నా.. డీఎంకే, అన్నాడీఎంకే గుర్తులపైనే పోటీ - తమిళ రాజకీయాల్లో చిన్న పార్టీల స్టైల్ - ఇలా ఎలా ?
KCR Disqualification: అసెంబ్లీకి రాని కేసీఆర్ - రేవంత్ అనర్హతా వేటు వ్యూహం అమలు చేస్తారా?
అసెంబ్లీకి రాని కేసీఆర్ - రేవంత్ అనర్హతా వేటు వ్యూహం అమలు చేస్తారా?

వీడియోలు

Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam
Rohit Sharma Fastest Half Century IPL 2026 | ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ | ABP Desam
Rohit Dance in Front of Injured Rahane | రహానే కింద పడిపోతే.. రోహిత్ డాన్స్ | ABP Desam
Rahane Innings KKR vs MI IPL 2026 | వాంఖడేలో కేకేఆర్ పరుగుల విధ్వంసం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
Third Temple In Israel: ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
Manisharma : హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్
హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్
Explosion at Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.. Toyota Innova Hycross ఇప్పుడు కొత్త అవతార్‌లో వచ్చేస్తోంది
ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.. Toyota Innova Hycross ఇప్పుడు కొత్త అవతార్‌లో వచ్చేస్తోంది
Today LPG, CNG, PNG Costs : LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ
LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ
Embed widget