అన్వేషించండి

Sai Durga Tej: విజయవాడ అమ్మ అనాథాశ్రమానికి వెళ్లి మరీ విరాళం అందజేసిన సాయి దుర్గా తేజ్...

Sai Durga Tej: హీరో సాయి దుర్గ తేజ్ త‌న మంచి మ‌న‌సు చాటుకున్నారు. వ‌ర‌ద‌ల్లో ఇబ్బందులు ప‌డిన వారికి చేయూతనిచ్చిన ఆయ‌న‌.. ఇప్పుడు విజ‌య‌వాడ అమ్మ అనాథాశ్ర‌మానికి విరాళం అందించారు.

ఎవ‌రికి ఏ క‌ష్టం వచ్చినా, ప్ర‌జ‌లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్న ఆదుకునేందుకు మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ముందు ఉంటుంది. ఇటీవ‌ల కేర‌ళ వ‌ర‌ద‌ల్లో ఇబ్బంది ప‌డిన వారికి, తెలుగు రాష్టాల్లో వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు త‌మ‌వంతు సాయం చేశారు మెగా హీరోలు. అలా సాయం చేసిన వారిలో ఒక‌రు సాయి దుర్గ్ తేజ్ కూడ. ఇప్ప‌టికే తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు సాయం అందించిన ఆయ‌న ఇప్పుడు ఒక ఆశ్ర‌మాన్ని ఆదుకున్నారు. 

అమ్మ అనాథాశ్రమానికి  విరాళం

సాయి దుర్గ్ తేజ్ ఎప్పుడూ సేవా కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటుంటారు. ఎన్నో సందర్భాల్లో ఛారిటీ కార్యక్రమాలు చేసి తన మంచి మనసు చాటుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో ఇబ్బంది పడిన తెలుగు ప్రజలను ఆదుకునేందుకు తన వంతుగా రూ. 20 లక్షల‌ను విరాళంగా ఇచ్చారు ఆయ‌న‌. తాజాగా ఆయన విజయవాడలో పర్యటించి అమ్మ అనాథాశ్రమానికి రూ. 2 ల‌క్ష‌ల రూపాయ‌లు అందిచారు. దాంతో పాటుగా ఇత‌ర సేవా సంస్థ‌ల‌కు కూడా రూ. 3 ల‌క్ష‌లు విరాళం అందించారు. బుధ‌వారం విజ‌య‌వాడ చేరుకున్న ఆయ‌న‌.. క‌న‌క‌దుర్గ అమ్మ‌వారిని ద‌ర్శించుకుని, ఆ త‌ర్వాత ఆశ్ర‌మానికి వెళ్లారు. 

ఆశ్ర‌మానికి సొంత భ‌వ‌నం నిర్మాణం

విజ‌య‌వాడ‌లోని అమ్మ ఆశ్రమానికి సొంత భవనం కట్టిస్తానని 2019లో తన పుట్టినరోజున మాటిచ్చారు సాయి దుర్గా తేజ్. చెప్పిన మాట‌ను నిల‌బెట్టుకున్నారు. 2021లో బిల్డింగ్ క‌ట్టించారు. అంతే కాకుండ మూడేళ్లు ఆ ఆశ్ర‌మాన్ని దత్తత తీసుకున్న ఆయ‌న మొత్తం ఖర్చులన్నీ భరించారు. ఆయ‌న చేసిన మంచి ప‌నుల‌కు ఆశ్ర‌మ‌వాసులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. త‌న మేన‌మామ‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ నుంచి సేవా గుణాన్ని పుణికిపుచ్చుకున్నాడు అంటూ పొగుడుతున్నారు. ఇలానే వీలైనంతలో సేవా కార్య‌క్ర‌మాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాల‌ని ఆశీర్వ‌దిస్తున్నారు ఆశ్ర‌మ పెద్ద‌లు. 

సాయి దుర్గా తేజ్ కేవ‌లం సామాజిక సేవ చేయడం మాత్ర‌మే కాదు... సామాజిక అంశాల‌పై కూడా స్పందిస్తుంటారు. ఇటీవ‌ల ఒక యూట్యూబ‌ర్ తండ్రి, కూతుళ్ల వీడియోపై కామెంట్స్ చేశారు. దాన్ని తెలంగాణ సీఎం, ఏపీ ప్ర‌భుత్వం దృష్టికి తీసుకొచ్చి చ‌ర్య‌లు తీసుకునేలా చేశారు ఆయ‌న‌.

సేవా కార్య‌క్ర‌మాల్లో ఎప్పుడూ ముందు వ‌రుస‌లోనే 

కేవ‌లం సాయి దుర్గ్ తేజ్ మాత్ర‌మే కాదు.. మెగా ఫ్యామిలీలోని ప్ర‌తి ఒక్క‌రు సేవా కార్య‌క్ర‌మాల్లో ముందు ఉంటారు. ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్, ఐ బ్యాంక్ న‌డుపుతున్న విష‌యం తెలిసిందే. ఇక విప‌త్తులు ఎన్ని వ‌చ్చినా త‌మ‌వంతు సాయం అందిస్తారు వాళ్లంతా. కేర‌ళలోని వ‌య‌నాడ్ లో వ‌ర‌ద‌లు సంభ‌వించిన‌ప్పుడు చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్, అల్లు అర్జున్ స్పందించి త‌మ సాయాన్ని ప్ర‌క‌టించారు. తెలుగు రాష్ట్రాల‌కు కూడా మెగా ఫ్యామిలీ నుంచి భారీగానే విరాళాలు వ‌చ్చాయి. చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్, అల్లు అర్జున్, సాయి దుర్గా తేజ్, వ‌రుణ్ తేజ్, నిహారికా కొణిదెల త‌దిత‌రులు విరాళాలు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న‌ప్ప‌టికీ త‌న ప‌ర్స‌నల్ డ‌బ్బుల నుంచి రిలీఫ్ ఫండ్ ప్ర‌క‌టించారు. 

Also Read: శర్వా 37లో సంయుక్త... శాస్త్రీయ నృత్యం చేస్తున్న దియా - ఫస్ట్ లుక్ చూశారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget