అన్వేషించండి

Harish Rao Challenges Revanth Reddy: SLBCపై నిరూపిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా! సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్

SLBC Tunnel Project | ఇటీవల ప్రమాదం జరిగిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టులో బీఆర్ఎస్ హయాంలో ఏ పనులు జరగలేదని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరూపిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానన్నారు.

Harish Rao challenges CM Revanth Reddy over SLBC Tunnel Project | హైదరాబాద్: బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (SLBC Tunnel) ప్రాజెక్టులో ఎలాంటి పనులు జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాజెక్టులో పనులు జరగలేదని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానని.. నిరూపించలేకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తావా అని రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు. ఓ వైపు కులగణనపై గందరగోళం సృష్టిస్తూ అన్ని సామాజిక వర్గాల మధ్య చిచ్చుపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. 10 రోజులు గడుస్తున్నా టన్నెల్ లోపల గల్లంతైన వారి జాడ సైతం కనిపెట్టలేకపోవడం దారుణం అన్నారు. 

కేసీఆర్ హయాంలో తెలంగాణలో లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించారు. కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేసి సాగునీరు అందించాం. పలు ప్రాజెక్టుల ద్వారా నీటిని ఎత్తిపోసి లక్షల ఎకరాలు తడిపిన ఘనత కేసీఆర్ దేనని హరీష్ రావు, కేటీఆర్ చెబుతున్నారు. కేసీఆర్ ప్రతిష్ట ను దెబ్బతీసేందుకే రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పరిశీలించిన రేవంత్, బీఆర్ఎస్ పాలకులపై విమర్శలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లి పరిశీలించారు. రెస్క్యూ టీమ్ ను, అధికారులను సహాయక చర్యల పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే రోబోలను రంగంలోకి దించాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గత బీఆర్ఎస్ హయాంలో దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందని, ఉత్తర తెలంగాణతో పోల్చితే ఇక్కడి ప్రజలకు అన్యాయం చేశారని ఆరోపించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఏపీకి కృష్ణా జలాల తరలింపుపై సంతకాలు చేశారు.. కానీ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పూర్తి చేసి నల్గొండకు సాగునీరు, తాగునీరు ఇవ్వడాన్ని నిర్లక్ష్యం చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పాలకులు చేసిన పాప ఫలితమే ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదమని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ తీవ్రంగా స్పందించారు. పాలన చేతకాక తమపై విమర్శలు చేయడం సరికాదని రేవంత్ రెడ్డికి హితవు పలికారు.

రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మండిపాటు..

‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. SLBC టన్నెల్ లో ప్రమాదం జరిగిన తరువాత ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరు రోజుల సమయం ఇచ్చిన తరువాత సందర్శనకు వచ్చింది. కానీ ప్రతిపక్ష నేతలను ఘటనా స్థలాన్ని సందర్శించకుండా అడ్డుకున్నారు. ఎస్ఎల్‌బీసీని తన బ్రెయిన్ చైల్డ్ గా చెప్పుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుబాయ్ టూర్ వెళ్లి తీరిగ్గా వచ్చారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ప్రశాంతంగా చేపల కూర వండించుకుని తిన్నారు. 8 మంది లోపల చిక్కుకుపోయిన ప్రాంతాన్ని మంత్రులు, కాంగ్రెస్ నేతలు టూరిస్ట్ స్పాట్ గా మార్చుకున్నారు’ అని బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ దుమారం రేపుతోంది. 

Also Read: SLBC Tunnel Rescue Operation: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్, అవసరమైతే రోబోలు వాడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ippa Flower: తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న ఇప్ప పువ్వు ప్రత్యేకతలేంటి? సారా తయారీ విధానం, జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలేంటి?
తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న ఇప్ప పువ్వు ప్రత్యేకతలేంటి? సారా తయారీ విధానం, జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలేంటి?
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
Yadadri Crime News: భార్యపై కోపంతో పండులో ఎలుకల మందు కలిపి కుమార్తె హత్య, ఆపై తండ్రి ఆత్మహత్యాయత్నం
భార్యపై కోపంతో పండులో ఎలుకల మందు కలిపి కుమార్తె హత్య, ఆపై తండ్రి ఆత్మహత్యాయత్నం
Semaglutide: సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 

వీడియోలు

White Ball Turns Pink in PSL 2026 | పాక్ క్రికెట్ పరువు తీసిన పింక్ బాల్ | ABP Desam
Preity Zinta apologises to Jitesh Sharma | జితేశ్‌ శర్మకు సారీ చెప్పిన ప్రీతి జింటా | ABP Desam
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
Commercial gas: హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
Bellamkonda Sai Sreenivas : ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
GST scam busted: ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
IPL 2026 Schedule: ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్‌పై ఈ పది విషయాలు గుర్తించారా? LSGకి అన్యాయం?
ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్‌పై ఈ పది విషయాలు గుర్తించారా? LSGకి అన్యాయం?
Kerala Elections 2026: కేరళలో మారుతున్న సంప్రదాయ రాజకీయం - త్రిముఖ పోరుగా మారిన అసెంబ్లీగా ఎన్నికలు
కేరళలో మారుతున్న సంప్రదాయ రాజకీయం - త్రిముఖ పోరుగా మారిన అసెంబ్లీగా ఎన్నికలు
AP PNG Subsidy: ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
US Iran War: ఇరాన్‌పై దాడులకు అమెరికా మరో 10 రోజులు బ్రేక్.. డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ ఏంటీ?
ఇరాన్‌పై దాడులకు అమెరికా మరో 10 రోజులు బ్రేక్.. డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ ఏంటీ?
Embed widget