అన్వేషించండి

Harish Rao Challenges Revanth Reddy: SLBCపై నిరూపిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా! సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్

SLBC Tunnel Project | ఇటీవల ప్రమాదం జరిగిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టులో బీఆర్ఎస్ హయాంలో ఏ పనులు జరగలేదని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరూపిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానన్నారు.

Harish Rao challenges CM Revanth Reddy over SLBC Tunnel Project | హైదరాబాద్: బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (SLBC Tunnel) ప్రాజెక్టులో ఎలాంటి పనులు జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాజెక్టులో పనులు జరగలేదని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానని.. నిరూపించలేకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తావా అని రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు. ఓ వైపు కులగణనపై గందరగోళం సృష్టిస్తూ అన్ని సామాజిక వర్గాల మధ్య చిచ్చుపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. 10 రోజులు గడుస్తున్నా టన్నెల్ లోపల గల్లంతైన వారి జాడ సైతం కనిపెట్టలేకపోవడం దారుణం అన్నారు. 

కేసీఆర్ హయాంలో తెలంగాణలో లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించారు. కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేసి సాగునీరు అందించాం. పలు ప్రాజెక్టుల ద్వారా నీటిని ఎత్తిపోసి లక్షల ఎకరాలు తడిపిన ఘనత కేసీఆర్ దేనని హరీష్ రావు, కేటీఆర్ చెబుతున్నారు. కేసీఆర్ ప్రతిష్ట ను దెబ్బతీసేందుకే రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పరిశీలించిన రేవంత్, బీఆర్ఎస్ పాలకులపై విమర్శలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లి పరిశీలించారు. రెస్క్యూ టీమ్ ను, అధికారులను సహాయక చర్యల పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే రోబోలను రంగంలోకి దించాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గత బీఆర్ఎస్ హయాంలో దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందని, ఉత్తర తెలంగాణతో పోల్చితే ఇక్కడి ప్రజలకు అన్యాయం చేశారని ఆరోపించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఏపీకి కృష్ణా జలాల తరలింపుపై సంతకాలు చేశారు.. కానీ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పూర్తి చేసి నల్గొండకు సాగునీరు, తాగునీరు ఇవ్వడాన్ని నిర్లక్ష్యం చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పాలకులు చేసిన పాప ఫలితమే ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదమని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ తీవ్రంగా స్పందించారు. పాలన చేతకాక తమపై విమర్శలు చేయడం సరికాదని రేవంత్ రెడ్డికి హితవు పలికారు.

రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మండిపాటు..

‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. SLBC టన్నెల్ లో ప్రమాదం జరిగిన తరువాత ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరు రోజుల సమయం ఇచ్చిన తరువాత సందర్శనకు వచ్చింది. కానీ ప్రతిపక్ష నేతలను ఘటనా స్థలాన్ని సందర్శించకుండా అడ్డుకున్నారు. ఎస్ఎల్‌బీసీని తన బ్రెయిన్ చైల్డ్ గా చెప్పుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుబాయ్ టూర్ వెళ్లి తీరిగ్గా వచ్చారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ప్రశాంతంగా చేపల కూర వండించుకుని తిన్నారు. 8 మంది లోపల చిక్కుకుపోయిన ప్రాంతాన్ని మంత్రులు, కాంగ్రెస్ నేతలు టూరిస్ట్ స్పాట్ గా మార్చుకున్నారు’ అని బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ దుమారం రేపుతోంది. 

Also Read: SLBC Tunnel Rescue Operation: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్, అవసరమైతే రోబోలు వాడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget