అన్వేషించండి

YSRCP On Amaravati: 3 రాజధానులపై మారిన వైసీపీ విధానం - అమరావతికి జై కొట్టినట్లేనా ?- బొత్స సంచలనం

Three capitals : వైఎస్ఆర్‌సీపీ మూడు రాజధానుల వివాదంపై చల్లబడినట్లుగా కనిపిస్తోంది. మూడు రాజధానుల విదానం అప్పటి పరిస్థితిని బట్టి తీసుకున్నదని.. ఇప్పుడు పార్టీలో చర్చిస్తామని బొత్స చెబుతున్నారు.

Amarvati:  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడు రాజధానుల నినాదం. ఈ నినాదంతోనే ఎన్నికలకు వెళ్లిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఈ నినాదం వల్లనే ఓడిపోయామని వారు అంగీకరించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏకైక రాజధాని.. అది కూడా అమరావతి అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్లింది. ఘన విజయం సాధించింది. వచ్చే ఐదేళ్లలో అమరావతికి ఓ రూపు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో వైసీపీ విధానం ఏమిటన్నదానిపై ఆసక్తి ఏర్పడింది. మార్చుకుంటారా ... మూడు రాజధానులకే కట్టుబడి ఉంటారా అని చర్చించుకోవడం ప్రారంభించారు. ఈ సమయంలో మాజీ మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. 

శాసనమండలిలో అమరావతిని శ్మశానం అన్న బొత్స - దుమారం 

మండలిలో రాజధాని అంశంపై దుమారం రేగిన తర్వాత బొత్స సత్యనారాయణ ఇద తరహాలో బయట మాట్లాడారు. మూడు రాజదానుల విధానానికే కట్టుబడి ఉన్నారా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బొత్స సూటిగా సమాధానం ఇవ్వలేదు. మూడు రాజధానుల విధానం అనేది అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయం అన్నారు. ఇప్పుడు మళ్లీ త మపార్టీ మూడు రాజధానులకే కట్టుబడి ఉందా లేదా అన్నది తాము పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.   బొత్స సత్యనారాయణ .. కొద్ది రోజుల కిందట తమ విధానం  మూడు రాజధానులేనని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ విధానానికి కాలం చెల్లిందని.. మళ్లీ పార్టీలో చర్చిస్తామన్నారు.          

మూడు రాజధానులు అప్పటి రాజకీయాల ప్రకారం తీసుకున్న నిర్ణయం - పార్టీలో చర్చించి మళ్లీ నిర్ణయం             

వైసీపీ 2019 ఎన్నికలకు ముందు రాజధానిని మార్చబోమని ప్రజలకు హామీ ఇచ్చింది. అయితే ఎన్నికలు అయ్యాక మూడు రాజధానులు అని చెప్పి విశాఖకు పాలనను తీసుకెళ్లాలని అనుకున్నారు. కానీ ఐదేళ్ల కాలంలో ఆ పని చేయలేకపోయారు. ఈ మధ్య కాలంలో ఎన్నో వివాదాలు వచ్చాయి. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని ఇంకా అద్భుతంగా నిర్మిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట మార్చారన్న విమర్శలు వచ్చాయి. అసెంబ్లీలో అమరావతిని ఏకగ్రీవంగా ఆమోదించి కూడా జగన్ .. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులని మార్చారని విమర్శలు వచ్చాయి. అయితే వైసీపీ మాత్రం ముందుకే వెళ్లింది.            

వైసీపీకి కలసి రాని మూడు రాజధానుల నినాదం                                

జ్యూడిషియల్ క్యాపిటల్ గా ప్రకటించిన కర్నూలులోనూ... ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటించిన విశాఖలోనూ వైసీపీకి ఒక్క సీటు కూడా రాలేదు. దాంతో ప్రజలకు ఆ నినాదం నచ్చలేదని అర్థమైంది. అయితే వైసీపీ ఎన్నికల తర్వాత మూడు రాజధానుల నినాదం ఎత్తడం లేదు. అదే సమయంలో అమరావతికి కూడా వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. కానీ మద్దతుగా కూడా మాట్లాడటం లేదు. ఈ క్రమంలో బొత్స వ్యాఖ్యల ప్రకారం పార్టీలో చర్చించి అమరావతిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Rising Summit: PPP మోడల్‌ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
PPP మోడల్‌ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
Ram Mohan Naidu: ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
Advocate Rakesh Kishore: సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన
సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన

వీడియోలు

Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌
Irfan Pathan Comments on Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Rising Summit: PPP మోడల్‌ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
PPP మోడల్‌ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
Ram Mohan Naidu: ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
Advocate Rakesh Kishore: సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన
సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన
Dekhlenge Saala Song Promo: 'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
Akhanda 2 Release Updates: 'అఖండ 2'కు లైన్ క్లియర్... మద్రాస్ హైకోర్టులోని ఎరోస్ కేసులో నిర్మాతలకు ఊరట
'అఖండ 2'కు లైన్ క్లియర్... మద్రాస్ హైకోర్టులోని ఎరోస్ కేసులో నిర్మాతలకు ఊరట
Pilot Rostering Issues: భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
Amaravati Farmers: అమరావతి రైతులు ముందుకొచ్చి తమ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: మంత్రి నారాయణ
అమరావతి రైతులు ముందుకొచ్చి ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: మంత్రి నారాయణ
Embed widget