అన్వేషించండి

Women Murder: మహారాష్ట్రలో మహిళ దారుణ హత్య- తల, మొండెం వేరు చేసి ముక్కలు ముక్కలుగా!

Black Magic: పుణె సమీపంలోని విధాని గ్రామంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ మహిళ మృతదేహాన్ని పోలీసుుల గుర్తించారు.తల, కొన్ని శరీర భాగాలే లభించాయి. చేతబడి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Crime News: పుణె( Pune)లో  సమీపలోని  విధాని గ్రామం సమీపంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. తల నుంచి మొండెం వేరువేరుగా ఉన్న మహిళ శరీర భాగాలను పోలీసులు గుర్తించారు. ఓ చెరుకు తోట సమీపంలో ఛిద్రమైన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.అయితే ఆమె తల, మొండెం కింది భాగాలు మాత్రమే ఉన్నాయని... మొండి కనిపించడం లేదని  పోలీసులు తెలిపారు.
 
ఒళ్లుగగుర్పొడిచే దృశ్యం 
మహారాష్ట్ర(Maharastra)లోని పుణెకు సమీపంలోని సతారా జిల్లాలోని విధాని  అనే గ్రామంలో  ఒళ్లుగగుర్పొడిచే ఓ దృశ్యం గ్రామస్థుల కంటపడింది. తల తెగిపడిన శరీర భాగాలను  స్థానికులు గుర్తించి పోలీసుల(Police)కు సమాచారం ఇచ్చారు. ఓ చెరుకు తోట సమీపంలో  మహిళ శరీర భాగాలు కనిపించాయి.అప్పటికే  ఆ మృతదేహాం బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. అయితే ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే  అక్కడ కేవలం మహిళ తల, మొండెం కింద ఉండే  కొన్ని భాగాలు మాత్రమే ఉన్నాయి.  మొండెం మాత్రం కనిపించడం లేదు. తల తెగనరికి  మొండెం వరకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మెండెం నుంచి శరీరం కిందభాగంలోని  కొన్ని అవయవాలను మాత్రమే గుర్తించినట్లు  ఫాల్తాన్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ తెలిపారు. చేతబడి (Black Magic)కోసమే మహిళను అంతమొందించి ఉండొచ్చన్న కోణంలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో మూడనమ్మకాలపై ప్రజలకు నమ్మకం ఎక్కువ అని వారు వివరించారు. తల నుంచి మొండెం వేరు చేసి తీసుకెళ్లారంటే ఖచ్చితంగా  చేతబడి కోసమేనని అక్కడి స్థానికులు చెప్పారు.
మూడనమ్మకాలతో చేతబడి నెపంతో మహిళను హత్య చేసి మొండెం తీసుకెళ్లారా లేక మహిళపై ఏమైనా అఘాయిత్యం చేసి హతమార్చారా అన్న కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.అసలు ఆ మహిళ మృతదేహం ఎవరిది అన్నది తేలాల్సి ఉంది. ఆమె ఎవరో కనుగొంటే ఆమెకు ఉన్న గొడవలు, శత్రువులు ఎవరో తెలిసిపోతుందని పోలీసులు వివరించారు. అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్షుద్రపూజలు చేస్తే సులువుగా.. 
ఉత్తరాదిలో ఇటీవల మూడనమ్మకాలను ప్రజలు బాగా విశ్వసిస్తున్నారని పోలీసులు తెలిపారు. గత నెల డిసెంబర్‌లో ఇదే విధమైన సంఘటనలో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్షుద్రపూజలు చేస్తే సులువుగా  50 నుంచి 60 కోట్ల రూపాయలు వస్తాయని ఇద్దరు తాంత్రికులు  చెప్పిన మాటలు నమ్మి ఈ ఘోరానికి పాల్పడ్డారు. గతేడాది  జూన్‌లో  ఘజియాబాద్‌లో  ఓ మురుగునీటి కాల్వలో తల లేని మొండెం మాత్రమే ఉన్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆ కేసు లోతుగా వెళ్లి విచారణ జరిపితే...ఈ నలుగురు కలిసి అతన్ని చంపి ఆ పుర్రెతో క్షుద్ర పూజలు చేసినట్లు  నేరం అంగీకరించారు.
ఇప్పుడు అదే రీతిలో మహిళ మృతదేహాం  లభించడంతోఇది కూడా  క్షుద్రపూజలు, చేతబడి కోసమే హత్య చేసినట్లుగా అనిపిస్తోంది  పోలీసులు అంటున్నారు. రెండు హత్యలకు చాలా సారూప్యత ఉందని అంటున్నారు. అంతకు ముందు తెలంగాణలోని మెదకు జిల్లాలో చేతబడి చేస్తున్నారనే అనుమానంతో గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళను కాల్చి చంపేశారు. రామాయంపేట మండలం కత్రియల్‌లో  దుండగులు మహిళను కొట్టి పెట్రోలు పోసి నిప్పంటించి తగులబెట్టారు. ఆమె కేకలు విన్న ఇరుగుపొరుగు వారు వెంటనే అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది.
 
దాదాపు రెండేళ్ల క్రితం జరిగిన మరో  సంఘటనలో తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని తారక్‌రామ్‌నగర్‌లో ఎరుకల సంఘం సమావేశంలో  ఓ వ్యక్తిని, అతని ఇద్దరు కుమారులను కొంతమంది కలిసి దారుణంగా నరికి చంపేశారు. వారు చేతబడి చేస్తున్నారని...అందువల్లే గ్రామంలో  ఎవరికీ ఆరోగ్యం సరింగా ఉండటం లేదని ఆరోపిస్తూ  దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది. ఏఐ టెక్నాలజీతో సృష్టికి ప్రతి సృష్టి సృష్టిస్తున్నా  ఈకాలంలోనూ ఇంకా చేతబడి, బాణామతి వంటి మూడనమ్మకాలను ప్రజలు నమ్మడమే గాక.. అమాయకుల ప్రాణాలు సైతం తీస్తున్నారు. కొన్నిచోట్ల మానసికంగా కుంగిపోతున్నారు.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

JD Vance India Visit: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
Gollapudi Panchayat: ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
BCCI Retainership: బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్‌ విడుదల- అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మళ్లీ కాంట్రాక్ట్
బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్‌ విడుదల- అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మళ్లీ కాంట్రాక్ట్
KTR News: ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli PoTM IPL 2025 | ఒకే రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు తీసుకున్న రోహిత్ - విరాట్  | ABP DesaAyush Mhatre Batting | MI vs CSK IPL 2025 మ్యాచ్ ద్వారా పుట్టిన మరో కొత్త స్టార్ ఆయుష్ మాత్రేVirat Kohli vs Shreyas Iyer Controversy | IPL 2025 లో కొత్త శత్రువులుగా విరాట్, శ్రేయస్ అయ్యర్Rohit Sharma 76* vs CSK IPL 2025 | హిట్ మ్యాన్ ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటుందో చూపించిన రోహిత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JD Vance India Visit: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
Gollapudi Panchayat: ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
BCCI Retainership: బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్‌ విడుదల- అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మళ్లీ కాంట్రాక్ట్
బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్‌ విడుదల- అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మళ్లీ కాంట్రాక్ట్
KTR News: ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Dhanush D56 Movie: మరోసారి సూపర్ హిట్ కాంబో రిపీట్ - ధనుష్ కొత్త సినిమాకు రెహమాన్ మ్యూజిక్!
మరోసారి సూపర్ హిట్ కాంబో రిపీట్ - ధనుష్ కొత్త సినిమాకు రెహమాన్ మ్యూజిక్!
AP DSC Notification 2025: గతంలో డీఎస్సీకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
గతంలో DSCకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
Aishwaryarai Bachchan: ఐశ్వర్య రాయ్, అభిషేక్, ఆరాధ్య.. క్యూట్ ఫ్యామిలీ - విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టేశారుగా!
ఐశ్వర్య రాయ్, అభిషేక్, ఆరాధ్య.. క్యూట్ ఫ్యామిలీ - విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టేశారుగా!
Online Betting Case: వైసీపీ నేతపై ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు, స్పెషల్ టీమ్స్‌ ఏర్పాటు చేసి గాలిస్తున్న పోలీసులు
వైసీపీ నేతపై ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు, స్పెషల్ టీమ్స్‌ ఏర్పాటు చేసి గాలిస్తున్న పోలీసులు
Embed widget