అన్వేషించండి

Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి మృతి, హైదరాబాద్ ఐబీ అధికారిని భార్య, పిల్లల ఎదుటే కాల్చి చంపిన ఉగ్రవాదులు

Kashmir Terror Attack | బైసారాన్ లో మంగళవారం పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు.

పహల్గాం: జమ్ము కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం ప్రాంతంలో పర్యటకులపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 26 మంది మరణించారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో ఇంటెలిజెన్స్ బ్యూరో పనిచేసే మనీశ్ రంజన్ అనే ఉద్యోగితో పాటు విశాఖపట్నం వాసి చంద్రబౌళి ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. పారిపోతున్న చంద్రమౌళిని ఉగ్రవాదులు వెంటాడి కాల్పులు జరిపి హత్య చేశారని సమాచారం.

మంగళవారం మధ్యాహ్నం బైసారన్ అనే కొండపై ఉన్న చెట్లు, పొదల నుంచి ఆయుధాలతో ఉగ్రవాదులు బయటకు వచ్చి, 40 మంది పర్యటకులను చుట్టుముట్టారు. విచక్షణారహితంగా వారిపై కాల్పులు జరిపి బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఉగ్రదాడిలో మరణించిన మందిలో ఇద్దరు విదేశీయులు ఉండగా, ఒకరు యూఏఈ, మరొకరు నేపాల్‌కు చెందినవారు, ఇద్దరు స్థానికులు ఉన్నారని ఓ అధికారి వివరాలను తెలిపారు.

పేరు, మతం అడిగి మరీ కాల్పులు జరిపిన ఉగ్రవాదులు 

ఉగ్రవాదులు పర్యాటకులను చుట్టుముట్టిన తరువాత వారి పేరు, మతం గురించి వివరాలు ఆరాతీసిన తరువాత కాల్పులు జరిపారని పర్యాటకులు కొందరు చెబుతున్నారు.  మంగళవారం ఉదయం పర్యటకులు సందర్శించడానికి వెళ్ళిన బైసారన్‌లో ఈ ఉగ్రదాడి జరిగింది. గుర్తు తెలియని దుండగులు పర్యటాకులను చుట్టుముట్టి వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. కొందరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరికి బుల్లెట్ గాయాలయ్యాయని చెప్పారు.  

కాల్పులు మొదలైన వెంటనే పర్యాటకులు, స్థానికులు అక్కడి నుంచి ప్రాణభయంతో పారిపోయారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.. తన భర్తను ఉగ్రవాదులు కాల్చి చంపారని.. అంతకుముందు వారు పర్యాటకులు అని ఉగ్రవాదులు తెలుసుకున్నారు. "నా భర్త నా పక్కనే నిల్చుని ఉన్నాడు. అప్పుడు ఒక ఉగ్రవాది) వచ్చి అతన్ని కాల్చి చంపాడు. వివరాలు, మతం అడిగిన తరువాత అతను అతను ముస్లిం కాదేమో అని అంటూనే కాల్చి చంపాడని ఓ మహిళా బాధితురాలు ఏబీపీ న్యూస్‌కు తెలిపారు.

ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి హత్య
టెర్రరిస్ట్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రరిస్టులు హైదరాబాద్ కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని కాల్చి చంపారు. కోఠిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసులో మనీశ్ రంజన్ సెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తన కుటుంబసభ్యులతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లిన మనీశ్ రంజన్‌ను ఆయన భార్య, ఇద్దరు పిల్లల ముందే కాల్చి చంపారు. ఐడీ కార్డు చూసి, వివరాలు అడిగి మరీ మనీశ్ రంజన్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మనీశ్ స్వస్థలం బిహార్ కాగా, ఆయన హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నారు. కుటుంబసభ్యులను వదిలిపెట్టి కేవలం మనీశ్ రంజన్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపి హత్య చేశారు. మొత్త ఉగ్రదాడుల్లో 28 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.
 
 
 
దాడి వార్త బయటకు వచ్చిన వెంటనే, పహల్గాం రోడ్లు, వీధులు అంతా శూన్యంగా మారిపోయాయి. కశ్మీర్‌లో చాలా సంవత్సరాలుగా తీవ్రవాదం కొనసాగుతున్నప్పటికీ, ఆర్టికల్ 370 రద్దు తరువాత పర్యాటకం పెరుగుతోంది. కొన్ని రోజుల తరువాత జూలై 3న అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget