అన్వేషించండి

Pithapuram: పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?

Pithapuram: పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని మ‌ల్లం గ్రామంలో ద‌ళితుల సాంఘిక బ‌హిష్క‌ర‌ణ వివాదం శాంతి క‌మిటీతో స‌ద్దుమ‌నిగింది. గ్రామంలో ప్ర‌స్తుతం ప్ర‌శాంతంగా ఉంద‌ని అధికారులు తెలిపారు.

Pithapuram: పిఠాపురంలో కొత్త వివాదం ఈ మధ్య తెరపైకి వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ నియోజకవర్గం కావడంతో ఇక్కడ ఏం జరిగినా రాష్ట్రవ్యాప్త సంచలనం అవుతుంది. అక్కడ కొంతమందిర దళితులను సంఘ బహిష్కరణ చేశారనే వార్త మరో వైరల్ అవుతోంది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది.? ప్రస్తుతం ఏం జరుగుతోంది ఇప్పుడు చూద్దాం. 

పిఠాపురంలోని మల్లంలో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. దళితుల బహిష్కరణ వార్తలతో జిల్లా యంత్రాగం ఆప్రాంతాన్ని సందర్శించింది. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్నారు. ఇరు వర్గాల నేతలతో మాట్లాడి పరిస్థితిని చక్కబెట్టారు. ఇప్పుడు ఆ గ్రామం అధికారుల పర్యవేక్షణలో ఉంది. పోలీసులు కూడా ఆ గ్రామంపై ప్రత్యేక నిఘా ఉంచారు. 

మల్లంలో దళిత వర్గాలను బహిష్కరించారన్న ఆరోపణలతో జిల్లా కలెక్టర్‌ తక్షణం స్పందించారు. గ్రామంలో శాంతి కమిటీలు ఏర్పాటు చేశారు. ఇరువర్గాలను సమన్వయపరిచారు. దీంతో మల్లం గ్రామంలో గత కొద్ది రోజులుగా నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి. 

అసలేం జరిగింది?
ఆదివారం బహిష్కరణ విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఎక్కడకు వెళ్లిన మీకు ఏం ఇవ్వొబోమని తేల్చేశారు. ఇది పెద్దల నిర్ణయమని కూడా వారి నుంచి సమాధానం వచ్చింది. ఇది విన్న దళిత వర్గాలు షాక్ అయ్యాయి. ఈ విషయాన్ని దళిత నాయకులకు తెలిపారు. 

మొత్తం మీద ఈ విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. దళిత సంఘాల నాయకులు, వామపక్ష నాయకులు గ్రామంలో పర్యటించి అగ్రవర్ణాల పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన బాటపట్టారు. దీంతో అప్రమత్తమైన జిల్లా కలెక్టర్‌ సగిలి షాన్‌మోహన్‌ వెంటనే చర్యలు చేపట్టారు. ఆదివారం కాకినాడ ఆర్డీవో మల్లిబాబు, వికాస ప్రాజెక్టు డైరెక్టర్‌ లచ్చారావు, పిఠాపురం రూరల్‌ సీఐ శ్రీనివాస్‌, రూరల్‌ ఎస్సై జానీ బాషాకు బాధ్యతలు అప్పగించారు. వారు  వెంటనే గ్రామంలో పర్యటించి పరిస్థితి సమీక్షించారు. తమకు ఎదురైన అనుభవాలను దళితులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. 

బహిష్కరణకు కారణం ఇదేనా...
ఓ ఇంటికి ఎలక్ట్రికల్‌ పనులు చేసేందుకు అదే ప్రాంతానికి చెందిన సురేష్‌బాబు అనే యువకుడు వెళ్లాడు. అక్కడ కరెంట్‌షాక్‌తో చనిపోయాడు. ఆ ఇంటి విద్యుత్ వైరింగ్‌ సరిగా లేకపోవడంతోనే సురేష్‌బాబు మృతి చెందాడని దళిత వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. అతని మృతికి పరిహారంగా రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాయి. దీనికి ఆ కుటుంబం అంగీకరించకపోవడంతో అంగీకరించకపోవడంతో స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. 

ఇరువర్గాల మధ్య జరిగిన చర్చల్లో పిఠాపురం రూరల్‌ సీఐ శ్రీనివాస్‌ సమక్షంలో మృతుని కుటుంబానికి రూ.2.70 లక్షల రూపాయలు చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. అయితే ఆ డబ్బులు ఇవ్వకపోగా అగ్రవర్ణాలకు చెందిన పెద్దలు చర్చించుకొని దళితలకు సంఘ బహిష్కరణ చేశారు. పనులకు దళితులను పిలువకూడదని, వస్తువులు కూడా అమ్మకూడదని నిర్ణయించారు. 

ఉదయం చికెన్‌షాపులకు, టిఫిన్‌ సెంటర్లకు వెళ్లిన దళితలకు అసలు విషయం తెలిసింది. అధికారుల సమక్షంలో ఒప్పందం జరిగిందని ఆ డబ్బులు ఇవ్వకపోగా ఇదేంటీ వివక్ష అని వారి నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బాహ్యప్రపంచానికి తెలియజేశారు దళితులు. 

గ్రామంలో శాంతి కమిటీలు..
పిఠాపురం మండల పరిధిలోని మల్లం గ్రామంలో జరిగిన దళితుల సాంఫీుక బహిష్కరణ విషయం వైరల్ అవ్వడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.  మరోసారి గ్రామాన్ని సందర్శించిన అధికారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి శాంతి కమిటీలు వేశారు. దళితులను సాంఫీుక బహిష్కరణ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఇరు వర్గాల పెద్దలతో సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. గ్రామంలో అన్ని వర్గాలు సామరస్యంగా కలిసిమెలిసి ఉండాలని సూచించారు. సమావేశం అనంతరం ఆర్డీవో మల్లం గ్రామంలో ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులు లేవని, పరిస్థితి పూర్తి నియంత్రణలో ఉందని తెలిపారు.

ప్రతీ దానికి పవన్‌పై నిందలు వేయొద్దు..
పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నంత మాత్రాన ప్రతీ దానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై నిందలు మోపడం సరికాదని ఆపార్టీ దళిత నాయకులతోపాటు ఇంచార్జ్‌ మర్రెడ్డి శ్రీనివాసరావు అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మల్లం గ్రామంలో కొందరు అగ్రవర్ణ పెద్దలు దళితుల సాంఘిక బహిష్కరణకు పాల్పడడం హేయమైన చర్య అన్నారు. అటువంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మల్లం ఘటనకు పవన్‌ కల్యాణ్‌కు సంబంధమేంటని ప్రశ్నించారు. ప్రతీ దానికి పవన్‌ కల్యాణ్‌ను బాద్యున్ని చేస్తూ కొందరు కావాలనే మాట్లాడుతున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rajahmundry King: ఇండోనేషియా, మలేషియాలను జయించిన రాజమండ్రి రాజు ! గొప్ప చక్రవర్తి పుట్టింది గోదావరి జిల్లాలోనా?
ఇండోనేషియా, మలేషియాలను జయించిన రాజమండ్రి రాజు ! గొప్ప చక్రవర్తి పుట్టింది గోదావరి జిల్లాలోనా?
AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం

వీడియోలు

RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam
5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
Stock Market on 24 March: యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
Falls Sick or Dies on a Plane : విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
Vijayawada Crime News: విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
Embed widget