అన్వేషించండి

Pahalgam Terrorist Attack: రక్షించాలని ఆర్తనాదాలు, వదిలేయాలని వేడుకోలు- వెలుగులోకి వచ్చిన పహల్గామ్‌ దాడి మొదటి వీడియో

Pahalgam Terrorist Attack:పహల్గామ్‌లో ఉగ్రదాడి నుంచి బయటపడ్డ బాధితులు చెబుతున్న విషయాలు షాక్‌కి గురి చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న వీడియోలు, ఫొటోలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి.

Pahalgam Terrorist Attack: దక్షిణ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం బైసరన్ లోయ. సుందరమైన పర్యాటక ప్రాంతంలో బుధవారం జరిగిన ఉగ్రవాద దాడి యావత్ దేశాన్ని కలచి వేసింది. బంధువులను, అయినవారిని కోల్పోయిన కుటుంబాల రోధనలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇలాంటి దుర్ఘటనకు పాల్పడిన వారిని వదిలిపెట్టొద్దని జనం గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఆ రోజు జరిగిన ఘోరకలికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియోలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. 

తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న వారు ఆ రోజు జరిగిన దుర్ఘటన, ఉగ్రమూకలు తమ పట్ల వ్యవహరించిన తీరును కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు. ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న పర్యాటకులను లక్ష్యాంగా చేసుకునేందుకు లష్కర్‌ ఏ తైయబా (LeT)తో సంబంధం ఉన్న ముఠా ఒక్కసారిగా అక్కడికి వచ్చింది. దీంతో ఆ ప్రాంతంలో భయంతో వణికిపోయింది. వాళ్లంతా వద్దని వేడుకుంటున్నా పర్యాటకులనే లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు ఉగ్రవాదులు. ఉగ్రమూకల దుష్టచర్యకు 26 మంది ప్రాణాలు వదిలేశారు. అనేక మంది గాయపడ్డారు.

కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సుందరమైన ప్రకృతి దృశ్యాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా ఉన్నటైంలో ఉగ్రమూకలు కాల్పులు జరిపినట్టు బాధితులు చెబుతున్నారు. ఆ దుర్ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ క్షణంలో ఏం జరిగిందనే విషయాన్ని ఓ వీడియో స్పష్టంగా చెబుతోంది. ఈ వీడియోలో ఓ ముఠా పర్యాటక ప్రాంతంలోకి రావడం, కాల్పులు జరపడం కనిపిస్తోంది. వీడియో తీసే వ్యక్తి కూడా భయంత వణికిపోతున్న విషయాన్ని గమనించవచ్చు. అయితే ఈ వీడియోను చాలా దూరం నుంచి షూట్ చేసినట్టు తెలుస్తోంది. మతిచెడిన అరాచక శక్తులు కాల్పులు జరుపుతున్న దృశ్యం, భయంతో పరుగులు పెడుతున్న పర్యాటకులు ఆ వీడియోలో కనిపిస్తున్నారు.   

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CHINTU KASHYAP (@photozoneland)

వృద్ధులు, హనీమూన్‌ కోసం వెళ్లిన కొత్త జంటల ఎవర్నీ కూడా వదల్లేదు. పెళ్లై వారాలు కూడా కాలేదు అలాంటి రెండు జంటలను ఉగ్రమూకలు బలి తీసుకున్నాయి. దీంతో వారి జీవితాల్లో విషాదం అలుముకుంది. కళ్ల ఎదుటే భర్తలను చంపుతుంటే ఆ భార్యల పడిన ఆవేదన అంతా ఇంతా కాదు. వదిలేయాలని ప్రాథేయపడ్డా వినిపించుకోలేదా ఉగ్రదుర్మార్గులు. భర్తలను చంపేసి భార్యలను వదిలేసిన ఉగ్రవాదులు... మోదీకి  చెప్పుకోండని కూడా సవాల్ చేసినట్టు బాధితులు చెబుతున్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Warangal Viral News: లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Warangal Viral News: లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
Fact Check: మార్చి 2026 నుంచి రూ.500 నోట్ల చెలామణి ఆగిపోతుందా? మళ్ళీ నోట్ల రద్దు జరుగుతుందా?
మార్చి 2026 నుంచి రూ.500 నోట్ల చెలామణి ఆగిపోతుందా? మళ్ళీ నోట్ల రద్దు జరుగుతుందా?
Aadi Saikumar: ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Embed widget