అన్వేషించండి

Crime News: తెలంగాణలో దారుణాలు - ఛాయ్ పెట్టలేదని కోడలిని చంపేసిన అత్త, భర్తను నరికి చంపిన భార్య, ఇంకా..

Telangana News: తెలంగాణలో ఒకే రోజు పలు చోట్ల దారుణాలు జరిగాయి. ఛాయ్ పెట్టలేదని ఓ అత్త కోడలిని ఉరేసి చంపేయగా.. మరో చోట భూ తగాదాలతో ఓ రైతును బండరాయితో కొట్టి హతమార్చారు.

Crime News In Telangana: తెలంగాణలో ఒకే రోజు దారుణాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్‌లో (Hyderabad) ఛాయ్ పెట్టలేదని ఓ అత్త తన కోడలిని దారుణంగా హతమార్చింది. అటు, మెదక్ జిల్లాలో పాతకక్షలు, భూతగాదాలతో ఓ రైతు దారుణ హత్యకు గురయ్యాడు. అలాగే, సంగారెడ్డి జిల్లాలో ఓ మహిళ తన భర్తను గొడ్డలితో నరికి చంపింది. మరోవైపు, జగిత్యాల జిల్లాలో ఓ మహిళ తన నాలుగేళ్ల కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ అత్తాపూర్‌ హసన్ నగర్‌లో గురువారం ఉదయం ఫర్జానా అనే మహిళ తన కోడలు అజ్మీరాబేగం(28) ను టీ పెట్టి ఇవ్వాలని అడిగింది. అయితే, అందుకు కోడలు నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఫర్జానా.. బేగం మెడకు చున్నీతో ఉరి వేసి హతమార్చింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భర్తను చంపేసిన భార్య

అటు, సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోనూ దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ తండ్రి కన్నబిడ్డపైనే పాశవికంగా ప్రవర్తించేందుకు యత్నించాడు. ఈ క్రమంలో తన పిల్లలను రక్షించుకునేందుకు భర్తను నరికి చంపిన భార్య.. అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన మాణయ్య, ఇందిర దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరి పెద్ద కూతురు భర్త చనిపోవడంతో తల్లిదండ్రుల వద్ద ఉంటూ కూలీ పనులు చేసుకుంటోంది. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి మద్యం మత్తులో మాణయ్య కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన అతని భార్య ఇందిర భర్తను గొడ్డలితో నరికి చంపింది. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తల్లీకుమార్తె పోలీసుల ఎదుట లొంగిపోయారు. కాగా, ఇంట్లో గొడవల నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం వారి కొడుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రైతును దారుణంగా చంపేశారు

మెదక్ (Medak) జిల్లా రామాయంపేట (Ramayampeta) మండలం లక్ష్మాపూర్ గ్రామంలోనూ గురువారం దారుణం జరిగింది. గ్రామానికి చెందిన రైతు రాగుల అశోక్‌ను.. కొందరు బండరాయితో కొట్టి హతమార్చారు. ఉదయం పొలం వద్దకు వెళ్లగా.. అప్పటికే పక్క పొలంలో కాపు కాసిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు పాతకక్షలు, భూ తగాదాలే కారణమని భావిస్తున్నారు. గ్రామానికి చెందిన చేవూరి రమేశ్ కుటుంబమే ఈ హత్యకు పాల్పడిందని.. గ్రామస్థులు, బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఆగ్రహంతో గ్రామస్థులు వారి ఇంటిపై దాడికి వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

జగిత్యాలలో విషాదం

మరోవైపు, జగిత్యాల జిల్లాలోనూ విషాదం జరిగింది. సారంగాపూర్ (Sarangapur) మండలం అర్పల్లి గ్రామంలో బొండ్ల మౌనిక అనే వివాహిత తన కూతురితో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం ఉదయం బావిలో మృతదేహాలను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. అయితే, బుధవారం రాత్రి ఇంట్లో కుటుంబ కలహాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మౌనిక భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly: కక్ష కట్టి ఉంటే ఫ్యామిలీతో చర్లపల్లిలో ఉండేవాళ్లు - కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్
కక్ష కట్టి ఉంటే ఫ్యామిలీతో చర్లపల్లిలో ఉండేవాళ్లు - కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్
Kolikapudi Srinivas: కొలికపూడి నోట రాజీనామా మాట - టీడీపీ పెద్దలకు గంటల డెడ్ లైన్ - లేకపోతే ?
కొలికపూడి నోట రాజీనామా మాట - టీడీపీ పెద్దలకు గంటల డెడ్ లైన్ - లేకపోతే ?
CM Revanth Reddy: విద్యాశాఖను ఎవ్వరికీ ఇయ్య.. నా దగ్గరే పెట్టుకుంటా.. హైదరాబాద్‌కు ఒలంపిక్స్ -రేవంత్ రెడ్డి
విద్యాశాఖను ఎవ్వరికీ ఇయ్య.. నా దగ్గరే పెట్టుకుంటా.. హైదరాబాద్‌కు ఒలంపిక్స్ -రేవంత్ రెడ్డి
Telangana Assembly: ఎంపీ స్థానాల పెంపు వాయిదా వేసి మా అసెంబ్లీ సీట్లు పెంచండి- తీర్మానం చేసిన తెలంగాణ
ఎంపీ స్థానాల పెంపు వాయిదా వేసి మా అసెంబ్లీ సీట్లు పెంచండి- తీర్మానం చేసిన తెలంగాణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs LSG Match Preview IPL 2025 | నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ | ABPKL Rahul Joins Delhi Capitals | నైట్ పార్టీలో నానా హంగామా చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ | ABP DesamRC 16 Ram Charan Peddi First Look | రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా RC16 టైటిల్, ఫస్ట్ లుక్ | ABP DesamRiyan Parag Fan touches Feet | రియాన్ పరాగ్ కాళ్లు మొక్కిన అభిమాని | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly: కక్ష కట్టి ఉంటే ఫ్యామిలీతో చర్లపల్లిలో ఉండేవాళ్లు - కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్
కక్ష కట్టి ఉంటే ఫ్యామిలీతో చర్లపల్లిలో ఉండేవాళ్లు - కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్
Kolikapudi Srinivas: కొలికపూడి నోట రాజీనామా మాట - టీడీపీ పెద్దలకు గంటల డెడ్ లైన్ - లేకపోతే ?
కొలికపూడి నోట రాజీనామా మాట - టీడీపీ పెద్దలకు గంటల డెడ్ లైన్ - లేకపోతే ?
CM Revanth Reddy: విద్యాశాఖను ఎవ్వరికీ ఇయ్య.. నా దగ్గరే పెట్టుకుంటా.. హైదరాబాద్‌కు ఒలంపిక్స్ -రేవంత్ రెడ్డి
విద్యాశాఖను ఎవ్వరికీ ఇయ్య.. నా దగ్గరే పెట్టుకుంటా.. హైదరాబాద్‌కు ఒలంపిక్స్ -రేవంత్ రెడ్డి
Telangana Assembly: ఎంపీ స్థానాల పెంపు వాయిదా వేసి మా అసెంబ్లీ సీట్లు పెంచండి- తీర్మానం చేసిన తెలంగాణ
ఎంపీ స్థానాల పెంపు వాయిదా వేసి మా అసెంబ్లీ సీట్లు పెంచండి- తీర్మానం చేసిన తెలంగాణ
Kishan Reddy Letter : హెచ్‌సీయూ వద్ద భూములు వేలం వేయొద్దు- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ 
హెచ్‌సీయూ వద్ద భూములు వేలం వేయొద్దు- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ 
Empuraan Review - ఎల్2 ఎంపురాన్ రివ్యూ: మోహన్ లాల్ మూవీ హిట్టా? ఫట్టా? రిలీజ్‌కు ముందు వచ్చిన హైప్‌కు తగ్గట్టు ఉందా? లేదా?
ఎల్2 ఎంపురాన్ రివ్యూ: మోహన్ లాల్ మూవీ హిట్టా? ఫట్టా? రిలీజ్‌కు ముందు వచ్చిన హైప్‌కు తగ్గట్టు ఉందా? లేదా?
SRH Memes: లక్నోను నలిపేయడం ఖాయమే -  సన్ రైజర్స్ తో మ్యాచ్‌పై సోషల్ మీడియాలో మీమ్స్
లక్నోను నలిపేయడం ఖాయమే - సన్ రైజర్స్ తో మ్యాచ్‌పై సోషల్ మీడియాలో మీమ్స్
Vizag Latest News: రూ.500 ఇవ్వలేదని భర్తపై అలిగిన భార్య- పరుగులు పెట్టిన పోలీసులు - ఇంతకీ ఏం జరిగిందంటే?
రూ.500 ఇవ్వలేదని భర్తపై అలిగిన భార్య- పరుగులు పెట్టిన పోలీసులు - ఇంతకీ ఏం జరిగిందంటే?
Embed widget