News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Suryapet News: సర్పంచ్ హత్య కేసులో దోషులకు జీవిత ఖైదు విధించిన సూర్యాపేట కోర్టు

Lifetime imprisonment : సర్పంచ్ హత్య కేసులో దోషులకు జీవిత ఖైదు విధించింది సూర్యాపేట జిల్లా కోర్టు.

FOLLOW US: 
Share:

Lifetime imprisonment :

సూర్యాపేట జిల్లా... సర్పంచ్ హత్య కేసులో దోషులకు జీవిత ఖైదు విధించింది కోర్టు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నరసింహులగూడెం గ్రామ సర్పంచ్ (సీపీఎం పార్టీ) పులిందర్ రెడ్డి హత్య కేసులో ఆరుగురు హంతకులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. 

నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవన్న జిల్లా ఎస్పీ
సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింహులగూడెం గ్రామ సర్పంచ్ జూలకంటి పులిందర్ రెడ్డి హత్య కేసులో తొమ్మిదిన్నర ఏళ్ల తరువాత దోషులకు శిక్ష పడింది. సూర్యాపేట జిల్లా కోర్టు శుక్రవారం తుది తీర్పు వెల్లడించింది. 2014 జనవరి 30న కోదాడ బైపాస్ రోడ్డు లో సర్పంచ్ జూలకంటి పులిందర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. బాధితుడి భార్య, బంధువుల ఫిర్యాదు మేరకు అప్పటి దర్యాప్తు అధికారి ఐపీఎస్ సెక్షన్లు 28/2014 U/s, 147,148,120 (B), 153 (A)_, 302, 307, 201 R/w 149 కింద, Sec 7 (l)  క్రిమినల్ అమెండ్ మెంట్ యాక్ట్   1932 ప్రకారం కేసు నమోదు చేశారు. 

అప్పట్లోనే ఈ కేసుకు సంబంధించి 9 మందిని రిమాండ్ కు పంపించారు. కేసు దర్యాప్తు లో బాగంగా 31 మంది సాక్షులను, బాధితులను, నిందితులను విచారించిన జిల్లా కోర్టు ఆరుగురు నేరస్తులను గుర్తించింది. వీరు హత్యకు కారకులని, నేరానికి పాల్పడ్డారని నిర్ధారించి.. సూర్యాపేట జిల్లా ప్రిన్సిపల్స్ సెషన్స్ జిల్లా కోర్టు న్యాయమూర్తి జి.రాజగోపాల్ దోషులకు యావజ్జీవ కారాగార శిక్షను విధించారు. ఇన్నేళ్ల తరువాత ఈరోజు తీర్పు వచ్చిందని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ కేసు విచారణలో ఉండగానే జలీల్ అనే నిందితుడు మృతి చెందాడు. దాంతో మిగతా ఐదుగురు నేరస్తుల (1. షేక్ షబ్బీర్, 2. కొప్పుల లక్ష్మీనారాయణ, 3 షేక్ ఇబ్రహీం, 4. మాతంగి శ్రీను, 5. ధూళిపాల నరేందర్)ను జైలుకు తరలిస్తున్నామని ఎస్పీ తెలిపారు.

రాష్ట్ర పోలీస్ శాఖలో అమలు అవుతున్న కోర్టు డ్యూటీ విభాగం జిల్లా పోలీస్ శాఖలో సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని ఎస్పీ చెప్పారు. కోర్టు డ్యూటీ పని విభాగం వర్టికల్ లో ఎప్పటికప్పుడు సిబ్బందికి శిక్షణ ఇస్తూ వారి పనిలో సామర్ధ్యాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. కోర్టులలో సమన్వయంగా పని చేయడం, కేసుల్లో శిక్షల శాతం పెరిగేలా కృషి చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర డీజీపీ అధ్వర్యంలో కోర్టు డ్యూటీ పని విభాగాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం అన్నారు.

ఈ సందర్భంగా బాధితుల పక్షాన కేసు వాదించిన పీపీ శ్రీవాణిని కోదాడ డీఎస్పీ ప్రకాష్ సన్మానించారు. గతంలో PP వెంకటేశ్వర్లుని, కేసు పర్యవేక్షణ చేసిన డీఎస్పీ ప్రకాష్, ఇన్స్ పెక్టర్ రాము, కోర్టు డ్యూటీ అధికారి హెడ్ కానిస్టేబుల్ వెంకట రమణ, లైజన్ ఆఫీసర్ ఏఎస్ఐ సురేంద్ర బాబు లను ఎస్పీ అభినందించారు.  మరోవైపు కోర్టు తీర్పు ఇవ్వనున్న సందర్బంగా నర్సింహుల గూడెం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలు మోహరించాయి. తప్పు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష పడుతుందని, ఎవరూ తప్పించుకోలేరని ఎస్పీ అన్నారు. కనుక హత్యలు, దొంగతనాలు, దోపిడీలు చేయకుండా మంచి పనులు చేయాలని ప్రజలకు సూచించారు. 

Published at : 01 Sep 2023 11:31 PM (IST) Tags: Telangana CPM Suryapet Julakanti Pulindher Reddy Suryapet District Court

ఇవి కూడా చూడండి

CPGET Seat Allotment: సెప్టెంబరు 29న సీపీగెట్‌ సీట్ల కేటాయింపు, ఈ తేదీలోగా జాయిన్ అవ్వాల్సిందే!

CPGET Seat Allotment: సెప్టెంబరు 29న సీపీగెట్‌ సీట్ల కేటాయింపు, ఈ తేదీలోగా జాయిన్ అవ్వాల్సిందే!

TSPSC: 'గ్రూప్‌-1' పరీక్షలో అవకతవకలు జరగలేదు, టీఎస్‌పీఎస్సీ వివరణ

TSPSC: 'గ్రూప్‌-1' పరీక్షలో అవకతవకలు జరగలేదు, టీఎస్‌పీఎస్సీ వివరణ

Breaking News Live Telugu Updates: బాలాపూర్‌ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్‌ విల్లా లడ్డూ

Breaking News Live Telugu Updates: బాలాపూర్‌ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్‌ విల్లా లడ్డూ

రెవెన్యూ డివిజన్‌గా చండూరు, మండలం కేంద్రం మహ్మద్ నగర్ : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

రెవెన్యూ డివిజన్‌గా చండూరు, మండలం కేంద్రం మహ్మద్ నగర్ : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది