అన్వేషించండి

Price Reduction Of Electric Vehicles: ఈవీ ధరలు తగ్గేలా కేంద్రం కీలక నిర్ణయం, దేశంలో పెరగనున్న ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లు

Price Reduction Of Electric Vehicles: కేంద్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాల ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈమేరకు 2025 ఆర్థిక బిల్లులో కీలక ప్రకటన చేసింది.

Price Reduction Of Electric Vehicles: భారత్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు రోడ్డుపై ఒకట్రెండు ఎలక్ట్రిక్ కార్లు కనిపించేవి కానీ ఇప్పుడు మాత్రం పదుల సంఖ్యలో కనిపిస్తున్నాయి. అందుకే దీనికి అనుగుణంగా ప్రభుత్వాలు కూడా తమ పాలసీలు మార్చుకుంటున్నాయి. తెలంగాణలో అయితే ఏకంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పూర్తిగా రద్దు చేసింది. ఇప్పుడు కేంద్రం కూడా లోకల్ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంది. 

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు మరింత పెంచేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 25 మార్చి 2025 మంగళవారం కీలక ప్రకటన చేశారు. దీనిలో భారత ప్రభుత్వం ఈవీ బ్యాటరీల ఉత్పత్తిలో ఉపయోగించే 35 క్యాపిటల్ గుడ్స్‌పై ఎటువంటి దిగుమతి సుంకం విధించడం లేదని తెలిపారు.

ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకం లేదు
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ మొన్నే పార్లమెంట్‌లో 2025 ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టారు. ఈవీ బ్యాటరీలపై దిగుమతి సుంకాన్ని తగ్గించే నిర్ణయంపై ఆర్థికమంత్రి స్పందించారు. 'దేశంలో దేశీయ ఈవీ ఉత్పత్తిని పెంచాలనుకుంటున్నాం. ముడిపదార్థాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించడం ద్వారా ఎగుమతి పోటీని కూడా పెంచాలనుకుంటున్నాం' అని అన్నారు. భారతదేశం ఇతర దేశాల నుంచి 35 వస్తువులను కొనుగోలు చేస్తుంది. వీటిని ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తారు.

అమెరికా విధించే రియాక్షన్ పన్నుపై కూడా కేంద్రం స్పందించింది. దీన్ని తగ్గించే ఆలోచన చేస్తున్నట్టు పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2, 2025 నుంచి ప్రపంచంలోని అనేక దేశాలపై దిగుమతి సుంకాలు విధించే ప్రకటన చేశారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం..."భారత ప్రభుత్వం అమెరికాతో జరిగే వాణిజ్య ఒప్పందం, మొదటి దశలో సుంకాలను తగ్గించడం గురించి చర్చిస్తుంది. భారత ప్రభుత్వం అమెరికా నుంచి దిగుమతి అయ్యే 1.9 లక్షల కోట్ల రూపాయలు విలువైన వస్తువులపై దిగుమతి సుంకాన్ని తగ్గించడంపై ఆలోచిస్తుంది."

ఎలక్ట్రిక్ కార్లు చౌకగా
గత వారం జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో దేశీయ ఉత్పత్తిని పెంచడానికి ముడి పదార్థాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈవీ బ్యాటరీలు, మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో ఉపయోగించే బ్యాటరీలపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఈవీ బ్యాటరీలపై దిగుమతి సుంకం తొలగించడం వల్ల ఎలక్ట్రిక్ కార్ల ధరలు తగ్గే అవకాశం ఉంది.  

బడ్జెట్‌లో కూడా ఎలక్ట్రిక్ కార్లపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఇస్తున్న సబ్సిడీకి అదనంగా మరిన్ని వెసులుబాటులు కల్పిస్తామన్నారు. లిథియం బ్యాటరీలు, సంబంధిత రంగాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ఇస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. లోకల్ మార్కెట్‌ను ప్రోత్సహించేలా చర్యలు ఉంటాయని చెప్పుకొచ్చారు. లిథియం బ్యాటరీల కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తామన్నారు. అన్నట్టుగానే ఇప్పుడు కీలక నిర్ణయం ప్రకటించారు.

కోబాల్ట్, లిథియం అయాన్ బ్యాటరీ స్క్రాప్, సీసం, జింక్ సహా  12 ఇతర పదార్థాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని భారత ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. ఈ పదార్థాలన్నీ బ్యాటరీలు, సెమీకండక్టర్లు, పునరుత్పాదక ఇంధన పరికరాల తయారీలో ఉపయోగిస్తారు. ఈ పదార్థాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం (BCD) తొలగింపు ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు క్లీన్ ఎనర్జీ ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహిస్తుంది.

 

టాప్ హెడ్ లైన్స్

గత నెలలో ప్రజలు ఈ కార్ల కోసమే షోరూమ్‌ల ముందు క్యూ కట్టారు.. టాప్‌-10 కార్ల లిస్ట్‌
ఆగస్టులో దేశవ్యాప్తంగా ఈ కార్లకు ఫుల్ డిమాండ్.. టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ లిస్ట్‌ మీ కోసం
బ్రేక్ వేయడం నుంచి లేన్ మార్చే వరకు.. కారులో ADAS ఉంటే భద్రత మరింత పెరుగుతుందా?
కార్లలో ADAS ఉంటే ప్రమాదాల ముప్పు తగ్గుతుందా? అసలు ADAS అంటే ఏంటి?
OTT లాగే కొత్త కార్లనీ సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు, కొనకుండానే దర్జాగా తిరగొచ్చు, బోర్‌ కొడితే మార్చేయొచ్చు
కారు కొనాల్సిన పని లేదు.. సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే చాలు, కొత్త మోడల్‌ మీ ఇంటి ముందు ఉంటుంది
నెలకు రూ.12,000 EMIతోనూ మారుతి బ్రెజ్జా మీ ఇంటికొస్తుంది, లోన్‌ ఎంత తీసుకోవాలంటే?
కేవలం రూ.లక్షన్నరతో Maruti Brezzaను మీ ఇంటికి తెచ్చుకోవచ్చు! నెలకు ఎంత చెల్లించాలంటే?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
గత నెలలో ప్రజలు ఈ కార్ల కోసమే షోరూమ్‌ల ముందు క్యూ కట్టారు.. టాప్‌-10 కార్ల లిస్ట్‌
ఆగస్టులో దేశవ్యాప్తంగా ఈ కార్లకు ఫుల్ డిమాండ్.. టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ లిస్ట్‌ మీ కోసం
Navya Swamy: ఫ్యామిలీతో నవ్య స్వామి వినాయక చవితి సెలబ్రేషన్స్... వైరల్ ఫోటోలు
ఫ్యామిలీతో నవ్య స్వామి వినాయక చవితి సెలబ్రేషన్స్... వైరల్ ఫోటోలు
Telangana Congress new AICC incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
Embed widget