అన్వేషించండి

Price Reduction Of Electric Vehicles: ఈవీ ధరలు తగ్గేలా కేంద్రం కీలక నిర్ణయం, దేశంలో పెరగనున్న ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లు

Price Reduction Of Electric Vehicles: కేంద్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాల ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈమేరకు 2025 ఆర్థిక బిల్లులో కీలక ప్రకటన చేసింది.

Price Reduction Of Electric Vehicles: భారత్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు రోడ్డుపై ఒకట్రెండు ఎలక్ట్రిక్ కార్లు కనిపించేవి కానీ ఇప్పుడు మాత్రం పదుల సంఖ్యలో కనిపిస్తున్నాయి. అందుకే దీనికి అనుగుణంగా ప్రభుత్వాలు కూడా తమ పాలసీలు మార్చుకుంటున్నాయి. తెలంగాణలో అయితే ఏకంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పూర్తిగా రద్దు చేసింది. ఇప్పుడు కేంద్రం కూడా లోకల్ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంది. 

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు మరింత పెంచేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 25 మార్చి 2025 మంగళవారం కీలక ప్రకటన చేశారు. దీనిలో భారత ప్రభుత్వం ఈవీ బ్యాటరీల ఉత్పత్తిలో ఉపయోగించే 35 క్యాపిటల్ గుడ్స్‌పై ఎటువంటి దిగుమతి సుంకం విధించడం లేదని తెలిపారు.

ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకం లేదు
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ మొన్నే పార్లమెంట్‌లో 2025 ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టారు. ఈవీ బ్యాటరీలపై దిగుమతి సుంకాన్ని తగ్గించే నిర్ణయంపై ఆర్థికమంత్రి స్పందించారు. 'దేశంలో దేశీయ ఈవీ ఉత్పత్తిని పెంచాలనుకుంటున్నాం. ముడిపదార్థాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించడం ద్వారా ఎగుమతి పోటీని కూడా పెంచాలనుకుంటున్నాం' అని అన్నారు. భారతదేశం ఇతర దేశాల నుంచి 35 వస్తువులను కొనుగోలు చేస్తుంది. వీటిని ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తారు.

అమెరికా విధించే రియాక్షన్ పన్నుపై కూడా కేంద్రం స్పందించింది. దీన్ని తగ్గించే ఆలోచన చేస్తున్నట్టు పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2, 2025 నుంచి ప్రపంచంలోని అనేక దేశాలపై దిగుమతి సుంకాలు విధించే ప్రకటన చేశారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం..."భారత ప్రభుత్వం అమెరికాతో జరిగే వాణిజ్య ఒప్పందం, మొదటి దశలో సుంకాలను తగ్గించడం గురించి చర్చిస్తుంది. భారత ప్రభుత్వం అమెరికా నుంచి దిగుమతి అయ్యే 1.9 లక్షల కోట్ల రూపాయలు విలువైన వస్తువులపై దిగుమతి సుంకాన్ని తగ్గించడంపై ఆలోచిస్తుంది."

ఎలక్ట్రిక్ కార్లు చౌకగా
గత వారం జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో దేశీయ ఉత్పత్తిని పెంచడానికి ముడి పదార్థాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈవీ బ్యాటరీలు, మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో ఉపయోగించే బ్యాటరీలపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఈవీ బ్యాటరీలపై దిగుమతి సుంకం తొలగించడం వల్ల ఎలక్ట్రిక్ కార్ల ధరలు తగ్గే అవకాశం ఉంది.  

బడ్జెట్‌లో కూడా ఎలక్ట్రిక్ కార్లపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఇస్తున్న సబ్సిడీకి అదనంగా మరిన్ని వెసులుబాటులు కల్పిస్తామన్నారు. లిథియం బ్యాటరీలు, సంబంధిత రంగాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ఇస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. లోకల్ మార్కెట్‌ను ప్రోత్సహించేలా చర్యలు ఉంటాయని చెప్పుకొచ్చారు. లిథియం బ్యాటరీల కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తామన్నారు. అన్నట్టుగానే ఇప్పుడు కీలక నిర్ణయం ప్రకటించారు.

కోబాల్ట్, లిథియం అయాన్ బ్యాటరీ స్క్రాప్, సీసం, జింక్ సహా  12 ఇతర పదార్థాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని భారత ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. ఈ పదార్థాలన్నీ బ్యాటరీలు, సెమీకండక్టర్లు, పునరుత్పాదక ఇంధన పరికరాల తయారీలో ఉపయోగిస్తారు. ఈ పదార్థాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం (BCD) తొలగింపు ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు క్లీన్ ఎనర్జీ ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహిస్తుంది.

 

టాప్ హెడ్ లైన్స్

ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
టోల్‌గేట్‌ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్స్‌!
కేవలం రూ.350 మంత్లీ పాస్‌.. ఒక నెలలో టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా ప్రయాణం!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Auto Drivers Strike: చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Embed widget