అన్వేషించండి

Diwali 2023 : దీపాల పండుగా లేదా పటాకులు పేల్చే పండుగా - బాణసంచా కాల్చడం ఎప్పటి నుంచి మొదలైంది!

దీపావళి అంటే దీపాల పండుగా? టపాసుల పండుగా?.. టపాసులు ఎందుకు కాల్చాలి - ఎందుకు వద్దు? అసలు టపాసులు కాల్చడం అనే సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైందో తెలుసా...

Diwali  A Festival Of Lights Or A Festival Of Bursting Firecrackers

జాతి, కుల, మత విభేదాలు లేకుండా ప్రజలంతా సమైక్యంగా జరుపుకునే పండుగ దీపావళి. ఊరూ వాడా దీపాలు, బాణసంచా వెలుగులతో నిండిపోతుంది. అయితే టపాసులు కాల్చొద్దు, ప్రకృతిని కలుషితం చేయొద్దంటూ పెద్ద హడావుడే జరుగుతోంది. కానీ టపాసులు కాల్చడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? బాణసంచా కాల్చడం ఎప్పటి నుంచి మొదలైంది? ఇప్పుడెందుకు వద్దంటున్నారు?

Also Read: ధంతేరస్, చోటి దీపావళి - దీపావళి రోజు వెలిగించే దీపాలకూ ఓ లెక్కుందా!
 
చాణక్య నీతి - శుక్రనీతిలో ప్రస్తావన
చైనా వారు తుపాకి మందు కనిపెట్టడానికి ముందే భారత్ లో దానిని ఉపయోగించినట్లు ఆధారాలున్నాయి. చాణక్యుడి అర్థశాస్త్రం, శుక్రాచార్యుడి 'శుక్రనీతి'లో దీని గురించిన ప్రస్తావన ఉంది. అరబ్బులు, పర్షియన్లు తుపాకి మందు ఎలా తయారు చేయాలో భారతీయుల నుంచి నేర్చుకున్నారని చెబుతారు. అంతకుముందు నాఫ్తా అనే ద్రవరూప రసాయనం పోసిన బాణాలు, ఆయుధ ప్రయోగంలో సూరేకారం వాడేవారట. అంటే తుపాకీ మందు , అది ఉపయోగించే ఆయుధాలు తయాలు చేయడానికి ఆద్యులు భారతీయులే. సైనిక వేడుకల్లోనే కాకుండా ఇతర  సమయాల్లోనూ భారతదేశంలో బాణసంచా కాల్చేవారనీ క్రీ.శ. 7వ శతాబ్దం నాటి చైనా సాహిత్యంలో ప్రస్తావించారు. బాణసంచా తయారీలో ప్రధానమైనది తుపాకి మందు. ఇది సూరేకారం, గంధకం, బొగ్గుల మిశ్రమం. గంధకం, బొగ్గు మందుగుండు ఎక్కువసేపు కాలడానికి దోహదం చేస్తే, సూరేకారం మిరమిట్లు గొలిపే ఎర్రటి కాంతులు విరజిమ్ముతుంది. 

Also Read : దీపావళి రోజు పూజించాల్సిన దక్షిణావర్తి శంఖం విశిష్టత ఏంటో తెలుసా!

యుగ యుగాల పండుగ
రావణ వధ అనంతరం వనవాసాన్ని ముగించుకుని అయోధ్యలో సీతారాములు అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని దీపావళి జరుపుకున్నారని చెబుతారు. ద్వారప యుగంలో నరకాసుల వధ తర్వాత బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారంటారు. 

Also Read : దీపావళికి దీపాలు వెలిగించేటప్పుడు అస్సలు చేయకూడని పొరపాట్లు ఇవే!

రాజలుకే పరిమితం
దీపావళి సందర్భంగా  బాణసంచా కాల్చడంపై నిషేధం విధించడాన్ని  చాలా మంది దీనిని హిందూ మతంపై దాడిగా భావించారు. హిందూ సంప్రదాయంలో ఇది అంతర్భాగమన్నారు. వాస్తవానికి మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా బాణసంచా నిషేధించడం మంచిదే. పైగా దీపావళి అంటే దీపాలే ప్రధానం..బాణసంచా కాదు. అప్పట్లో కూడా బాణసంచా కాల్చేవారు కానీ ఈ సంప్రదాయం కేవలం రాయల్టీకి మాత్రమే పరిమితం అయ్యేది. మొఘల్ కాలంలో క్రాకర్స్ కాల్చడం గొప్పతనానికి చిహ్నం. వివాహాలు, పట్టాభిషేకాల సమయంలో బాణసంచా కాల్చడం సర్వసాధారణం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతే భారతీయ పరిశ్రమలు బాణసంచా తయారీని ప్రారంభించాయి. మన దేశంలో మొదటి బాణసంచా తయారీ కర్మాగారం 19 శతాబ్ధంలో కోలకతాలో ప్రారంభమైంది. ఇద్దరు సోదరులు పి అయ్య నాడార్ - షణ్ముగ నాడార్ 1923లో అగ్గిపెట్టె తయారీ నేర్చుకునేందుకు పశ్చిమ బెంగాల్‌కు వెళ్లిన తర్వాత తమిళనాడు శివకాశి బాణాసంచా తయారీ కేంద్రంగా మారింది.

Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!

బాణసంచా ఎందుకు కాల్చాలి
భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. చాలా ప్రాంతాల వారి ప్రధాన ఆహారం...శీతాకాలంలోనే వృద్ధి చెందుతుంది. దీపావళితో శీతాకాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలోనే పంటను నాశనం చేసే రకరకాల కీటకాలు వృద్ధి చెందుతాయి. వీటి కారణంగా పంట దిగుబడి తగ్గిపోతుంది. ఈ కీటకాల కారణంగా ప్రజలు అనారోగ్యం పాలవుతారు. ఈ సమస్యకు గంధకం వినియోగం మంచి పరిష్కారం. దీపావళి రోజు బాణసంచా కాల్చడం వల్ల గాలిలో గంధకం పొగ వ్యాపించి కీటకాలను నివారిస్తుంది. ఇంకా..బురద, తడి, వానలు కారణంగా పెరిగిన క్రిమికీటకాలు విచ్చలవిడిగా సంచరించటం ప్రారంభిస్తాయి. పంటపొలాలు కోతలకి వచ్చి వాటిలో బాగా పెరిగిన పురుగులు, దోమలు వీరవిహారం చేయటం ప్రారంభిస్తాయి. ఈ  సమయంలో గంధకం, పొటాషియం వంటి రసాయనాల పొగపెడితే వాటి విజృంభణను నివారించవచ్చు. పొగ వెయ్యండి అంటే అందరూ వెయ్యరుకదా! పండగలో భాగంగా చెయ్యమంటే తప్పకుండా చేస్తారు. డెంగ్యూ ఫివర్‌ కలిగించే దోమలు కూడా టపాకాయలు కాల్చినప్పుడు వచ్చే పొగవల్ల నశిస్తాయట. 

Also Read: శనిదోషం తొలగిపోవాలంటే దీపావళికి నువ్వులతో దీపం ఇలా వెలిగించండి!

ఎక్కువ దీపాలు ఇందుకే
పూర్వకాలం సౌకర్యాలు ఎక్కువ లేని రోజుల్లో శరదృతువు ప్రయాణానికి అనుకూలమైన కాలం గనుక అందరూ అప్పుడే ప్రయాణాలు చేసేవారు. అలాంటి సమయంో బాటసారులకు దారి చూపటానికి కాబోలు ఎత్తైన ప్రదేశంలో ఒక దీపం పెట్టే సంప్రదాయం ఏర్పడింది. ఇప్పటికీ దేవాలయాలలో అలా ఒక దీపం ఎత్తైన స్థంభంపై వెలిగించటం కనిపిస్తుంది. చీకటి, అజ్ఞానాల మీద గెలుపుకి ప్రతీక అయిన దీపావళి, కొంచెం ఆలోచించి అర్థం చేసుకుంటే సంతోషాల దీపావళి అవుతుంది.

Also Read: ధనత్రయోదశి, నరక చతుర్దశి రోజు 'యమదీపం' వెలిగించడం ఎంత ముఖ్యమో తెలుసా!

అయితే అతి సర్వత్రా వర్జయేత్ అనే మాటని ఇక్కడ మరిచిపోరాదు. క్రాకర్స్ కాల్చొచ్చు అనే వాదనతో వాయుకాలుష్యం, శబ్ధకాలుష్యం పెరిగేంతగా కాల్చకూడదు..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP DesamRahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Indian 2: హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
Mysterious Deaths: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
Air Pollution: పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
Viral News: దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
Embed widget