Patanjali Ayurveda:ప్రధాని నైపుణ్య మిషన్లో పతంజలిది కీలక పాత్ర- ఆచార్య బాలకృష్ణ
Acharya Balakrishna:: నాగ్పూర్లోని పతంజలి మెగా ఫుడ్ మరియు హర్బల్ పార్క్ మార్చి 9న ప్రారంభం కానుంది

Acharya Balakrishna: నాగ్పూర్లోని MIHAN ప్రాంతంలో నిర్మించిన పతంజలి మెగా ఫుడ్ మరియు హర్బల్ పార్క్ ఈ నెల 9న ఆదివారం ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా శుక్రవారం మీడియాతో మాట్లాడిన పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ, ఈ ప్లాంట్ కోసం మానవ వనరులను అభివృద్ధి చేస్తున్నామని, స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో పతంజలి కీలక పాత్ర పోషిస్తుందని, దేశవ్యాప్తంగా కార్మిక నైపుణ్యాలను పెంపొందించేందుకు పతంజలి కృషి చేస్తుందని పేర్కొన్నారు.
"మేం ప్రతిభావంతులైన వ్యక్తులను గుర్తించి ప్రోత్సహిస్తున్నాం. స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడం, రైతుల స్థాయిని మెరుగుపరచడం మా ప్రధాన లక్ష్యాలు" అని ఆచార్య బాలకృష్ణ అన్నారు. ఈ ప్లాంట్ విజయానికి అందరి సహకారం అవసరమని, రైతుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు పతంజలి కృషి చేస్తుందని చెప్పారు. "ఈ ప్రాంతంలోని ప్రతి గ్రామ రైతులు మా సంస్థతో అనుసంధానమై ఉన్నారు" అని అన్నారు.
నైపుణ్య అభివృద్ధిలో పతంజలి ముందంజలో ఉంది: ఆచార్య బాలకృష్ణ
ఈ ప్లాంట్ ఏర్పాటులో చాలా సమయం, శ్రమ వెచ్చించామని, కోవిడ్-19 మహమ్మారి వల్ల అనేక సవాళ్లు ఎదుర్కొన్నామని బాలకృష్ణ తెలిపారు. అయినప్పటికీ, తాము అంకితభావంతో ముందుకు సాగి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. ప్రధాని మోదీ కలలుగన్న నైపుణ్య భారతదేశాన్ని సాకారం చేసేందుకు పతంజలి కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.
ఈ ప్లాంట్ను ఆధునిక సాంకేతికతతో నిర్మించామని, ఇందులో అత్యాధునిక ప్యాకేజింగ్ లైన్లు, టెక్నోప్యాక్ వ్యవస్థలు, పరిశోధన ప్రయోగశాలలు ఉండేలా ఏర్పాటు చేశామని బాలకృష్ణ వెల్లడించారు. "మాకు అంతర్జాతీయ మార్కెట్లో మాకు స్థాయిని దృష్టిలో ఉంచుకుని దేశీయ రైతుల ఉత్పాదకతను పెంచడంతో పాటు.. ఎగుమతులకు అవసరమైన, నాణ్యమైన ఉత్పత్తులను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. " అని చెప్పారు.
ముడిపదార్థాల ఆధారంగా, ఈ ప్లాంట్లో నారింజ, నిమ్మ, ఉసిరికాయ, దానిమ్మ, జామ, ద్రాక్ష, ,బీరకాయ, క్యారెట్ , మామిడి నారింజ గుజ్జు, ఉల్లిపాయ మరియు టమాటా పేస్ట్ వంటి పలు ఉత్పత్తులను తయారుచేయనున్నారు,





















