అన్వేషించండి

Farmer Protest: కనీస మద్దతు ధరపై కేంద్రం ఆఫర్‌ను తిరస్కరించిన రైతు సంఘాలు

Union Govts 5-year MSP contract offer: ఐదేళ్ల వరకు కనీస మద్దతు ధరకు  ప్రభుత్వ ఏజెన్సీలు కొనుగోలు చేస్తాయని మంత్రుల బృందం చేసిన ప్రతిపాదనను రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా తిరస్కరించింది.

Samyukt Kisan Morcha: న్యూఢిల్లీ: నిరసనకు దిగిన రైతులు, కేంద్ర మంత్రుల మధ్య ఇదివరకే మూడు విడతల చర్చలు జరిగాయి. తాజాగా ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు నాలుగో దఫా చర్చలు ముగిశాయి. ఈ చర్చల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఓ ఆఫర్ ఇచ్చింది. ఐదేళ్ల వరకు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను కనీస మద్దతు ధర (MSP)కు  ప్రభుత్వ ఏజెన్సీలు కొనుగోలు చేస్తాయని మంత్రుల బృందం ఆందోళన చేపట్టిన రైతులకు ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనను సంయుక్త కిసాన్ మోర్చా (SKM) తిరస్కరించింది. అయితే ఈ రైతు సంఘం ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చి (Farmer Protest) ఆందోళనలో భాగమైన సభ్యులు కాదని తెలిసిందే.

పంటలకు ఐదేళ్ల కనీస మద్ధతు ధర
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అర్జున్‌ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్‌ రైతు సంఘాల  నేతలతో చర్చల్లో పాల్గొన్నారు. వీరితో పాటు పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ సైతం ఈ చర్చల్లో పాల్గొని పలు అంశాలపై చర్చించారు. కందులు, మొక్కజొన్న, మినుములు పండించే సాగుదారులతో ఎన్‌సీసీఎఫ్, ఎన్‌ఏఎఫ్‌ఈడీ వంటి సహకార సంఘాలు ఒప్పందం కుదుర్చుకుంటాయి. కేంద్రం చెప్పినట్లుగా అయిదేళ్ల పాటు కనీస మద్ధతు ధరలకు ప్రభుత్వం ఏజెన్సీలు కొనుగోలు చేసే ఆయా పంట ఉత్పత్తులపై ఎలాంటి పరిమితి ఉండదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఫిబ్రవరి 8, 12, 15 తేదీల్లోనూ చర్చలు జరిగినా కేంద్రం ఏ నిర్ణయానికి రాలేదు. తాజాగా జరిగిన చర్చలతో రైతులకు 5 ఏళ్ల MSP ఆఫర్ (5-year MSP contract offer) ఇచ్చింది. దీనిపై రైతు సంఘాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సంయుక్త కిసాన్ మోర్ఛా అనే రైతు సంఘం మాత్రం కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించింది. అన్ని పంటలకు కనీస మద్ధతు ధర ఇవ్వాలని డిమాండ్ చేసింది.

సంయుక్త కిసాన్ మోర్ఛా సోమవారం సాయంత్రం మాట్లాడుతూ.. కేంద్రం పేర్కొన్న ఐదు పంటలతో పాటు మొత్తం 23 పంటలకు కనీస మద్దతు ధర కేంద్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2014 మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా బీజేపీ నేతలు అన్ని పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు. 

రైతుల డిమాండ్లు ఇవే.. 
కేంద్రంతో చర్చలు జరుపుతున్నందున ప్రస్తుతానికి రైతుల ఆందోళన (ఢిల్లీ చలోను) తాత్కాలికంగా విరమించారు. తమ డిమాండ్లకు సర్కార్ పరిష్కారం చూపకపోతే ఫిబ్రవరి 21న తిరిగి నిరసన, ఆందోళన కార్యక్రమాలు మొదలుపెడతామని రైతు సంఘాలు హెచ్చరించాయి. రైతుల డిమాండ్లలో కనీస మద్ధతు ధరతో పాటు ఎంఎస్ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు చేయడం. పంట రుణాల మాఫీ, విద్యుత్‌ ఛార్జీలపై టారిఫ్‌ల పెంపు నిలిపివేయాలని రైతులు కోరుతున్నారు. వీటితో పాటు రైతులు, వ్యవసాయ కూలీలకు పింఛన్లు అందించాలని, 2021 నిరసన సమయంలో రైతులపై నమోదైన కేసుల ఎత్తివేయాలన్న వారి డిమాండ్లు. గతంలో జరిపిన ఆందోళనల్లో చనిపోయిన రైతుల కుటుంబాలకు కేంద్రం పరిహారం ఇవ్వడం, భూసేకరణ చట్టం 2013 పునరుద్ధరణ చేయాలని సైతం రైతులు కోరుతున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Embed widget