By: ABP Desam | Updated at : 02 Sep 2021 02:50 PM (IST)
ఏపీ హైకోర్టు ( ఫైల్ ఫోటో )
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐఏఎస్ అధికారులు కోర్టు ధిక్కరణ కేసుల్లో వరుసగా శిక్షలకు గురవుతున్నారు. గురువారం ఏపీ హైకోర్టు ఏకంగా ఐదుగురు సివిల్ సర్వీస్ అధికారులకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. IAS అధికారులు మన్మోహన్ సింగ్, రేవు ముత్యాలరాజు, ఎస్ఎస్ రావత్, ఇంతియాజ్, శేషగిరిబాబు లకు ఉన్నత న్యాయస్థానం శిక్ష విధించింది. వీరిలో మన్మోహన్ సింగ్ రిటైరయ్యారు. మిగిలిన నలుగురూ సర్వీసులో ఉన్నారు.
నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ అవసరాల కోసం తాళ్లపాక సాయిబ్రహ్మ అనే మహిళకు సంబంధించిన భూమిని అధికారులు సేకరించారు. కానీ పరిహారం ఇవ్వలేదు. ఆ మహిళ తనకు రావాల్సిన పరిహారం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అధికారులందర్నీ కలిశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. చివరికి హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో ఈ పిటిషన్ను విచారించిన ధర్మాసనం మహిళకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కానీ అధికారులు పట్టించుకోలేదు. పరిహారం చెల్లించలేదు. దీంతో తాము ఆదేశించినా పరిహారం ఇవ్వరా అని హైకోర్టు బాధ్యులైన ఐదుగురు అధికారులకు జైలు శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
మన్మోహన్ సింగ్కు నెల రోజుల జైలు, రూ.1000 జరిమానా, శేషగిరిబాబుకు రూ.1000 జరిమానా, 2 వారాల జైలు , ఎస్.ఎస్.రావత్కు నెల రోజుల జైలు, రూ.1000 జరిమానా, ముత్యాల రాజుకు రెండు వారాల జైలు, రూ.1000 జరిమానా, ఇంతియాజ్కు నెల రోజుల జైలు రూ. 1000 జరిమానా హైకోర్టు విధించింది. వీరి జీతాల నుంచి పరిహారం వసూలు చేసి పిటిషనర్కు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ అధికారుల్లో శేషగిరిబాబు, రేవు ముత్యాలరాజు నెల్లూరు జిల్లా మాజీ కలెక్టర్లు, మిగిలిన వారు ఆర్థిక శాఖతో పాటు ఇతర బాధ్యతల్లో ఉన్నారు. రేవు ముత్యాలరాజు ప్రస్తుతం సీఎంవో పొలిటికల్ సెక్రటరీగా ఉన్నారు. ఎస్ఎస్ రావత్ ఆర్థిక శాఖ వ్యవహారాలను చూసుకుంటున్నారు. కీలకమైన అధికారులుక హైకోర్టు శిక్ష వేయడం అధికారవర్గాల్లో సంచనలం రేపుతోంది.
ఐదుగురు ఐఏఎస్ అధికారులకు శిక్షపై అప్పీల్ చేసుకునేందుకు హైకోర్టు నెల రోజులు గడువిచ్చింది. ఈ క్రమంలో నెల రోజుల పాటు జైలు శిక్షను సస్పెండ్ చేసింది. ఇటీవలి కాలంలో కోర్టు ధిక్కరణ కింద కేసులకు .. శిక్షలకు గురవుతున్న అధికారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రభుత్వం పైఇప్పటి వరకూ ఎనిమిది వేల కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నట్లుగా లెక్క బయటపడింది. తమకు అన్యాయం చేశారని .. న్యాయం అందేలా చూడాలని ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో లక్షా 94వేల కేసులు పెండింగ్లో ఉన్నట్లుగా లెక్కలు తేలాయి.
National Survey: కొడుకు పుట్టాలని కోరుకునే జంటల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది, సర్వేలో తేలిన విషయం
Prakasam Road Accident : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మిత్రులు సజీవదహనం
Petrol Diesel Price 18th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, పెరిగిన డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా
Gold Silver Price Today 18th May 2022 : గోల్డ్ ప్రియులకు షాకింగ్ న్యూస్, నేడు భారీగా పెరిగిన బంగారం రేట్స్, స్వల్పంగా పెరిగిన వెండి
Weather Updates : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?
Today Panchang 18th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, వినాయక శ్లోకం
Fat Removal Surgery: కొవ్వును కరిగించే లైపోసక్షన్ ఆపరేషన్ ఎలా చేస్తారు? అది ప్రాణాలు తీసేంత ప్రమాదకరంగా ఎందుకు మారుతోంది?
Breaking News Live Updates : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు సజీవదహనం