అన్వేషించండి

Bharat Ratna 2024: కిసాన్‌ ఛాంపియన్‌ చరణ్ సింగ్‌కి భారతరత్న, జీవితమంతా రైతులకే అంకితం

Bharat Ratna 2024: కిసాన్‌ ఛాంపియన్‌గా పేరొందిన మాజీ ప్రధాని చరణ్ సింగ్‌కి కేంద్రం భారతరత్న అవార్డు ప్రకటించింది.

Chaudhary Charan Singh Biography: కిసాన్ ఛాంపియన్. మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌కి (Chaudhary Charan Singh) భారత దేశం పెట్టుకున్న పేరు ఇది. రైతుల బాగు కోసం తన జీవితాన్నే త్యాగం చేసి స్ఫూర్తిగా నిలిచారు చరణ్ సింగ్‌. అందుకే భారత ప్రభుత్వం ఆయనను అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో సత్కరించింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, జర్నలిజం..ఇలా అన్ని రంగాల్లోనూ ఆయన అత్యుత్తమ సేవలందించారు. 1902లో ఉత్తరప్రదేశ్‌లోని నూర్‌పూర్‌లో డిసెంబర్ 23న జన్మించారు చరణ్ సింగ్. రైతు కుటుంబంలో పుట్టిన ఆయన వాళ్ల కష్టాలేంటో తెలుసు. బాల్యం నుంచి వాటిని కళ్లారా చూశారు. అందుకే...అంతగా రైతుల సంక్షేమం కోసం అనునిత్యం తపించారు. మీరట్, ఆగ్రాలో విద్యాభ్యాసం చేసిన చౌదరి చరణ్ సింగ్...1927లో మీరట్ కాలేజ్ నుంచి లా పట్టా పొందారు. ఘజియాబాద్‌లో అడ్వకేట్‌గా కెరీర్‌ని ప్రారంభించారు. 1928లో గాయత్రి దేవిని వివాహమాడారు. బాల్యంలో దయానంద సరస్వతి సిద్ధాంతాలకు ప్రభావితమైన చరణ్ సింగ్...ఆర్య సమాజ్‌లో సభ్యుడిగా చేరారు. కులం, మతం అనే భావనల్ని దగ్గరికి రానిచ్చే వారు కాదు. ఇద్దరు కూతుళ్లకీ కులాంతర వివాహం చేశారు. మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్‌ తన స్ఫూర్తిప్రదాతలు అని ఎప్పుడూ చెప్పే వారు చౌదరి చరణ్ సింగ్. 

రాజకీయ ప్రస్థానం..

1929లో చౌదరి చరణ్ సింగ్ తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. కాంగ్రెస్‌లో సభ్యుడిగా చేరారు. స్వాతంత్ర్య ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఈ పోరాటం ఫలితంగానే దాదాపు మూడు సార్లు ఆయన జైలుకెళ్లారు. 1937లో United Province Vidhan Sabha కి సభ్యుడిగా ఎన్నికయ్యారు. యూపీలో భూ సంస్కరణలకు ఆయనే ఆద్యుడు. దళారుల చేతుల్లో మోసపోకుండా రైతులను కాపాడేందుకు తొలిసారి  Agriculture Produce Market Bill ని తీసుకొచ్చారు. ఆ తరవాత ఇండియాలోని దాదాపు అన్ని ప్రావిన్స్‌లు ఈ బిల్‌ని అమలు చేశాయి. 1952లో ఆయన రెవెన్యూ మంత్రిగా ఎన్నికయ్యారు. అదే ఏడాది జులై 1వ తేదీన జమీందారీ వ్యవస్థను రద్దు చేశారు. భూసంస్కరణల చట్టాన్ని తీసుకొచ్చారు. 1953లో పట్వారీ వ్యవస్థ స్థానంలో లేఖ్‌పాల్ వ్యవస్థను తీసుకొచ్చారు చరణ్ సింగ్. ఆ తరవాత 1954లో యూపీలో Chakbandi Act ని అమలు చేశారు. జవహర్ లాల్ నెహ్రూ ఆర్థిక విధానాలను బహిరంగంగానే వ్యతిరేకించారు. ప్రతి రైతుకి తన భూమిపై హక్కు ఉండాలని నినదించారు. నెహ్రూ విధానాలను వ్యతిరేకించడం వల్ల రాజకీయంగా ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్నారు. సొంత పార్టీపైనే నిరసన వ్యక్తం చేయడం ఇబ్బందులకు గురి చేసింది. కాంగ్రెస్‌లో ఆయన హోదా తగ్గిపోయినప్పటికీ రైతుల మద్దతుని కూడగట్టుకున్నారు చౌదరి చరణ్ సింగ్. 1967 ఏప్రిల్ 1వ తేదీన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. BharatiyaKranti Dal పేరిట కొత్త పార్టీ స్థాపించారు. రామ్‌ మనోహర్ లోహియా, రాజ్ నారాయణ్ లాంటి వాళ్లతో చేతులు కలిపారు. 

యూపీ సీఎంగా...

1967లో యూపీకి ముఖ్యమంత్రి అయ్యారు చరణ్ సింగ్. కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాకుండా వేరే నేత సీఎం కావడం అదే తొలిసారి. 1967 ఏప్రిల్ 3వ తేదీ నుంచి 1968 ఫిబ్రవరి 25 వరకూ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తరవాత మళ్లీ 1970 లో ఫిబ్రవరి 18 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకూ ఈ పదవిలో కొనసాగారు. ఈ పదవీ కాలంలో రైతుల కోసం ఎంతో చేశారు. వాళ్లకు మేలు చేసే ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకొచ్చారు. ఈ పథకాల అమలు కోసం భారీగా నిధులు కేటాయించిన కారణంగా చాలా మంది మంత్రులకు జీతాల్లో కోత పడింది. అప్పట్లో అదో సంచలనం. 1977లో జనతా పార్టీ ఏర్పాటైంది. కాంగ్రెస్‌యేతర పార్టీలతో ఈ పార్టీని స్థాపించారు. అందులో చరణ్ సింగ్‌ పార్టీ BharatiyaKranti Dal కూడా చేరిపోయింది. భారతీయ క్రాంతి దళ్‌ పార్టీ గుర్తునే జనతా పార్టీ పెట్టుకుంది. 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జనతా పార్టీ సహా మిత్రపక్షాలకు 345 సీట్లు వచ్చాయి. ఆ సమయంలో ప్రధాని అభ్యర్థిగా చౌదరి చరణ్ సింగ్‌నే అందరూ ప్రతిపాదించారు. పైగా ఆయనకు ఎంపీల మద్దతు కూడా ఉంది. అయితే...అప్పట్లో జైప్రకాశ్ నారాయణ్ మొరార్జీ దేశాయ్‌కే మొగ్గు చూపారు. చౌదరి చరణ్‌ సింగ్‌కి హోం మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. 

ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా..

అయితే...మొరార్జీ దేశాయ్‌ సిద్ధాంతాలతో విభేదించిన చౌదరి చరణ్ సింగ్ 1978లో తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. ఆ తరవాత 1979లో ఆయనకు డిప్యుటీ పీఎమ్ పదవిని కట్టబెట్టారు. దీంతో పాటు ఆర్థికమంత్రిత్వ శాఖ బాధ్యతలూ అప్పగించారు. కొద్ది కాలానికే జనతా పార్టీలో విభేదాలు మొదలయ్యాయి. చరణ్ సింగ్‌కి మద్దతుగా ఉన్న 69 మంది ఎంపీలు లోక్‌సభలో ప్రత్యేక క్యాంప్ పెట్టారు. ఆ తరవాతే ఎన్నో నాటకీయ పరిణామాలు జరిగాయి. 1979 జులై 28వ తేదీన ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే...బలపరీక్ష సమయంలో ఇందిరా గాంధీ మద్దతుని ఉపసంహరించుకోవడం వల్ల చరణ్ సింగ్ వెంటనే రాజీనామా చేయాల్సి వచ్చింది. లోక్‌సభను రద్దు చేశారు. 1980 జనవరి 14వ తేదీ వరకూ చరణ్ సింగ్ ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా కొనసాగారు. ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీపై ఎమర్జెన్సీ సమయంలో చరణ్ సింగ్‌ కేసులు పెట్టారు. వాటిని వెనక్కి తీసుకుంటేనే మద్దతునిస్తామని కాంగ్రెస్ బెదిరించిందని, అందుకు తాను తలొగ్గలేదని ఓ సందర్భంలో చెప్పారు చరణ్ సింగ్. 

రచనా ప్రస్థానం..

చౌదరి చరణ్ సింగ్ రాజకీయాలతో పాటు తన రచనా ప్రస్థానాన్ని కొనసాగించారు. 1947లో Abolition of Zamindari : Two Alternatives” పేరిట ఓ పుస్తకం రాశారు. ఆ తరవాత 1959లో “Joint Farming X-rayed : The Problem and Its Solution” , 1964లో “India’s Poverty and Its Solution”  పుస్తకాలనూ ప్రచురించారు. గ్రామాలు, వ్యవసాయ రంగం, రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ చుట్టూనే ఆయన రచనలు సాగాయి. ఇవే అంశాలపై ఎన్నో వ్యాసాలూ రాశారు. భయమే తెలియని రచయితగా, రాజకీయ నాయకుడిగా, రైతుగా ఆయన ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. 1987లో మే 29న తుదిశ్వాస విడిచారు. దశాబ్దాల పాటు ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. 

 

టాప్ హెడ్ లైన్స్

West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Breaking News:
"విద్యార్థులపై కాల్పులు జరిపించింది హోంమంత్రే" లోక్‌సభలో రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
Anti Paper Leak Amendment Bill 2026 Passed : పేపర్ లీకులకు ఇక చెక్ - లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు–2026 ఆమోదం - కేంద్ర మంత్రి కీలక ప్రకటన
పేపర్ లీకులకు ఇక చెక్ - లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు–2026 ఆమోదం - కేంద్ర మంత్రి కీలక ప్రకటన
IPL Brand Value: క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!
క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget