అన్వేషించండి

Heart Health: రోజూ ఎనిమిది గంటలకు పైగా కూర్చుని పనిచేసేవారికి షాకింగ్ న్యూస్, అలా కూర్చుంటే ఈ గుండె సమస్యలు తప్పవు

చాలా మంది గంటల పాటూ కూర్చుని పని చేస్తుంటారు. ఇలాంటివారికి ఇది షాకింగ్ న్యూసే.

ఆఫీసులో తొమ్మిది నుంచి పన్నెండు గంటల పాటూ పనిచేసే పరిస్థితులు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులైతే కనీసం కదలనైనా కదలరు. ప్రాజెక్టులు, డెలివరీలు అంటూ లేచి రెండు అడుగులు కూడా వేయరు. ఇది చాలా ప్రమాదకరైమన ఆరోగ్యపరిస్థితులకు దారితీస్తుందని చెబుతోంది కొత్త అధ్యయనం. ఇది స్ట్రోక్ లేదా గుండె పోటు వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. అలా గంటలపాటూ కూర్చోవడం అనారోగ్యకరమైన జీవనశైలి కిందకే వస్తుందని చెబుతున్నారు అధ్యయనకర్తలు. 

చైనీస్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పెకింగ్ యూనియన్ మెడికల్ కాలేజీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం రోజులో ఎనిమిది గంటలు డెస్క్‌ల వద్ద కూర్చునే ఉద్యోగులకు గుండె పోటు లేదా స్ట్రోక్ వచ్చే అవకాశం 20 శాతం ఎక్కువ. పదకొండేళ్ల పాటూ పరిశోధకులు 21 దేశాలకు చెందిన 1,05,677 మంది వ్యక్తుల ఆరోగ్య రికార్డును పరిశీలించారు. అధ్యయనం ముగిసే సమయానికే వారిలో 6,200 మందికి పైగా మరణించారు. అందులో 2,300 గుండె పోటు కేసులు, 3000 స్ట్రోకులు వచ్చిన కేసులు, 700 గుండె వైఫల్యం కేసులు ఉన్నాయి. 

కదలకుండా కూర్చోకూడదు...
ఒక ఉద్యోగులు డెస్క్ వద్దే కదలకుండా కూర్చోవడాన్ని తగ్గించాలని అధ్యయనం సూచిస్తోంది. ప్రతి గంటకోసారైనా కనీసం ఇటూ అటూ కాసేపు నడవమని చెబుతోంది. శారీరక శ్రమ లేకపోవడం గుండెకు చేటు చేస్తుంది. శారీరక శ్రమ లేకపోవడంతో పాటూ ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల 8.8శాతం మరణాలు, 5.8 శాతం గుండె జబ్బులు సంభవించాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే పని మధ్యమధ్యలో విరామం తీసుకోవాలని ప్రజలకు చెబుతున్నారు అధ్యయనకర్తలు. 

పెరిగిపోతున్న గుండె జబ్బులు
గుండె వ్యాధులు నిశ్శబ్ధంగా పెరిగిపోతున్నాయి. మనదేశంలో అనేక మరణాలకు కారణమవుతున్నాయి. ఒక అంచనా ప్రకారం ప్రపంచ జనాభాలో గుండె జబ్బుల బారిన పడిన వారిలో 60 శాతం మంది మన దేశంలోనే ఉన్నారు. ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్, హైపర్ టెన్సివ్ హార్ట్ డిసీజ్, సెరెబ్రోవాస్కులర్ డిసీజ్ వంటివి అధికంగా భారత్ ప్రజలపై దాడి చేస్తున్నాయి. 

ఒత్తిడి కూడా...
ఎక్కువ గంటలు కదలకుండా కూర్చోవడం ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి స్థాయిలను పెంచుతుంది. ఊబకాయం, రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ పెరగడం, ఆస్టియో ఆర్ధరైటిస్ వంటి ఆరోగ్యప్రమాదాలు పొంచి ఉంటాయి. ఇవన్నీ చివరకు గుండె వైఫల్యానికి దారి తీస్తాయి. 

కదులుతూ ఉండాలి...
గంటకోసారైనా రెండు రౌండ్లు వేగంగా నడవాలి. పని చేసినప్పుడు కాకుండా మిగతా సమయంలో కనీసం అరగంటైనా వాకింగ్, ఇతర వ్యాయామాలు చేయాలి. లిఫ్టు వాడడం మానేసి, మెట్లు ఎక్కి దిగడం అలవాటు చేసుకోవాలి. 

Also read: ఆ ఊరికి అల్లుడిగా వెళతారా? కట్నంగా ఏమిస్తారో తెలిస్తే చచ్చినా వెళ్లరు

Also read: పిజ్జా, బర్గర్లలో అతిగా చీజ్ వేసుకుని లాగిస్తున్నారా? అయితే ఈ హెచ్చరిక మీకే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి భక్తులు, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై వేటు వేసిన టీటీడీ
పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి భక్తులు, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై వేటు వేసిన టీటీడీ
YSRCP PAC: వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
Mark Shankar: కుమారుడు మార్క్ శంకర్‌తో ఇండియాకు తిరిగొచ్చిన పవన్ దంపతులు - కొడుకుని ఎత్తుకుని మరీ..
కుమారుడు మార్క్ శంకర్‌తో ఇండియాకు తిరిగొచ్చిన పవన్ దంపతులు - కొడుకుని ఎత్తుకుని మరీ..
Kancha Gachibowli Land Dispute: ఏఐ వీడియోలతో విద్యార్థులను రెచ్చగొట్టారు- కంచ గచ్చి బౌలి భూ వివాదంపై మంత్రి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు
ఏఐ వీడియోలతో విద్యార్థులను రెచ్చగొట్టారు- కంచ గచ్చి బౌలి భూ వివాదంపై మంత్రి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs PBKS Match Highlights IPL 2025 | పంజాబ్ కింగ్స్ పై 8వికెట్ల తేడాతో సన్ రైజర్స్ సంచలన విజయం | ABP DesamLSG vs GT Match Highlights IPL 2025 | గుజరాత్ పై 6 వికెట్ల తేడాతో లక్నో విజయం | ABP DesamCSK Dot Balls Tree Saplings | IPL 2025 సామాజిక సందేశ స్ఫూర్తి కోసం ఓడిపోతున్న చెన్నైMS Dhoni LBW Out Controversy | ధోనీ నిజంగా అవుట్ అయ్యాడా..నాటౌటా..ఎందుకీ వివాదం..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి భక్తులు, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై వేటు వేసిన టీటీడీ
పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి భక్తులు, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై వేటు వేసిన టీటీడీ
YSRCP PAC: వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
Mark Shankar: కుమారుడు మార్క్ శంకర్‌తో ఇండియాకు తిరిగొచ్చిన పవన్ దంపతులు - కొడుకుని ఎత్తుకుని మరీ..
కుమారుడు మార్క్ శంకర్‌తో ఇండియాకు తిరిగొచ్చిన పవన్ దంపతులు - కొడుకుని ఎత్తుకుని మరీ..
Kancha Gachibowli Land Dispute: ఏఐ వీడియోలతో విద్యార్థులను రెచ్చగొట్టారు- కంచ గచ్చి బౌలి భూ వివాదంపై మంత్రి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు
ఏఐ వీడియోలతో విద్యార్థులను రెచ్చగొట్టారు- కంచ గచ్చి బౌలి భూ వివాదంపై మంత్రి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు
IPL 2025 SRH Record Chasing:  ఆరెంజ్ అలెర్ట్... బౌల‌ర్ల‌కి వార్నింగ్ పంపిన్ స‌న్ బ్యాట‌ర్లు.. పంజాబ్ పై రికార్డు ఛేజింగ్.. అభిషేక్ విధ్వంస‌క సెంచ‌రీ, హెడ్ ఫిఫ్టీ.. పంజాబ్ చిత్తు
ఆరెంజ్ అలెర్ట్... బౌల‌ర్ల‌కి వార్నింగ్ పంపిన్ స‌న్ బ్యాట‌ర్లు.. పంజాబ్ పై రికార్డు ఛేజింగ్.. అభిషేక్ విధ్వంస‌క సెంచ‌రీ, హెడ్ ఫిఫ్టీ.. పంజాబ్ చిత్తు
Oats Omelette Recipe : ఓట్స్ ఆమ్లెట్ రెసిపీ.. పోషకాలతో నిండిన హెల్తీ బ్రేక్​ఫాస్ట్​కి బెస్ట్ ఆప్షన్
ఓట్స్ ఆమ్లెట్ రెసిపీ.. పోషకాలతో నిండిన హెల్తీ బ్రేక్​ఫాస్ట్​కి బెస్ట్ ఆప్షన్
AP Inter Supplementary Exams: ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే
ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే
Abhishek Sharma : అభిషేక్ శర్మ తుపాన్‌ ఇన్నింగ్స్- ఆరెంజ్ ఆర్మీ అభిమానులకు స్పెషల్ మెసేజ్‌
అభిషేక్ శర్మ తుపాన్‌ ఇన్నింగ్స్- ఆరెంజ్ ఆర్మీ అభిమానులకు స్పెషల్ మెసేజ్‌
Embed widget