అన్వేషించండి

యేసు క్రీస్తుకు ముందు, ఆ తర్వాత సిలువ చరిత్ర ఏంటో మీకు తెలుసా ?

సిలువ వేయడాన్ని క్రూసిఫికేషన్ అని కూడా అంటారు. దీన్ని అనాగరికరమైన శిక్షగా చరిత్ర కారులు చెబుతారు. అత్యంత క్రూరమైన నేరాలు చేసిన వారికి  ఇలాంటి శిక్షలు వేసినట్లు ప్రపంచ చరిత్ర చెబుతోంది.


యేసు క్రీస్తుకు ముందు, ఆ తర్వాత సిలువ చరిత్ర ఏంటో మీకు తెలుసా ?


సిలువ వేయడాన్ని క్రూసిఫికేషన్ అని కూడా అంటారు. ఈ పద్దతిలో శిక్షించడం చాలా అనాగరికరమైన శిక్షగా చరిత్ర కారులు చెబుతారు. అత్యంత క్రూరమైన నేరాలు,  దేశ ద్రోహం ,  తిరుగుబాటు దారులకు, బందిపోటులకు  ఇలాంటి శిక్షలు వేసినట్లు ప్రపంచ చరిత్ర చెబుతోంది.  రోమన్లు  ఈ శిక్షను విస్తృతంగా వాడుకలోకి తెచ్చినప్పటికీ క్రీస్తు పూర్వం నుండి ఈ సిలువ శిక్ష అనేది  ప్రారంభమైనట్లు చరిత్ర పరికిస్తే అర్థం అవుతుంది.

 ఈ సిలువ శిక్ష ఎప్పుడు ప్రారంభం అయిందంటే...?

నేరస్థులను సిలువ వేయడం అనేది పర్షియన్ల కాలంలో అంటే క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్ధంలో సిలువ వేసినట్లు చారిత్రక ఆధారాలున్నాయి.  పర్షియన్ సామ్రాజ్యంలో  నేరస్థులను చెక్క కొయ్యలు, లేదా స్తంభాలకు వేలాడి దీసి శిక్షించే వారు. ఇది  పర్షియన్ సామాజ్రంలో క్రీ. పూ. సుమారు 559 నుండి 339 వరకు  సాగినట్లు  చరిత్ర చెబుతోంది.  పర్షియన్ రాజు డేరియస్ 1  క్రీ. పూ 522 నుండి 436 వరకు చాలా మందిని సిలువ వేసి శిక్షించినట్లు  గ్రీకు చరిత్ర కారుడు  హెరోడోటస్  తన రచనలలో ఉదాహరించడం జరిగింది.  అయితే రోమన్లు సిలువ పై మేకులు కొట్టి  వేలాడ దీసేవారు. పర్షియన్లు మాత్రం తాళ్లతో కట్టి వేలాడి దీసి చనిపోయే వరకు సిలువపై  ఉంచే వారు. ఇలా  క్రీ. పూర్వం ఆరో శతాబ్దం నుండే  ఈ సిలువ శిక్ష ప్రారంభమైంది.


ఫోనిషయన్లు - కార్తాజీనియన్లు, అలెగ్జాండర్  కాలంలో  

 పర్షియన్ల తర్వాత  క్రీ. పూ 1200 నుండి 539 వరకు ఫోనీషియన్లు,  క్రీ. పూ 814 నుండి 146 వరకు  కార్తాజీనియన్లు కూడా సిలువ వేసే శిక్షను నేరస్థులకు విధించినట్లు చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. ఇవి కేవలం నేరస్థులకు మాత్రమే కాకుండా కార్తాజీనియన్లు సైనికులను కూడా యుద్ధాల్లో ఓడినా, యుద్ధం నుండి పారిపోయినా  సిలువ వేసి చంపే శిక్షను అమలు చేసినట్లు చరిత్ర చెబుతోంది. వీరి తర్వాత గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ది గ్రేట్ కూడా ఈ సిలువ శిక్షను అమలు చేసినట్లు రుజువులున్నాయి.  క్రీ. పూ 336 నుండి 323 వరకు ఈ సిలువ శిక్షను  అలెగ్జాండర్ తన శత్రువులకు, తన  ఆధిపత్యాన్ని  ఎదిరించే తిరుగుబాటు దారులకు అమలు చేసినట్లు చరిత్ర చెబుతోంది. 


సిలువ శిక్షను క్రూరంగా అమలు చేసిన రోమన్లు...

 అలెగ్జాండర్ ద్రి గ్రేట్ తర్వాత రోమన్ సామ్రాజ్యం విశ్వవ్యాప్తం అయింది.   క్రీ. శ 3వ శతాబ్దం నుండి 4 వ శతాబ్ధం వరకు సిలువ శిక్షను రోమన్లు తమ సామ్రాజ్యంలో  అత్యంత క్రూరంగా అమలు చేశారు.  నేరస్థులకు, తిరుగుబాటుదారులకు , దేశ ద్రోహానికి పాల్పడిన వారికి ఈ శిక్షను అమలు చేసే వారు. అయితే వీరు సిలవను వేసే పద్దతి కొంత  మార్చారు. తాళ్లతో చెక్కలపై వేలాడదీయడం కాకుండా  చేతుల్లో, కాళ్లలో మేకులు కొట్టేవారు. యేసు క్రీస్తును కూడా ఇలానే  సిలువ వేశారని బైబిల్ గ్రంధం చెబుతోంది.  ఇది క్రీ. శ 30 -33 మధ్యలో జరిగిందని చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి.  ఆతర్వాత స్పార్టకస్ తిరుగబాటు  క్రీ.శ 73-71 కాలంలో జరిగింది.  ఆ తిరుగుబాటును అణిచివేసిన తర్వాత రోమన్లు అప్పియన్ వే దారి గుండా  ఆరు వేల మంది బానిసిలను అత్యంత క్రూరంగా  సిలువ వేసి చంపినట్లు రోమన్ చరిత్ర చెబుతోంది.


సిలువ శిక్షను రద్దు చేసింది కూడా రోమన్ చక్రవర్తే..


రోమన్లు  అత్యంత క్రూరంగా అమలు చేసే ఈ సిలువ శిక్ష రద్దు కూడా ఓ విశేషంగా చెప్పాలి. దీన్ని అమలు చేసింది కూడా  రోమన్ చక్రవర్తే. అదేంటో ఇప్పుడు చూద్దాం. కాన్ స్టంటైన్ ది గ్రేట్ గా చెప్పబడే ఈ చక్రవర్తి  క్రైస్తవ్యాన్ని స్వీకరించడం జరిగింది. అప్పటి వరకు క్రైస్తవులను హింసించిన చరిత్ర రోమన్ పాలకులది. అలాంటిది అనూహ్యంగా కాన్ స్టంటైన్ కాలంలో అంటే క్రీ. శ. 272 నుండి 337 వరకు రోమన్ స్రామ్రాజ్య పాలకుడు. ఆయన క్రీ. శ 312 లో  మిల్వియన్ వంతెన యుద్దంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయనకు ఆకాశంలో సిలువ ఆకారంలో వెలుగును చూశారు.  ఈ చిహ్నంతో యుద్దంలో పాల్గొంటే నీవు విజయాన్ని సాధిస్తావు అన్న  సందేశం  ఆయనకు కనిపించిందని, దాంతో ఆయన తన సైనికుల డాళ్లపైన, జెండాల పైన సిలువ ముద్ర వేసి ఆ యుద్దంలో విజయం సాధించారని చరిత్ర కారులు చెబుతారు.  ఆ విజయంతో ఆయన , ఆయన తల్లి హెలెనా క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తారు. అప్పటి నుండి సిలువను ఓ పవిత్రమైన చిహ్నంగా గుర్తించి గౌరవిస్తారు. అప్పటి నుండే  కాన్ స్టంటైన్ చక్రవర్తి సిలువ శిక్షను రద్దు చేయడం జరిగిందని చరిత్ర చెబుతోంది.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

కన్యా రాశి వారఫలాలు ఆగస్టు 9-15: గ్రహాల నుంచి అనుకూల సంకేతం! నిలిచిపోయిన పనులు వేగవంతం!
కన్యా రాశి వారఫలాలు ఆగస్టు 9-15: గ్రహాల నుంచి అనుకూల సంకేతం! నిలిచిపోయిన పనులు వేగవంతం!
09-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
09-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
వృషభ రాశి 2026 ఆగస్టు 09 - 15 వారఫలం: కష్టం, ఆర్థిక మరియు సంబంధాల విషయాలలో సహనం అవసరం!
వృషభ రాశి 2026 ఆగస్టు 09 - 15 వారఫలం: కష్టం, ఆర్థిక మరియు సంబంధాల విషయాలలో సహనం అవసరం!
మేష రాశి వారఫలాలు: ఆగస్టు 9-15, అదృష్టం, ఆర్థిక లాభాలు మీ సొంతం!
మేష రాశి వారఫలాలు: ఆగస్టు 9-15, అదృష్టం, ఆర్థిక లాభాలు మీ సొంతం!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget