అన్వేషించండి

Actress : భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి హీరోయిన్ ఎవరో తెలుసా? జయలలిత మాత్రం కాదండోయ్

Actress : ఒక పాపులర్ హీరోయిన్ సీఎంగా గద్దెనెక్కి చరిత్ర సృష్టించింది. సీఎం పదవిని చేపట్టింది కొన్ని రోజులే అయినప్పటికీ, భారతీయ చరిత్రలోనే సీఎం అయిన మొట్టమొదటి నటిగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

భారతీయ రాజకీయ, సినీ చరిత్రలో సీఎం పదవిని చేపట్టిన నటీమణులు ఇద్దరే ఇద్దరు ఉన్నారు. అందులో తమిళనాడు రాష్ట్రంలో చాలా కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన దివంగత నటి జయలలిత ఒకరు. ఆమె 14 సంవత్సరాల 124 రోజుల పాటు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. షీలా దీక్షిత్ తర్వాత భారత దేశంలో ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం పని చేసిన రెండవ మహిళగా ఆమె చరిత్రను సృష్టించారు. అయితే జయలలిత సీఎంగా పదవిని చేపట్టక ముందే మరో హీరోయిన్ ఆ పదవిని చేపట్టి, ఇండియన్ హిస్టరీలో అత్యంత అరుదైన రికార్డును తన పేరున లిఖించుకుంది. ఆమె కూడా తమిళనాడుకు చెందినవారే కావడం విశేషం. మరి ఇప్పటికైనా ఆ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? ఆవిడ మరెవరో కాదు వి.ఎన్. జానకి రామచంద్రన్.

వి.ఎన్. జానకి ఎవరు ?

వి.ఎన్. జానకి ఒక పాపులర్ నటి, తమిళనాడు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు-రాజకీయ నాయకుడు ఎం.జి.ఆర్. భార్య. వైకోమ్ నారాయణి జానకి 1924 సెప్టెంబర్ 23న కేరళలో జన్మించారు. కళా నేపథ్యం ఉన్న కుటుంబంలో పెరిగిన జానకికి సంగీతం, నృత్యం అంటే చాలా ఇష్టం. ఆమె మామ పాపనాశం శివన్ ప్రఖ్యాత కర్ణాటక మ్యూజిషియన్. 

1936లో జానకి తండ్రి రాజగోపాల్ అయ్యర్ కూడా పాపులర్ మ్యూజిషియన్ గా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో ఆయనకు 'మద్రాస్ మెయిల్' చిత్రానికి పాటలు రాసే అవకాశం లభించింది. ఫలితంగా ఆ కుటుంబం మద్రాసు, ఇప్పటి చెన్నైకి మకాం మార్చింది. జానకి శాస్త్రీయ సంగీతం, నృత్యం రెండింటిలోనూ శిక్షణ పొంది, చివరికి సినిమా ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చింది. తరువాత ఆమె ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. ఆమె సినీ కెరీర్లో ఎక్కువగా తమిళనాడులోని అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకులలో ఒకరిగా ఎదిగిన మరుత్తూర్ గోపాలన్ రామచంద్రన్ (MGR)తో కలిసి నటించింది. తరువాత ఆయననే పెళ్లాడింది.

Also Read'కోర్టు' రివ్యూ: థియేటర్లలో వాదనలు నిలబడతాయా? పడిపోతాయా? నాని సమర్పణలో వచ్చిన సినిమా ఎలా ఉందంటే?

జానకి రామచంద్రన్ కు ముఖ్యమంత్రి పగ్గాలు 

1987లో ఎంజీఆర్ మరణం తరువాత ఆయన రాజకీయ వారసురాలు ఎవరు అన్న విషయం తీవ్ర వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. అప్పటికే 'ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం' పార్టీని స్థాపించి, ముఖ్యమంత్రి హోదాలో కన్నుమూసిన ఎంజీఆర్ కు సన్నిహితంగా ఉన్న సహచరురాలు జయలలిత. ఆమెతో జానకి రాజకీయ పోరాటం గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. అయితే ఎట్టకేలకు ఎంజీఆర్ సతీమణి అయిన జానకికే ఆయన తదనంతరం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే భాగ్యం దక్కింది. దీంతో జానకి కొంతకాలం తమిళనాడుకు తొలి మహిళా ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. అయితే ఆమె పదవీకాలం కేవలం 23 రోజులు మాత్రమే కొనసాగింది. 1988 జనవరి 7 నుండి 1988 జనవరి 30  వరకు మాత్రమే జానకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. జానకి ముఖ్యమంత్రిగా ఉన్న కాలం స్వల్పకాలికమే అయినప్పటికీ, ఆమె పాత్ర భారత రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేకమైన అధ్యాయంగా మిగిలిపోయింది. ఎందుకంటే ఆమె భారత చరిత్రలో ముఖ్యమంత్రి అయిన మొట్ట మొదటి నటి.

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kashmir Terror Attack: కశ్మీర్‌లో ఉగ్ర దాడి - టూరిస్టులపై కాల్పులు - ఒకరి మృతి
కశ్మీర్‌లో ఉగ్ర దాడి - టూరిస్టులపై కాల్పులు - ఒకరి మృతి
BJP Vishnu Meet AP CM: సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
Glod Price Rs 1 Lakh: బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
UPSC Results : యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Gujarat Titans Winning Strategy IPL 2025 | టాప్ లో ఉంటే చాలు..ఇంకేం అవసరం లేదంటున్న గుజరాత్ టైటాన్స్Trolling on Ajinkya Rahane vs GT IPL 2025 | బ్యాటర్ గా సక్సెస్..కెప్టెన్ గా ఫెయిల్..?GT vs KKR IPL 2025 Match Review | డిఫెండింగ్ ఛాంపియన్ దమ్ము చూపించలేకపోతున్న KKRSai Sudharsan 52 vs KKR IPL 2025 | నిలకడకు మారు పేరు..సురేశ్ రైనా ను తలపించే తీరు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kashmir Terror Attack: కశ్మీర్‌లో ఉగ్ర దాడి - టూరిస్టులపై కాల్పులు - ఒకరి మృతి
కశ్మీర్‌లో ఉగ్ర దాడి - టూరిస్టులపై కాల్పులు - ఒకరి మృతి
BJP Vishnu Meet AP CM: సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
Glod Price Rs 1 Lakh: బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
UPSC Results : యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
Singer Sunitha: నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
IPS PSR Anjaneyulu arrested: నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
Musical horn: భారతీయ సంగీతంలోకి వాహనాల హార్న్ - గడ్కరీ వినూత్న ఆలోచన -ఇంటర్నెట్ బ్లాస్ట్
భారతీయ సంగీతంలోకి వాహనాల హార్న్ - గడ్కరీ వినూత్న ఆలోచన -ఇంటర్నెట్ బ్లాస్ట్
Mahesh Babu: మహేష్ బాబు వెనుక డైనోసార్లు పరిగెడితే... మైండ్ బ్లాక్ అయ్యేలా రాజమౌళి సినిమాలో యాక్షన్ ఎపిసోడ్!
మహేష్ బాబు వెనుక డైనోసార్లు పరిగెడితే... మైండ్ బ్లాక్ అయ్యేలా రాజమౌళి సినిమాలో యాక్షన్ ఎపిసోడ్!
Embed widget