అన్వేషించండి

IPS PSR Anjaneyulu arrested: నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు

ముంబై నటి కాదంబరి జత్వానీకి వేధింపుల కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు అయ్యారు. ఏపీ సీఐడీ హైదరాబాద్‌ లో ఆయనను అరెస్ట్ చేసింది.

IPS PSR Anjaneyulu | అమరావతి: ముంబై నటి కాదంబరి జత్వాని వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు అయ్యారు. నటి జత్వానీపై వేధింపుల కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులును ఏపీ సిఐడి  అరెస్టు చేసింది. హైదరాబాద్ లో అరెస్టు చేసి ఆయనను విజయవాడకు తరలిస్తున్నట్లు సమాచారం. వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆంజనేయులు సేవలు అందించారు. మాజీ సీఎం  జగన్ కు అత్యంత విధేయుడుగా పని చేశారని పి.ఎస్.ఆర్ ఆంజనేయులుపై విమర్శలు ఉన్నాయి.

ఏపీలో సీనియర్ ఐపీఎస్‌లుగా ఉన్న విశాల్ గున్ని, పీఎస్ఆర్ సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటాల సస్పెన్షన్  మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం గత నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురూ కూటమి ప్రభుత్వం మారినప్పటి నుంచి విదుల్లో లేరు. మొదట చంద్రబాబు ప్రభుత్వం వారికి పోస్టింగ్ ఇవ్వలేదు. ఆ తర్వాత ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేశారు.          

ముగ్గురు ఐపీఎస్‌లకు మరింత గడ్డు కాలం 

ముంబై నటి జత్వానీ కుటుంబాన్ని మహారాష్ట్ర నుంచి ఏపీకి తీసుకు వచ్చి చిత్ర హింసలు పెట్టారని ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా సినీ నటుల్ని, ప్రముఖుల్ని అరెస్ట్ చేస్తే పోలీసులు మీడియాకు వివరాలు ఇచ్చేవారుు. మీడియా ముందు ప్రవేశ పెట్టేవాళ్లు . కానీ అసలు ఈ వ్యవహారం వైసీపీ హయాంలోనే బయటకు రాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక బాధితురాలు కాదంబరి జెత్వానీ బయటకు వచ్చి కేసులు పెట్టారు. అది కూడా మీడియాకు లీకులు అంది ఆమెపై వేధింపులు జరిగాయని వార్తలు వచ్చాక ఫిర్యాదు చేశారు. కాదంబరి జెత్వానీ తన స్థలాన్ని అక్రమంగా అమ్మాలని ప్రయత్నించి రూ.5 లక్షలు తీసుకుందని వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ గతంలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేయడానికి ముందే పోలీసులు ముంబై వెళ్లేందుకు టిక్కెట్లు సైతం బుక్ చేసుకున్నారు  ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ ను అరెస్టు చేశారు. తరువాత ఆయన బెయిల్ తెచ్చుకున్నారు.  పోలీసు అధికారులకు ముందస్తు బెయిల్ లభించింది.  

సినీ నటి జెత్వానీపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని అభియోగాలు          

ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు వేయడానికి ప్రధాన కారణం వైసీపీ హయాంలో నటి కాదంబరి జత్వానీపై వేధింపులు. ముంబయి నటితో పాటు ఆమె కుటుంబాన్ని బలవంతంగా ఏపీకి తీసుకొచ్చి వేధించారని ఆరోపణలున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం మారాక కాదంబరీ జత్వానీ ఫిర్యాదు చేయడంతో ఆమెపై జరిగిన వేధింపుులు, తప్పుడు కేసులో అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేశారని వెలుగు చూసింది. తనపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని.. వైసీపీ నేత విద్యాసాగర్‌, ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నిలే ఇందుకు కారణమని జత్వానీ ఫిర్యాదు చేశారు. ఐపీఎస్ లపై ఆరోపణలు రావడంతో అప్పటి  డీజీపీ ద్వారకా తిరుమలరావు పూర్తిస్థాయి విచారణకు సైతం ఆదేశించారు.          

కూటమి ప్రభుత్వం వచ్చిన  విచారణ                   

 డీజీపీ ఆదేశాలతో విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో జత్వానీ, ఆమె ఫ్యామిలీపై గతంలో నమోదైన కేసు దర్యాప్తు చేపట్టి.. డీజీపీకి నివేదిక సమర్పించారు. ఈ క్రమంలో ముగ్గురు ఐపీఎస్‌ల అధికారులపై ప్రభుత్వం వేటు పడింది. ఇదే కేసులో ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ సైతం గతంలో సస్పెండ్ చేశారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Seetha Payanam OTT : ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Petrol Pump Scam: ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
Embed widget