అన్వేషించండి

Union Budget 2022: నిర్మలమ్మ 'బంగారం' కదా! నగల కొనుగోలుపై ఈఎంఐ సౌకర్యం కల్పించండి మేడమ్‌!

కరోనాతో చితికిపోయిన రంగాల్లో బంగారం, నగల తయారీ పరిశ్రమ ఒకటి! జ్యువెలరీ రంగం వృద్ధి చెందాలంటే తమకూ కొన్ని మినహాయింపులు, రాయితీలు కల్పించాలని జెమ్‌ అండ్‌ జ్యువెలరీ డొమొస్టిక్‌ కౌన్సిల్‌ (GJC) ప్రభుత్వాన్ని కోరుతోంది.

కరోనా మహమ్మారి విలయానికి చితికిపోయిన రంగాల్లో బంగారం, నగల తయారీ పరిశ్రమ ఒకటి! మొదట్లో బాగా నష్టపోయిన ఈ పరిశ్రమ గతేడాది నుంచి కోలుకుంటోంది. చివరి దీపావళికి టన్నుల కొద్దీ బంగార౦ అమ్ముడుపోయింది. మళ్లీ ఇప్పుడు ఒమిక్రాన్‌ భయాలు వెంటాడుతున్నాయి. జ్యువెలరీ రంగం వృద్ధి చెందాలంటే తమకూ కొన్ని మినహాయింపులు, రాయితీలు కల్పించాలని జెమ్‌ అండ్‌ జ్యువెలరీ డొమొస్టిక్‌ కౌన్సిల్‌ (GJC) ప్రభుత్వాన్ని కోరుతోంది.


* రానున్న బడ్జెట్‌లో నగలపై జీఎస్‌టీని ఇప్పుడున్న 3 నుంచి 1.5 శాతానికి తగ్గించాలని నిర్మలా సీతారామన్‌ను జీజేసీ కోరుతోంది.


* గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మంది పాన్‌ కార్డులు లేవు. అత్యవసరంగా బంగారం కొనుగోలు చేయాలంటే ఇబ్బంది కలుగుతోంది. అందుకే పాన్‌ కార్డు లిమిట్‌ను రూ.2 నుంచి 5 లక్షలకు పెంచాలి.

* కరోనా లాక్‌డౌన్‌ల వల్ల వ్యాపారం నష్టపోయింది. ప్రజలు నగలు  కొనుగోలు చేయకపోవడంతో ఎంఎస్‌ఎంఈ జ్యుయెలర్స్‌, స్వర్ణకారులు, కళాకారులు, ఉద్యోగులకు ఉపాధి దొరకడం లేదు. అందుకే పన్నుల పరంగా మినహాయింపులు ఇవ్వాలి.

* గోల్డ్‌ మానిటైజేషన్‌ పథకం (GMC) కింద వ్యక్తులు కనీసం ఎంత పరిమాణంలో బంగారం దాచుకోవచ్చో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.

* 22 క్యారెట్ల బంగారు నగలపై ఈఎంఐ సౌకర్యానికి అనుమతి ఇవ్వాలి. దాంతో వజ్రాలు, నగల పరిశ్రమ వృద్ధి జోరందుకుంటుంది.

* ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 40Aలో మార్పులు చేయాలి. రోజుకు రూ.10వేలుగా ఉన్న నగదు పరిమితిని రూ.1 లక్షకు పెంచాలి.

* క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేసే బంగారు నగలపై ఇప్పుడున్న 1-1.5 బ్యాంకు కమిషన్‌ను పూర్తిగా రద్దు చేయాలి.

* వజ్రాలు, నగల పరిశ్రమకూ మూలధన రాబడిపై పన్ను మినహాయింపును విస్తరించాలి. నగలు అమ్మి కొత్త నగల్లో పెట్టుబడి పెడితే ఆదాయపన్ను చట్టం సెక్షన్‌ 54F ప్రకారం మినహాయింపు ఇవ్వాలి.

* బంగారం, విలువైన లోహాలు, వజ్రాలు, నగలపై పెట్టుబడి రాబడిపై 1.25 శాతం జీఎస్‌టీ విధించాలి. ఇప్పుడు ఇన్‌పుట్‌ క్రెడిట్‌ లేకుండా 1 శాతం, ఇన్‌పుట్‌ క్రెడిట్‌తో 12.5 శాతం ఎక్సైజ్‌ సుంకం, అదనంగా 1 శాతం వ్యా్‌ట్‌ అమలు చేస్తున్నారు. దాంతో స్థానికంగా తయారు చేసే బంగారు ఆభరణాలపై  అదనంగా 1 నుంచి 2 శాతం పన్ను పడుతోంది. దీనికి ఏకరూపత తీసుకొచ్చి జీఎస్‌టీ విధించాలి.

* దేశంలోని ప్రజల వద్ద 23,000-24000 టన్నుల బంగారం ఉందని అంచనా. 2015 నుంచి కేంద్రం గోల్డ్‌ మానిటైజేషన్‌ పథకం అమలు చేస్తోంది. ఇందులోనే బంగారం దాచుకోవాలని చెబుతోంది. కానీ ఇప్పటి వరకు చేసిన డిపాజిట్‌ 11 టన్నులు మాత్రమే. దీనిపై ఎలాంటి స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణం.

Also Read: Budget 2022: టాక్స్‌ పేయర్లకు బడ్జెట్‌ కానుక!! పన్ను మినహాయింపు పరిమితి పెంచనున్న కేంద్రం!!

Also Read: Union Budget 2022: జనవరి 31 నుంచి బడ్జెట్‌! ఈ సారి పార్ట్‌1, పార్ట్‌2గా విభజన!

Also Read: Budget 2022: క్రిప్టో రాబడికి బడ్జెట్లో నిర్వచనం!! 42% IT, 18% GST వేయడం ఖాయమేనట!!

Also Read: Budget 2022: ఇళ్లు అమ్ముకుంటాం! వడ్డీరేట్లు, రెంటల్‌ ఇన్‌కంపై పన్ను తగ్గించండి మేడం!!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:గుజరాత్‌ను చిత్తు చేసిన ఢిల్లీ, తేలిపోయిన గిల్‌  సేన
గుజరాత్‌ను చిత్తు చేసిన ఢిల్లీ, తేలిపోయిన గిల్‌ సేన
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Samsung New Smart TV: కొత్త టీవీలు లాంచ్ చేసిన శాంసంగ్ - వావ్ అనిపించే డిస్‌ప్లేలతో!
కొత్త టీవీలు లాంచ్ చేసిన శాంసంగ్ - వావ్ అనిపించే డిస్‌ప్లేలతో!
Silence 2 Movie Review: ‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Raja Singh Ram Navami Shobha Yatra| శ్రీరామనవమి శోభయాత్రలో ఫుల్ జోష్ లో రాజాసింగ్ | ABP DesamBJP Madhavi Latha vs Akbaruddin Owaisi | శ్రీరామ నవమి శోభయాత్రలో పాల్గొన్న మాధవి లత | ABP DesamTruck Hit Motorcycle In Hyderabad  | బైకును ఢీ కొట్టిన లారీ.. పిచ్చి పట్టినట్లు ఈడ్చుకెళ్లాడు | ABPPerada Tilak vs Ram Mohan Naidu | రామ్మోహన్ నాయుడు ఓడిపోతారు ఇదే కారణమంటున్న పేరాడ తిలక్ |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:గుజరాత్‌ను చిత్తు చేసిన ఢిల్లీ, తేలిపోయిన గిల్‌  సేన
గుజరాత్‌ను చిత్తు చేసిన ఢిల్లీ, తేలిపోయిన గిల్‌ సేన
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Samsung New Smart TV: కొత్త టీవీలు లాంచ్ చేసిన శాంసంగ్ - వావ్ అనిపించే డిస్‌ప్లేలతో!
కొత్త టీవీలు లాంచ్ చేసిన శాంసంగ్ - వావ్ అనిపించే డిస్‌ప్లేలతో!
Silence 2 Movie Review: ‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
Hyderabad Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
Hyderabad Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Jeep Compass New Car: జీప్ కంపాస్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ గ్లోబల్ లాంచ్ - మనదేశంలో ఎప్పుడు?
జీప్ కంపాస్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ గ్లోబల్ లాంచ్ - మనదేశంలో ఎప్పుడు?
UPSC 2023 Ranker Ananya Reddy: కేసీఆర్ అధికారం ఎందుకు కోల్పోయారు? మాక్ ఇంటర్వ్యూలో సివిల్స్ టాపర్ అనన్యా రెడ్డి కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అధికారం ఎందుకు కోల్పోయారు? మాక్ ఇంటర్వ్యూలో సివిల్స్ టాపర్ అనన్యా రెడ్డి కీలక వ్యాఖ్యలు
Embed widget