Breaking News Telugu Live Updates: తెలంగాణలో తొలి రోజు ముగిసిన రాహుల్ భారత్ జోడో పాద యాత్ర
Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్డేట్స్, వివరాలు మీకోసం
LIVE

Background
తెలంగాణలో తొలి రోజు ముగిసిన రాహుల్ భారత్ జోడో పాద యాత్ర
తెలంగాణలో తొలి రోజు ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో పాద యాత్ర.. గూడబల్లేరు నుంచి హెలికాప్టర్ లో హైదరాబాద్ శంషాబాద్ కు బయలుదేరిన రాహుల్ గాంధీ..
శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్ల నున్న రాహుల్ గాంధీ..
ఇప్పటి నుంచి పాదయాత్ర కు విరామం.. 27వ తేదీ ఉదయం తిరిగి ప్రారంభం కానున్న రాహుల్ భారత్ జోడో యాత్ర..
గూడబల్లేరు నుంచి హెలికాప్టర్ లో హైదరాబాద్ శంషాబాద్ కు బయలుదేరిన రాహుల్ గాంధీ..
శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్ల నున్న రాహుల్ గాంధీ..
ఇప్పటి నుంచి పాదయాత్ర కు విరామం.. 27వ తేదీ ఉదయం తిరిగి ప్రారంభం కానున్న రాహుల్ భారత్ జోడో యాత్ర..
తెలంగాణలోకి రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర ఎంట్రీ
మహబుబ్ నగర్.. తెలంగాణ లోకి ఎంట్రీ అయిన రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర...
కృష్ణా మండలం కృష్ణా బ్రిడ్జి పై తెలంగాణ లోకి ఎంట్రీ....
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడికి కాంగ్రెస్ జెండా ను అప్పగించిన కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్
కామారెడ్డిలో నకిలీ నోట్ల చలామణి ముఠా గుట్టురట్టు
కామారెడ్డిలో నకిలీ కరెన్సీ కలకలం....
నకిలీ నోట్ల చలామణి ముఠా గుట్టురట్టు
కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలో నకిలీ కరెన్సీ తయారీ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మహారాష్ట్ర, నాందేడ్, భైంసా, నిజామాబాద్ లకు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 1.65 లక్షల నఖిలి కరెన్సీ, నోట్ల తయారీకి ఉపయోగించే రసాయనాలను, పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు.
టపాసుల దుకాణంలో అగ్నిప్రమాదం, ఇద్దరి దుర్మరణం
విజయవాడ: దీపావళి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో విషాదం చోటుచేసుకున్నది. టపాసుల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించడంతో ఇద్దరు సజీవ దహనమయ్యారు. నగరంలోని గాంధీనగర్ జింఖానా గ్రౌండ్లో పటాకుల దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం ఓ దుకాణంలో పటాకీ పేలింది. దీంతో షాపులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఒక్కొక్కటిగా అన్ని పటాకులు పేలడంతో మంటలు పక్కనేఉన్న రెండు దుకాణాలు వ్యాపించాయి. భారీగా మంటలు ఎగసిపడటంతో మూడు షాపులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మృతులను పటాకుల దుకాణంలో పనిచేసే సిబ్బందిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

