అన్వేషించండి

Bangladesh: షేక్ హసీనాకి భారత్ ఎందుకు ఆశ్రయమివ్వడం లేదు? ఒకవేళ ఇస్తే ఏం జరుగుతుంది?

Bangladesh Crisis: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకి ఆశ్రయమిచ్చేందుకు భారత్‌ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది.

Bangladesh Crisis Updates: బంగ్లాదేశ్‌లో అల్లర్లు (Bangladesh Unrest) తీవ్రతరమైన వెంటనే ఆ దేశ ప్రధాని షేక్ హసీనా భారత్‌కి వచ్చేశారు. పరిస్థితులు చక్కబడేంత వరకూ ఇక్కడే తలదాచుకోవాలని భావించారు. కానీ ఆమె అనుకున్నట్టుగా జరగలేదు. ఆమెకి ఆశ్రయం ఇచ్చేందుకు భారత్ అంగీకరించలేదు. ప్రస్తుతానికి ఆమె భారత్‌లోనే ఉన్నప్పటికీ ఎప్పుడో అప్పడు ఇక్కడి నుంచి వెళ్లిపోక మాత్రం తప్పదు. ఆశ్రయమివ్వాలని ఆమె యూకేని కూడా కోరారు. కానీ...ఆ దేశమూ అందుకు సుముఖంగా లేదు. ఇక అగ్రరాజ్యం అమెరికా అయితే ఆమె తమ దేశానికి రాకుండా ఆంక్షలు విధించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఎక్కడికి వెళ్తారన్నదే కీలకంగా మారింది. మరో 48 గంటల పాటు ఆమె భారత్‌లోనే ఉంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

అయితే...ఇప్పటి సంక్షోభాన్ని చూస్తుంటే 1975 నాటి పరిస్థితులు గుర్తుకొస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు. ఆ సమయంలోనూ బంగ్లాదేశ్‌లో ఇదే స్థాయిలో అల్లర్లు జరిగాయి. షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబర్ రహమాన్ హతమయ్యారు. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాక షేక్ హసీనా భారత్‌కి వచ్చారు. ఆమెతో పాటు ఆమె భర్త, పిల్లలూ భారత్‌లోనే ఆశ్రయం పొందారు. 1975 నుంచి 1981 వరకూ అంటే దాదాపు ఆరేళ్ల పాటు తలదాచుకున్నారు. కానీ...ఇప్పటి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. బంగ్లాదేశ్‌ని భారత్ మిత్రదేశంగానే భావిస్తున్నప్పటికీ మోదీ సర్కార్ మాత్రం ఆమెకి ఆశ్రయం ఇచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. (Also Read: Bangladesh News: బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు- మహమ్మద్ యూనస్‌ నేతృత్వంలో పాలన)

బంగ్లాలో షేక్ హసీనాపై ఓ నియంత అనే ముద్ర పడిపోయింది. పౌర హక్కుల్ని అణిచివేశారన్న అపవాదునీ మూటగట్టుకున్నారు. ఇలాంటి సమయంలో ఆమెకి ఆశ్రయమివ్వడానికి భారత్‌ వెనకడుగు వేస్తోంది. పైగా దేశ భద్రతనూ దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం తీసుకోలేకపోతోంది. అయితే..అసలు కారణాలు వేరే ఉన్నాయి. ఎప్పుడైతే షేక్ హసీనా భారత్‌తో మైత్రిని బలపరుచుకున్నారో అప్పటి నుంచి అక్కడ భారత్‌పై వ్యతిరేకత పెరిగింది. పైగా ఇప్పుడు బంగ్లాదేశ్‌లో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి భవిష్యత్ కార్యాచరణనూ నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ప్రధాని పదవిలో ఎవరున్నా తమ మైత్రి మాత్రం కచ్చితంగా కొనసాగుతుందన్న సంకేతాలివ్వాలి. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో షేక్ హసీనాకి ఆశ్రయమిస్తే బంగ్లాదేశ్ అల్లర్లకు పరోక్షంగా కారణమైన ఇస్లామిస్ట్ గ్రూప్‌లు ఇంకా చెలరేగిపోయే ప్రమాదముంది.

అంతే కాదు. భారత్ కారణంగానే బంగ్లాదేశ్‌లో ఈ సంక్షోభం తలెత్తిందన్న అసత్య ప్రచారమూ చేసే అవకాశముంది. భారత్‌ అనవసరంగా ఈ అపవాదు మోయాల్సి వస్తుంది. జమాతే ఇస్లామీ గ్రూప్ దాదాపు మూడేళ్లుగా అక్కడ భారత్‌కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అందుకే ఇదంతా ఆలోచించే భారత్‌ ఈ వివాదాలకు దూరంగా ఉంటోంది. పైగా షేక్ హసీనా తరవాత ఏ దేశానికి వెళ్లాలనుకున్నా అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇస్తున్నట్టు సమాచారం. అటు షేక్ హసీనా మాత్రం భారత్‌లో ఉండేందుకు అనుమతినివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

 Also Read: Bangladesh Crisis: బంగ్లాదేశ్‌లో హిందువులపై ఎందుకీ దాడులు? కోటి మంది బెంగాల్‌కి వలస వస్తున్నారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
US Fed Rates Cut: అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Embed widget