అన్వేషించండి

Telangana LRS Scheme: ఆ ప్లాట్లు మాత్రమే క్రమబద్ధీకరణకు ఛాన్స్, LRSపై తెలంగాణ ప్రభుత్వం కీలక అప్‌డేట్

Land Regularisation Scheme | అక్రమ లేఅవుట్లు, పర్మిషన లేని లే ఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఇబ్బంది పడుతున్న వారికి ఎల్ఆర్ఎస్ కింద రెగ్యూలరైజేషన్ చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

LRS in Telangana | హైదరాబాద్: అనుమతి లేని లేఅవుట్ ప్లాట్ల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఇటీవల కీలక ప్రకటన చేసింది. దాని ప్రకారం ఎల్ఆర్ఎస్ (Land Regularisation Scheme) కింద ప్లాట్ల రెగ్యులరైజేషన్ను సోమవారం నుంచి మొదలుపెట్టింది. నిషేధిత జాబితాలో లేని, హైడ్రా నిబంధనలకు విరుద్ధంగా లేని సర్వే నెంబర్లలోని ప్లాట్ లకు ఆటోమేటిక్ ఫీజు చెల్లింపు పత్రాలు జారీ చేస్తున్నారు. ఎల్‌ఆర్ఎస్ (LRS) కింద రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల 70 వేల ప్లాట్లను క్రమబద్ధీకరణ చేయనున్నారు. దాంతో గత నాలుగేళ్ల నుంచి ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి భారీ ఊరట కలగనుంది. చెరువులకు 200 మీటర్లలోపు ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించడం లేదు.

అక్రమ లేఅవుట్ల ప్లాట్ల రిజిస్ట్రేషన్
అనధికారిక లేవట్లను క్రమబద్ధీకరణ చేసే ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో ప్రభుత్వం వేగం పెంచుతుంది. 2020 ఆగస్టు 26 తేదీ నాటికి ఏదైనా లేఔట్లలో 10 శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయినట్లయితే, అలాంటి లేఅవుట్లలో మిగతా ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మార్చి 31వ తేదీలోగా ఓపెన్ స్పేస్ చార్జీలు క్రమబద్ధీకరణ ఫీజు కల్పి చెల్లించే వారికి 25% రాయితీ ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఒకవేళ ఎల్లారీస్ ఫీజు చెల్లించాక వారి అప్లికేషన్ కనుక రిజెక్ట్ అయితే పది శాతం ప్రాసెసింగ్ చార్జీలు తీసుకొని మిగతా మొత్తాన్ని దరఖాస్తుదారులకి వెనక్కి ఇవ్వనున్నారు.

మార్చి 31 వరకు అవకాశం

పర్మిషన్ లేని లే ఔట్లలో ప్లాట్లు ఉన్నవారు ఎల్ఆర్ఎస్ ద్వారా రెగ్యులరైజేషన్ చేసుకోవచ్చు. ఏ మేరకు సోమవారం నుంచి ఆ ఫ్లాట్లకు ఆటోమేటిక్ ఫీజు చెల్లింపు పత్రాలు జారీ మొదలైంది. గత నాలుగేళ్లుగా ప్లాట్లు రెగ్యులరైజేషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి కాంగ్రెస్ ప్రభుత్వం పోరాట కలిగించింది. రెవెన్యూ రిజిస్ట్రేషన్లు నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయం చేసుకొని అక్రమ లేఔట్ లో జాబితా ఇలాంటి వివరాలను సాఫ్ట్వేర్ లో అనుసంధానం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారు వెంటనే ఫీజు చెల్లించి తమ ఫ్లాట్లను మార్చి 31 తేదీలోగా క్రమబద్ధీకరణ చేసుకోవాలని పురపాలక శాఖ సూచించింది.

2020లో తొలిసారి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని ప్రకటించింది. ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31, 2020 వరకు అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులను    సీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌ఆర్ఎస్ కోసం ఏకంగా 25.70 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 

సందేహాలు ఉంటే కాల్ సెంటర్ నెంబర్ ఇదే..

జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో ప్లాట్ల ఎల్‌ఆర్‌ఎస్‌ రెగ్యులరైజేషన్ కోసం ఏమైనా సందేశాలు ఉంటే స్పెషల్ కాల్ సెంటర్‌ నంబర్ 1800 599 8838 లో సంప్రదించాలని దరఖాస్తుదారులకు సూచించారు. ఎల్‌ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారి సమస్యను 10 రోజుల్లో పరిష్కరించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.  నిషేధిత జాబితాలో లేని, చెరువులు, కాలువలకు 200 మీటర్ల పరిధిలోకి రాని సర్వే నంబర్లలోని ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించి రెగ్యులరైజేషన్ చేసుకోవచ్చు. ఈ పరిధిలోకి వచ్చే ప్లాట్లకు ఆటోమేటిక్‌గా ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు నోటీసులు జనరేట్ అవుతాయి. మార్చి 31 తేదీలోగా ఎల్ఆర్ఎస్ సహా సంబంధిత ఫీజులు చెల్లించే వారికి 25 శాతం మేర రాయితీ కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఇదివరకే స్పష్టం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Embed widget