అన్వేషించండి

Bangladesh Crisis: బంగ్లాదేశ్‌లో హిందువులపై ఎందుకీ దాడులు? కోటి మంది బెంగాల్‌కి వలస వస్తున్నారా?

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులను టార్గెట్‌గా చేసుకుని తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి. ఆలయాలు ధ్వంసం చేస్తున్నారు. దాదాపు కోటి మంది శరణార్థులు బెంగాల్‌కి వస్తారని అంచనా.

Bangladesh Unrest: "మిమ్మల్ని మీరు మైనార్టీలుగా ఎందుకు అనుకుంటారు..? అయినా అసలు మైనార్టీ, మెజార్టీ అంటూ ఏమీ ఉండదు. కులం, మతం అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తాం". ఇవి ఒకప్పుడు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హిందువుల గురించి ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు. అన్ని మతాల వారికీ సమాన గౌరవం ఇస్తామని తేల్చిచెప్పారు. కానీ..ఇప్పుడు అక్కడి పరిస్థితులు మారిపోయాయి. బంగ్లాదేశ్‌లో ముస్లింల జనాభాయే ఎక్కువ. అధికారికంగా హిందువులను మైనార్టీలుగా ప్రకటించకపోయినా...ఇప్పటికీ అక్కడ వాళ్లు మైనార్టీలుగానే ఉండిపోయారు. ఇప్పుడు రాజకీయ సంక్షోభం ముదరడం వల్ల ఈ వివక్ష చాలా స్పష్టంగా కనబడుతోంది. హిందూ ఆలయాలు, ఇళ్లను ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తున్నారు. హిందువులపైనా అక్కడ దాడులు జరుగుతున్నాయి. 

కొంత మంది చెబుతున్న లెక్కలు, సోషల్ మీడియాలో పెడుతున్న పోస్ట్‌ల ప్రకారం 1951లో బంగ్లాదేశ్‌లో హిందువుల జనాభా 2.2 కోట్లు. ఇప్పుడది 1.3 కోట్లకు పడిపోయింది. కొంత మంది వాదన ఏంటంటే...ఇన్నేళ్లలో అక్కడ భారీ ఎత్తున మత మార్పిడులు జరిగాయని. ఇప్పటికీ అక్కడ ఇది కొనసాగుతోందని వాదిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా హిందూ వర్గాన్నే టార్గెట్‌గా చేసుకుని దాడులు చేసేస్తున్నారు. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇస్కాన్ మందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. అలా అని అన్ని చోట్లా ఇదే జరుగుతోందనడానికీ వీల్లేదు. ఓ హిందూ ఆలయంపై దాడి జరగకుండా ముస్లింలే అడ్డుకున్నారన్న వీడియోలూ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అసలు ఎందుకీ స్థాయిలో దాడులు చేస్తున్నారన్నదే ఇప్పుడు కలవర పెడుతున్న విషయం. 

మోదీ పర్యటనతో మొదలు..

బంగ్లాదేశ్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం (All Eyes on Bangladesh Hindus) ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు. 2021లో ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌లో పర్యటించారు. ఆ సమయంలో చాలా మంది బంగ్లా పౌరులు ఈ పర్యటనను తీవ్రంగా నిరసించారు. పలు చోట్ల హిందూ ఆలయాలపై దాడులు చేశారు. అప్పటి నుంచి చినికి చినికి గాలి వానగా మారిందీ విధ్వంసం. Hindu American Foundation వెల్లడించిన వివరాల ప్రకారం దాదాపు కోటి మందికి పైగా హిందువులు బంగ్లాదేశ్ (Hindu Population in Bangladesh) నుంచి వలస వెళ్లిపోయారు. 1964-2013 మధ్య కాలంలో వీళ్లంతా తీవ్ర వివక్షకు గురయ్యారు. అందుకే బంగ్లాని వీడారు. అయితే...హసీనా దేశం విడిచి పారిపోయాక మొత్తం బంగ్లాదేశ్‌ని తమ అధీనంలోకి తీసుకోడానికి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో పాటు జమాతే ఇస్లామీ పార్టీ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. హిందువులే లక్ష్యంగా దాడులకు పాల్పడేలా ప్రజల్ని రెచ్చగొడుతున్నాయి.

ఇక్కడ మరో కీలకమైన విషయం ఏంటంటే...బంగ్లాదేశ్‌ పౌరులు ఎప్పుడు వచ్చి సాయం కోరినా ఆశ్రయం కల్పిస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించారు. అయితే...దీనిపై పొలిటికల్‌గా ప్రకంపనలు మొదలయ్యాయి. బీజేపీ నేత సువేందు అదికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు కోటి మంది హిందువులు బెంగాల్‌కి వస్తున్నారని,  వాళ్లందరికీ ఆశ్రయమిచ్చేందుకు సిద్ధంగా ఉండాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే తరవాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది. 

Also Read: Bangladesh News: బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు- మహమ్మద్ యూనస్‌ నేతృత్వంలో పాలన

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Embed widget