అన్వేషించండి

Russia Oil : రష్యా ఆయిల్ కొనుగోలుకు అమెరికాతో పని లేదు - ఫిబ్రవరిలోనూ భారీగా దిగుమతి - తప్పుడు ప్రచారంపై ఇవిగో నిజాలు

India Oil: యుద్ధం కారణంగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసేందుకు భారత్ కు అమెరికా అనుమతి ఇచ్చిందన్న ఓ ప్రచారం జరుగుతోంది. కానీ భారత్ కు ఎవరి వద్దా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తోంది.

India Does Not Need Permission to Buy Oil:  భారతదేశ రాజకీయ , మీడియా వర్గాల్లో ప్రస్తుతం ఒక వింత చర్చ సాగుతోంది. ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా, రష్యా నుండి చమురు కొనుగోళ్లను కొనసాగించడానికి అమెరికా  అనుమతి ఇచ్చిందని.. ప్రచారం జరుగుతోంది.  టారిఫ్ ఒత్తిడిని తగ్గించిందని, ఒక తాత్కాలిక అవకాశాన్ని భారత్‌కు ఇచ్చిందని వార్తలు వచ్చాయి. దీనిపై ప్రతిపక్ష నేతలు స్పందిస్తూ.. రష్యా నుండి ముడి చమురు కొనడానికి భారత్‌కు వాషింగ్టన్ అనుమతి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ అంశంపై జరుగుతున్న ప్రచారం, విపక్ష నేతల విమర్శలు, సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం అంతా  విషయాన్ని పూర్తిగా తప్పుదారి పట్టించేదిగా ఉండటమే కాకుండా, భారతదేశ ఇంధన దౌత్యం ,  ఆర్థిక విధానంపై ఉన్న వారి అజ్ఞానాన్ని సూచిస్తోంది.

ఫిబ్రవరిలో కూడా అత్యధిక చమురు రష్యా నుంచే ! 

2026 ఫిబ్రవరిలో కూడా రష్యానే భారత్‌కు అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా నిలిచింది. భారతీయ రిఫైనరీలు రోజుకు సుమారు 10 లక్షల నుండి 17 లక్షల బ్యారెళ్ల రష్యన్ చమురును దిగుమతి చేసుకున్నాయి. అంటే భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో ఇది దాదాపు 25 నుండి 30 శాతం. నెలవారీ లెక్కల్లో చూస్తే సుమారు 2.8 కోట్ల నుండి 4.8 కోట్ల బ్యారెళ్ల రష్యన్ చమురు భారత్‌కు వచ్చింది. సరళంగా చెప్పాలంటే, భారత్ ప్రతిరోజూ దాదాపు 10 లక్షల బ్యారెళ్ల రష్యన్ చమురును కొనుగోలు చేస్తోంది. ఈ గణాంకాలను గమనిస్తే, భారత్ ఇంధన ఎంపికలు విదేశీ శక్తుల కనుసన్నల్లో జరుగుతాయనే వాదన పసలేదని అర్థమవుతుంది.

అమెరికా అనుమతి అవసరం అయితే ఇంత భారీగా ఎలా దిగుమతి చేసుకుంటారు? 

నిజంగా రష్యా నుండి చమురు కొనడానికి అమెరికా అనుమతి అవసరమైతే, ఇంత భారీ స్థాయిలో దిగుమతులు జరగవు. 140 కోట్ల మంది ప్రజల ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకుని భారత్ తన సొంత విధానాలను అనుసరిస్తోంది. భారత్ తన ముడి చమురు అవసరాల్లో 85 శాతం కంటే ఎక్కువ దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ధర, సరఫరా స్థిరత్వం, భౌగోళిక రాజకీయ ముప్పులు , దేశీయ ద్రవ్యోల్బణాన్ని ప్రభుత్వం నిరంతరం సమతుల్యం చేయాల్సి ఉంటుంది. రాయితీ ధరకు కొనుగోలు చేసే ప్రతి బ్యారెల్ చమురు.. రవాణా, తయారీ, విద్యుత్ ఖర్చులను తగ్గిస్తూ సామాన్య ప్రజల ఇంటి బడ్జెట్‌పై సానుకూల ప్రభావం చూపుతుంది.

చర్చలు జరిపితే అనుమతి అని అర్థం చేసుకుంటారా? 

అందుకే 2022లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత భారత్ తన ఇంధన వనరులను విస్తృతం చేసుకుంది. రష్యా చమురు తక్కువ ధరకే లభిస్తుండటంతో భారతీయ రిఫైనరీలు ఆచరణాత్మకంగా వ్యవహరించాయి. అంతర్జాతీయ ధరల పెరుగుదల నుండి వినియోగదారులను రక్షించడానికి ప్రభుత్వం కూడా ఈ వ్యూహానికి మద్దతు ఇచ్చింది. అమెరికా, రష్యా, గల్ఫ్ దేశాలతో భారత్ చర్చలు జరుపుతున్న మాట వాస్తవమే. పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య చర్చలు, టారిఫ్‌లు , రాజకీయ సందేశాలు సహజం. అంతమాత్రాన ఆ చర్చలను అనుమతి అని అర్థం చేసుకోవడం పొరపాటు. 

భారత్‌కు ఇతర దేశాల అనుమతి అవసరం లేదు ! 

భారత్ మొదటి నుండి తన వైఖరిని స్పష్టం చేస్తూనే ఉంది. తమ చమురు కొనుగోళ్లు మార్కెట్ పరిస్థితులు , జాతీయ ప్రయోజనాల ఆధారంగానే ఉంటాయని కేంద్రం పదే పదే చెబుతోంది. రష్యా చమురు కొనుగోళ్లపై వాషింగ్టన్ ఆంక్షలు ప్రకటించినా భారత్ తన దిగుమతులను ఆపలేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, ఖతార్ వంటి దేశాలు గ్యాస్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసినా బాధ్యతాయుతమైన ప్రభుత్వం తన వనరులను పెంచుకోవాలే తప్ప తగ్గించుకోదు. రష్యా అటువంటి ఒక ముఖ్యమైన వనరు. భారత్ చమురు విధానం కేవలం ఆర్థిక అవసరాలు మరియు సార్వభౌమత్వంతో ముడిపడి ఉంది. విదేశీ అనుమతులపై భారత్ ఆధారపడుతుందనే వారు ఒక ప్రాథమిక సత్యాన్ని విస్మరిస్తున్నారు. భారత్ వంటి పెద్ద దేశాలు తమ ఇంధన నిర్ణయాలను ఇతర దేశాలకు వదిలిపెట్టవు. చర్చలు జరుపుతూ, వనరులను విస్తరిస్తూ తమ పౌరులకు మేలు చేసే ఒప్పందాలనే ఖరారు చేస్తాయి. ఇప్పుడు భారత్ చేస్తున్నది కూడా అదే.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Kuldeep Yadav Wedding: ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
First Foreign Trip: తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
Hyderabad Crime News: భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం! హైదరాబాద్‌లో ఘటన
భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం!
Advertisement

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Embed widget