అన్వేషించండి

Iran War Effect: ఇరాన్‌ యుద్ధంతో ఆటోమొబైల్ రంగానికి ముంచుకొస్తున్న ముప్పు! భారత్‌లో 50శాతానికిపైగా పెరగనున్న విడిభాగాల ధరలు!

Iran War Effect: మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధం భారత్‌లోని సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతోంది. అంతర్జాతీయ సరఫరా చైన్ దెబ్బతినడంతో వాహనాల విడి భాగాలు 25 శాతం నుంచి 50 వరకు పెరగబోతున్నాయి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హోర్మూజ్ జలసంధిలో యుద్ధ భయాలు, షిప్పింగ్ కార్యకలాపాలు స్తంభించాయి.
  • రవాణా ఖర్చులు పెరిగి, సరుకుల చేరడానికి ఆలస్యం అవుతోంది.
  • ముడి చమురు ధరల పెరుగుదలతో విడిభాగాల తయారీ ఖర్చు పెరిగింది.
  • వినియోగదారులపై ధరల భారం, పలు వస్తువుల ధరలు పెరగనున్నాయి.

Iran War Effect: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు కేవలం భౌగోళిక రాజకీయాలకే పరిమితం కాలేదు.అవి గ్లోబల్ సప్లై చైన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో 20 శాతం, భారతదేశ ముడి చమురు దిగుమతుల్లో 50 శాతం వాటా కలిగిన హోర్మూజ్ జలసంధి ప్రస్తుతం ఒ ప్రమాదకరమైన మలుపులో ఉంది. జల సంధి అధికారికంగా మూసివేయకపోయినా అక్కడ పెరిగిన ఇన్సూరెన్స్ రేట్లు, దాడులకు భయంతో షిప్పింగ్ కార్యాకలాపాలు స్తంభించిపోయాయి. 

దాదాపు 4500 భారతీయ ఎగుమతిదారులు, 1800 మంది దిగుమతిదారులు ఈ మార్గంపై ఆధారపడి ఉన్నారు. షిప్పింగ్ కంపెనీలు ఇప్పుడు వార్ రిస్క్ సర్ఛార్జ్‌, ఎమర్జెన్సీ ఫ్యూయల్‌ సర్ఛార్జ్ వంటి కొత్త పన్నులను విధిస్తున్నాయి. దీని వల్ల కంటైనర్‌ రవాణా ఖర్చు ఏకంగా రెండు వేల నుంచి మూడు వేల డాలర్ల వరకు పెరిగింది షిప్పింగ్ ఆలస్యం వల్ల వస్తువులు చేరడానికి పట్టే సమయంలో మరో పది నుంచి ఇరవై రోజులు పెరుగుతోంది.  

విడిభాగాల కొరత ప్రారంభం 

ఆసియాలోనే అతి పెద్ద ఆటోమొబైల్‌ విడిభాగాల మార్కెట్‌ అయిన ఢిల్లీలోని కశ్మీర్‌ గేట్‌లోని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ముడి చమురు ధరలు పెరగడం వల్ల ప్లాస్టిక్‌, రబ్బర్, ప్యాకేజింగ్ మెటీరియల్స్‌ ధరలు పెరిగాయి. మార్కెట్‌ నిపుణుల ప్రకారం విడిభాగాల తయారీ ఖర్చు 25 శాతం నుంచి 50 శాతం వరకు పెరిగింది. 

మరోవైపు ఇంధన ధరల పెరుగుదల వల్ల ఫ్యాక్టరీల్లో కార్మికులు స్వగ్రామాలకు తరలిపోతుండటంతో ఉత్పత్తి కుంటుపడింది. రబ్బర్ విడిభాగాల తయారీ ఖర్చు పది నుంచి 16 రూపాయలకి పెరగగా, ముడి చమురు ధరల పెరుగుదల వల్ల ప్లాస్టిక్‌ వస్తువుల ధరలు రెట్టింపు అవుతున్నాయి. దీనికి తోడు హుర్మూజ్ జలసంధి వద్ద సుమారు 2,300 పెట్రోలియం కంటైనర్లు నిలిచిపోవడం వల్ల సప్లై పూర్తిగా దెబ్బతింది. 

ధరల మోత వినియోగదారులపై ప్రభావం 

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి తయారీదారులు ధరలను పెంచడం అనివార్యమని ప్రకటించారు. ముడిసరుకుల ధరలు పెరగడం వల్ల కార్లు, టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ధరలు ఐదు శాతం నుంచి ఆరు శాతం వరకు పెరగనున్నాయి. మెర్సిడెస్‌ బెంజ్‌, ఆడి వంటి సంస్థలు ఇప్పటికే రెండు శాతం ధరల పెంపును ప్రకటించాయి. షూస్‌, ప్లాస్టిక్ ఆధారిత దుస్తుల ధరల 8 శాతం నుంచి 12 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.

వార్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్న కంపెనీలు 

వాహన తయారీ సంస్థలు పాండమిక్‌ సమయంలో చేసినట్టుగానే క్రైసిస్ మేనేజ్‌మెంట్‌ టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. అల్యూమినియం, కాపర్, ఎలక్ట్రానిక్ విడిభాగాల కోసం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే మార్గాలను అన్వేషిస్తున్నాయి. అయినప్పటికీ భారత్ విడిభాగాలు దిగుమతుల్లో చైనా వాటా 30 శాతంగా ఉంది. జర్మనీ, దక్షిణ కొరియా నుంచి కూడా దిగుమతులు పెరుగుతున్నప్పటికీ, ప్రస్తుతం పరిస్థితుల్లో ధరల నియంత్రణ అనేది తయారీదార్లకు ఒక సవాల్‌గా మారింది.  

నేటి పరిస్థితులు చూస్తుంటే 1970 నాటి అంతర్జాతీయ సంక్షోభాన్ని గుర్తు తెస్తుందని నిపుణులు చెబుతున్నారు. కేవలం చమురు మాత్రమే కాదు, టైల్స్, పేపర్, పెట్రోకెమికల్ ఉత్పత్తులపై ఆధారపడిన పరిశ్రమలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. 

Frequently Asked Questions

పశ్చిమాసియాలో యుద్ధం వల్ల గ్లోబల్ సప్లై చైన్‌పై ఎలాంటి ప్రభావం పడుతోంది?

పశ్చిమాసియాలో యుద్ధం వల్ల గ్లోబల్ సప్లై చైన్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా హోర్మూజ్ జలసంధిలో షిప్పింగ్ కార్యకలాపాలు స్తంభించిపోయాయి.

హోర్మూజ్ జలసంధిలో సమస్యల వల్ల భారతీయ ఎగుమతిదారులు, దిగుమతిదారులపై ఎలాంటి ప్రభావం పడుతోంది?

హోర్మూజ్ జలసంధిలో సమస్యల వల్ల దాదాపు 4500 భారతీయ ఎగుమతిదారులు, 1800 మంది దిగుమతిదారులు ప్రభావితం అవుతున్నారు. షిప్పింగ్ ఖర్చులు, రవాణా సమయం పెరిగాయి.

ఆటోమొబైల్ విడిభాగాల మార్కెట్‌లో ప్రస్తుత పరిస్థితి ఏమిటి?

ముడి చమురు ధరలు పెరగడం వల్ల ప్లాస్టిక్, రబ్బర్, ప్యాకేజింగ్ మెటీరియల్స్ ధరలు పెరిగాయి. విడిభాగాల తయారీ ఖర్చు 25-50% వరకు పెరిగింది, ఉత్పత్తి కుంటుపడింది.

వినియోగదారులపై ధరల పెరుగుదల ప్రభావం ఎలా ఉండబోతోంది?

ముడిసరుకుల ధరల పెరుగుదల వల్ల కార్లు, టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ధరలు 5-6% వరకు పెరగనున్నాయి. షూస్, ప్లాస్టిక్ దుస్తుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.

వాహన తయారీ సంస్థలు ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి?

వాహన తయారీ సంస్థలు క్రైసిస్ మేనేజ్‌మెంట్‌ టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. అల్యూమినియం, కాపర్, ఎలక్ట్రానిక్ విడిభాగాల కోసం ఇతర దేశాల నుంచి దిగుమతి మార్గాలను అన్వేషిస్తున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyundai Car Price Hike June 2026:జూన్‌ నుంచి హ్యుందాయ్ కార్ల ధరల పెంపు! నాలుగోసారి ధరల పెంపునకు కారణాలేంటీ?
జూన్‌ నుంచి హ్యుందాయ్ కార్ల ధరల పెంపు! నాలుగోసారి ధరల పెంపునకు కారణాలేంటీ?
Honda Activa 125 vs TVS NTORQ 125:హోండా యాక్టివా 125 vs టీవీఎస్‌ ఎన్ టార్క్‌ 125 మధ్య తేడాలు ఏంటీ? మీకు ఏది సరైన వాహనమో తెలుసుకోండి?
హోండా యాక్టివా 125 vs టీవీఎస్‌ ఎన్ టార్క్‌ 125 మధ్య తేడాలు ఏంటీ? మీకు ఏది సరైన వాహనమో తెలుసుకోండి?
Hero Vida VX2 Go Price:ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు! 50 వేలకే వస్తున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ హీరో విడా!
ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు! 50 వేలకే వస్తున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ హీరో విడా!
Battery as a Service India: ఈవీ మార్కెట్‌లో కొత్త
ఈవీ మార్కెట్‌లో కొత్త "బాస్‌"! సగం ధరకే విద్యుత్‌ కార్లు! నిజంగానే ఇది సామాన్యుడికి వరమేనా?
Advertisement

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RR Enters Into Qualifier 2: స‌న్ రైజ‌ర్స్ ఇంటికి.. రాయ‌ల్స్ చేతిలో ఘోర ప‌రాభవం.. రాజస్థాన్ ను గెలిపించిన వైభ‌వ్, ఆర్చ‌ర్
స‌న్ రైజ‌ర్స్ ఇంటికి.. రాయ‌ల్స్ చేతిలో ఘోర ప‌రాభవం.. రాజస్థాన్ ను గెలిపించిన వైభ‌వ్, ఆర్చ‌ర్
Gandhi Bhavan Fight: గాంధీ భవన్‌లో గలాటా - గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు - మంత్రుల ఎదుటే !
గాంధీ భవన్‌లో గలాటా - గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు - మంత్రుల ఎదుటే ! వీడియో
Madhura Sreedhar Reddy: సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
Remote Robotic Surgery : హైదరాబాద్‌లో రోగికి చైనా నుంచి ఆపరేషన్.. రోబోటిక్ టెలిసర్జరీతో చరిత్ర సృష్టించిన వైద్యులు
హైదరాబాద్‌లో రోగికి చైనా నుంచి ఆపరేషన్.. రోబోటిక్ టెలిసర్జరీతో చరిత్ర సృష్టించిన వైద్యులు
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
Pune Porsche Crash Case: పుణె పోర్షే ప్రమాదం కేసులో నిందితులకు బెయిల్ - సంబరాల వీడియోల వైరల్ - బాధితులకు వ్యవస్థలపై నమ్మకం ఎలా?
పుణె పోర్షే ప్రమాదం కేసులో నిందితులకు బెయిల్ - సంబరాల వీడియోల వైరల్ - బాధితులకు వ్యవస్థలపై నమ్మకం ఎలా?
Battery as a Service India: ఈవీ మార్కెట్‌లో కొత్త
ఈవీ మార్కెట్‌లో కొత్త "బాస్‌"! సగం ధరకే విద్యుత్‌ కార్లు! నిజంగానే ఇది సామాన్యుడికి వరమేనా?
Embed widget