IND vs NZ T20 WC Final: కివీస్ అనే శాపాన్ని టీమిండియా ఛేదిస్తుందా? బ్లాక్ క్యాప్స్ పై ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్
IND vs NZ T20 World Cup 2026 Final: టీ20ల్లో ఐసీసీ మేజర్ ఈవెంట్లో భారత్ విజయం సాధించడం సాధ్యపడని జట్టు న్యూజిలాండ్ తో ఫైనల్లో సూర్యకుమార్ సేన తలపడనుంది.

IND vs NZ T20 World Cup 2026 Final | గత రెండు దశాబ్దాలుగా భారత క్రికెట్ జట్టు ప్రత్యర్థి ఎవరైనా సరే మట్టికరిపిస్తూ ప్రపంచంలోని ప్రతి మూలన విజయకేతనం ఎగురవేసింది. అయితే, ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో భారత్ను కలవరపెట్టే ఓ జట్టు ఉంది. అదే బ్లాక్ క్యాప్స్ (న్యూజిలాండ్ టీం). 2026 ఫైనల్లో న్యూజిలాండ్ను ఎదుర్కోవడానికి సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత్ సిద్ధమవుతుండగా, చరిత్రలో ఆ జట్టుపై ఉన్న 0-3 ఓటమి భారత్ను వెంటాడుతోంది. గత రెండు మ్యాచ్ల్లో భారత బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ.. ఫైనల్ సమయం దగ్గరపడుతుండటంతో ఈ కివీ శాపం (Kiwi Curse) మళ్లీ తమ ప్రపంచకప్ ఆశలను చిదిమేస్తుందేమోనని టీమిండియా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
"కివీ శాపం" అని ఎందుకంటారు..
అభిమానులు పిలుచుకునే ఈ కివీ శాపం అంటే టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లో న్యూజిలాండ్ను భారత్ ఓడించలేదు. ద్వైపాక్షిక సిరీస్లలో భారత్ ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, ఐసీసీ వేదికపై మాత్రం కివీస్ భారత్కు అజేయమైన అడ్డంకిగా నిలుస్తోంది. అత్యంత కీలకమైన మ్యాచ్ల్లో భారత బ్యాటింగ్ ఆర్డర్ను దెబ్బతీసి విజయాలు సాధిస్తున్నారు.
టీ20 ప్రపంచకప్లో భారత్ vs న్యూజిలాండ్ రికార్డు
మొత్తం టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో భారత్ పైచేయి సాధించినప్పటికీ, ప్రపంచ కప్లో మాత్రం పూర్తిగా ఏకపక్షంగా ఉంది. టీ20 ప్రపంచకప్లలో న్యూజిలాండ్ 3 సార్లు భారత్ను ఓడించింది, అయితే భారత్ ఇప్పటివరకు కివీస్పై ఒక్క విజయం కూడా సాధించలేదు.
టీ20 వరల్డ్ కప్లో ముఖాముఖి రికార్డు: భారత్ - 0, న్యూజిలాండ్ - 3.
2 హార్ట్ బ్రేకింగ్ ఓటముల కథ
భారత జట్టు బలహీనతలను న్యూజిలాండ్ ఎప్పుడో పసిగట్టింది. ఎదురుపడిన ప్రతిసారి టీమిండియాను ఓడించారు.
-
2007 (జోహన్నెస్బర్గ్): భారత్ తొలిసారి టైటిల్ గెలిచిన అద్భుత ప్రయాణంలోనూ జట్టును ఓడించిన ఏకైక జట్టు న్యూజిలాండ్. 191 పరుగుల ఛేజింగ్ లో భారత్ 76/0తో దూసుకుపోతుండగా ఒక్కసారిగా డేనియల్ వెట్టోరి రంగంలోకి దిగి 4 వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించాడు. భారత్ 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
-
2016 (నాగ్పూర్): స్పిన్ ట్రాప్: భారత్లో జరిగిన ఈ మ్యాచ్లో ఆతిథ్య జట్టు ఆధిపత్యం చెలాయిస్తుందని అంతా భావించారు. కానీ మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి భారత స్పిన్ మాస్టర్లనే తిప్పికొట్టారు. భారత్ కేవలం 79 పరుగులకే కుప్పకూలింది. ఇది టోర్నీ చరిత్రలో భారత జట్టుకు అత్యల్ప స్కోరు. ఈ మ్యాచ్లో భారత్ 47 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
-
2021 (దుబాయ్): ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ట్రెంట్ బౌల్ట్ స్వింగ్కు భారత టాపార్డర్ కూలిపోయింది. భారత్ చేసిన 110/7 స్కోరును కివీస్ మరో 33 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి, భారత్ను ప్రపంచ కప్ నుండి నిష్క్రమించేలా చేసింది.
అహ్మదాబాద్ 2026
నరేంద్ర మోదీ స్టేడియం ఇప్పుడు ఈ సుదీర్ఘ పోరాటానికి ఒక ముగింపు పలకనుంది. భారత్ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్నప్పటికీ, కివీస్ అనే ప్రత్యర్థిపై విజయం సాధించలేకపోయింది.
బ్యాటింగ్ లో సంజూ శాంసన్, సూర్యకుమార్, తిలక్, పాండ్యా, ఇషాన్ కిషన్, దుబేలతో పటిష్టంగా ఉండగా.. బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, బుమ్రా మెరుపులు అన్నట్లుండే నైపుణ్యం కివీస్ యొక్క ఖచ్చితత్వాన్ని అధిగమిస్తాయా?. మార్చి 8న, ఆ 0-3 రికార్డు ఒక మానసిక స్మశానవాటికగా మిగిలిపోతుందా లేదా భారత్ యొక్క గొప్ప ప్రతీకారానికి ఇంధనంగా మారుతుందా అనేది తేలిపోనుంది.
ట్రెండింగ్ వార్తలు




















