అన్వేషించండి

Anantapur News: అనంతపురం బీజేపీలో ఆదినారాయణ కలకలం - కబ్జాలు, దందాలతో హల్ చల్ - చర్యలు తీసుకోవాలని ఇతర పార్టీల డిమాండ్

Anantapur BJP leader: అనంతపురం రాజకీయాల్లో బీజేపీ నేత ఆదినారాయణ అరాచకాలు సంచలనంగా మారాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు అన్ని రాజకీయ పార్టీల నుంచి వస్తున్నాయి.

BJP leader Adinarayana: ఉమ్మడి అనంతపురం జిల్లాలో  ముదిగుబ్బ ఎంపీపీగా ఉన్న ఆదినారాయణ యాదవ్ అనే బీజేపీ నేత కూటమిలో కలకలం రేపుతున్నారు. ఆయన కబ్జాలు, దాడులు, దందాలతో చెడ్డపేరు వస్తోందని అంటున్నారు. ఆదినారాయణపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. 

గిరిజనుల భూముల్ని కబ్జా చేసిన ఆదినారాయణ 

ముదిగుబ్బ మండలంలో అడవి బ్రాహ్మణపల్లె గ్రామంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల్ని ఆదినారాయణ యాదవ్ కబ్జా చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆన్ లైన్ లో ఆయన పేరు మీదుగా భూములు మారిపోయాయి. దీంతో గిరిజనులు ఆందోళన చేస్తున్నారు. ఆదినారాయణపై చర్యలు తీసుకుని గిరిజనులకు న్యాయం చేయాలని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ  ముదిగుబ్బ మండలంలో జరిగిన గిరిజన భూముల అక్రమాలపై తీవ్రంగా స్పందించారు. ఆదినారాయణ తప్పుడు పత్రాలు సృష్టించి, రెవెన్యూ రికార్డుల్లో తమ కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసి, సుమారు 100 ఎకరాల గిరిజన భూములను స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. ఈ రోజు సిపిఐ నేతలు నేరుగా ఆ గ్రామాల్లోని బాధిత రైతు కుటుంబాలను పరామర్శించి, ఆక్రమించబడిన భూములను పరిశీలించారు.  ఇలాంటి రౌడీలు, కబ్జాలు చేసే నాయకులను రాజకీయాలకు దూరంగా ఉంచాలని, తన అనుచరుడు ఆదినారాయణ నుంచి దళిత, గిరిజన భూములను తిరిగి వారికి అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని  ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. 

ఆదినారాయణపై అనేక ఆరోపణలు 

ఆదినారాయణపై చాలా కేసులు ఉన్నాయి.   కొద్ది రోజుల కిందట అదానీ కంపెనీ అన్నమయ్య జిల్లాలో చేపట్టిన ఓ ప్రాజెక్టు వద్ద కమిషన్లు ఇవ్వలేదని కొంత మంది వ్యక్తులు దాడి చేశారు. అదానీ సంస్థల పైనే దాడులు చేసింది ఆదినారాయణలేనని చెబుతున్నారు.   2022లో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను సూరప నేని రమేశ్ చౌదరి ని కిడ్నాప్ చేసి, డబ్బులు వసూలు చేసిన కేసులో నిందితుడుగా ఉన్నారు. నకిలీ తుపాకులతో ప్రైవేటు సైన్యాన్ని తీసుకెళ్లి బెదిరించి స్థలాలు కబ్జాలు చేసిన కేసులు కూడా ఉన్నాయి. ఇటీవల   పెనుకొండలో నమోదైన కబ్జా కేసులో నిందితుడుగాఉన్నారు.  

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి !

ముదిగుబ్బ మండలానికి ఎంపీపీగా ఉన్న ఆయన ఆ పదవి మండల స్థాయిదే అయినా దాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్న దందాలు అన్నీ ఇన్నీ కావు. ఆదినారాయణ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేత. మొదటగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉండేది. టీడీపీ అధికారంలోకి వచ్చాక మంత్రిగా ఉన్న పల్లె రఘునాథ రెడ్డి దగ్గర చేరారు. ఆయన మందీ మార్భలం చూసి  పార్టీలో చేర్చుకుని ప్రోత్సహం ఇచ్చారు. టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో అధికారంలోకి వచ్చిన వైసీపీలో చేరారు. అక్కడ ఆయన చేసిన దందాలకు లెక్కలేదు. ఎన్నికలు దగ్గర పడిన తర్వాత కూటమి గెలుపు ఖాయమని అంచనాకు వచ్చి బీజేపీలో చేరిపోయారు. ఆయన గురించి తెలుసోఇ తెలియదో కానీ బీజేపీ పెద్దలు చేర్చుకున్నారు.  ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇక ఆదినారాయణ దందాలకు అడ్డం లేకుండా పోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మంత్రి సత్యకుమార్ స్పందించాలని సీపీఐ రామకృష్ణ డిమాండ్ 

భూములను పరిశీలించి బాధితులతో మాట్లాడిన సీపీఐ నేత రామకృష్ణ ఏపీ  ప్రభుత్వంలో ఏకైక మంత్రిగా సత్యకుమార్ ఉన్నారు..ఆయన స్పందించాలని డిమాండ్ చేశారు.  మంత్రిగా ఉండి బీజేపీ వాళ్లు బడుగు,బలహీన వర్గాలు..భూముులు కబ్జా చేసి మోసం, దగా చేస్తూ ఉంటే ఈ పాటికి స్పందించాల్సి ఉంది. ఇంత వరకూ ఆ మంత్రిగారు స్పందించలేదు. స్థానిక మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కూడా అయిన సత్యకుమార్ యాదవ్ కూడా దీనిపై స్పందించాలన్నారు. . పేదలు, దళితులు, గిరిజనులకు అండగా నిలబడాలి. సత్యసాయి జిల్లా ఇంచార్జ్ మంత్రి.. అనగాని సత్యప్రసాద్.. ఆయన రెవిన్యూ మంత్రి కూడా .. ఆయన బాధ్యతలు తీసుకున్న దగ్గరే ఇలాంటివి జరిగాయంటే యుద్ధ ప్రతిపదికపైనా స్పందించాల్సి ఉంది. యాక్షన్ తీసుకోవాలి. దీన్ని రాష్ట్ర స్థాయి ఉద్యమంగా తీసుకుపోతామని హెచ్చరించారు.  

 బీజేపీపెద్దలు తెలుసని బ్లాక్ మెయింగ్ చేసి దందాలుచేస్తారని ఆరోపణలు

రాష్ట్ర బీజేపీ ముఖ్యులంతా తనకు తెలుసని చెప్పి చెలరేగిపోవడం ప్రారంభించారు. ఆది నారాయణపై ఇటీవలి కాలంలో వరుసగా కేసులు నమోదవుతున్నాయి.   తాను బీజేపీ మంత్రికి అనుచరుడినని. తాను ఏం చేసినా.. పోలీసులు, అధికారులు తన జోలికి  రారని బెదిరిస్తున్నట్లుగా ఓఆరోపణలు ఉన్నాయి.  అధికారంలో ఉన్న పార్టీలో చేరి.. ఆ పార్టీ పేరును ఉపయోగించుకుని నేరాలకు పాల్పడే ఇలాంటి వారిని ఏ మాత్రం సహించినా అది మొత్తం పార్టీనే దెబ్బతీస్తుందని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదినారాయణను పార్టీ నుంచి సాగనంపాలని అగ్రనేతలు ఎవరూ ప్రోత్సహించకూడదని అంటున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

INDIA Bloc June 8 Meeting Delhi: ఇండీ కూటమికి గడ్డు పరిస్థితి - స్టాలిన్ గుడ్ బై - మమతా పరిస్థితి అంతంతే - విజయ్ కాపాడతాడా?
ఇండీ కూటమికి గడ్డు పరిస్థితి - స్టాలిన్ గుడ్ బై - మమతా పరిస్థితి అంతంతే - విజయ్ కాపాడతాడా?
Tamil Nadu Politics 2026 Post Election: విజయ్..అన్నామలై..ధనుష్.. తమిళ పాలిటిక్స్‌లో కొత్త కెరటాలు - ద్రవిడ కోటలన్నీ కూలిపోతాయా?
విజయ్..అన్నామలై..ధనుష్.. తమిళ పాలిటిక్స్‌లో కొత్త కెరటాలు - ద్రవిడ కోటలన్నీ కూలిపోతాయా?
GHMC Elections Old City Hyderabad: గ్రేటర్ సమరంలో మారుతున్న సమీకరణాలు - ఎంఐఎం కోటపై కాంగ్రెస్, ఎంబీటీ కలసి దాడి చేయబోతున్నాయా?
గ్రేటర్ సమరంలో మారుతున్న సమీకరణాలు - ఎంఐఎం కోటపై కాంగ్రెస్, ఎంబీటీ కలసి దాడి చేయబోతున్నాయా?
AP Mega DSC 2025 Controversy: మెగా డీఎస్సీపై ఏపీలో రాజకీయ యుద్ధం - వైసీపీ ఆరోపణలు, ప్రభుత్వం వివరణలు - ఎవరిది పైచేయి?
మెగా డీఎస్సీపై ఏపీలో రాజకీయ యుద్ధం - వైసీపీ ఆరోపణలు, ప్రభుత్వం వివరణలు - ఎవరిది పైచేయి?

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Ram Charan OTT Movies : పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
Embed widget