అన్వేషించండి

Anantapur News: అనంతపురం బీజేపీలో ఆదినారాయణ కలకలం - కబ్జాలు, దందాలతో హల్ చల్ - చర్యలు తీసుకోవాలని ఇతర పార్టీల డిమాండ్

Anantapur BJP leader: అనంతపురం రాజకీయాల్లో బీజేపీ నేత ఆదినారాయణ అరాచకాలు సంచలనంగా మారాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు అన్ని రాజకీయ పార్టీల నుంచి వస్తున్నాయి.

BJP leader Adinarayana: ఉమ్మడి అనంతపురం జిల్లాలో  ముదిగుబ్బ ఎంపీపీగా ఉన్న ఆదినారాయణ యాదవ్ అనే బీజేపీ నేత కూటమిలో కలకలం రేపుతున్నారు. ఆయన కబ్జాలు, దాడులు, దందాలతో చెడ్డపేరు వస్తోందని అంటున్నారు. ఆదినారాయణపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. 

గిరిజనుల భూముల్ని కబ్జా చేసిన ఆదినారాయణ 

ముదిగుబ్బ మండలంలో అడవి బ్రాహ్మణపల్లె గ్రామంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల్ని ఆదినారాయణ యాదవ్ కబ్జా చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆన్ లైన్ లో ఆయన పేరు మీదుగా భూములు మారిపోయాయి. దీంతో గిరిజనులు ఆందోళన చేస్తున్నారు. ఆదినారాయణపై చర్యలు తీసుకుని గిరిజనులకు న్యాయం చేయాలని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ  ముదిగుబ్బ మండలంలో జరిగిన గిరిజన భూముల అక్రమాలపై తీవ్రంగా స్పందించారు. ఆదినారాయణ తప్పుడు పత్రాలు సృష్టించి, రెవెన్యూ రికార్డుల్లో తమ కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసి, సుమారు 100 ఎకరాల గిరిజన భూములను స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. ఈ రోజు సిపిఐ నేతలు నేరుగా ఆ గ్రామాల్లోని బాధిత రైతు కుటుంబాలను పరామర్శించి, ఆక్రమించబడిన భూములను పరిశీలించారు.  ఇలాంటి రౌడీలు, కబ్జాలు చేసే నాయకులను రాజకీయాలకు దూరంగా ఉంచాలని, తన అనుచరుడు ఆదినారాయణ నుంచి దళిత, గిరిజన భూములను తిరిగి వారికి అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని  ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. 

ఆదినారాయణపై అనేక ఆరోపణలు 

ఆదినారాయణపై చాలా కేసులు ఉన్నాయి.   కొద్ది రోజుల కిందట అదానీ కంపెనీ అన్నమయ్య జిల్లాలో చేపట్టిన ఓ ప్రాజెక్టు వద్ద కమిషన్లు ఇవ్వలేదని కొంత మంది వ్యక్తులు దాడి చేశారు. అదానీ సంస్థల పైనే దాడులు చేసింది ఆదినారాయణలేనని చెబుతున్నారు.   2022లో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను సూరప నేని రమేశ్ చౌదరి ని కిడ్నాప్ చేసి, డబ్బులు వసూలు చేసిన కేసులో నిందితుడుగా ఉన్నారు. నకిలీ తుపాకులతో ప్రైవేటు సైన్యాన్ని తీసుకెళ్లి బెదిరించి స్థలాలు కబ్జాలు చేసిన కేసులు కూడా ఉన్నాయి. ఇటీవల   పెనుకొండలో నమోదైన కబ్జా కేసులో నిందితుడుగాఉన్నారు.  

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి !

ముదిగుబ్బ మండలానికి ఎంపీపీగా ఉన్న ఆయన ఆ పదవి మండల స్థాయిదే అయినా దాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్న దందాలు అన్నీ ఇన్నీ కావు. ఆదినారాయణ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేత. మొదటగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉండేది. టీడీపీ అధికారంలోకి వచ్చాక మంత్రిగా ఉన్న పల్లె రఘునాథ రెడ్డి దగ్గర చేరారు. ఆయన మందీ మార్భలం చూసి  పార్టీలో చేర్చుకుని ప్రోత్సహం ఇచ్చారు. టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో అధికారంలోకి వచ్చిన వైసీపీలో చేరారు. అక్కడ ఆయన చేసిన దందాలకు లెక్కలేదు. ఎన్నికలు దగ్గర పడిన తర్వాత కూటమి గెలుపు ఖాయమని అంచనాకు వచ్చి బీజేపీలో చేరిపోయారు. ఆయన గురించి తెలుసోఇ తెలియదో కానీ బీజేపీ పెద్దలు చేర్చుకున్నారు.  ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇక ఆదినారాయణ దందాలకు అడ్డం లేకుండా పోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మంత్రి సత్యకుమార్ స్పందించాలని సీపీఐ రామకృష్ణ డిమాండ్ 

భూములను పరిశీలించి బాధితులతో మాట్లాడిన సీపీఐ నేత రామకృష్ణ ఏపీ  ప్రభుత్వంలో ఏకైక మంత్రిగా సత్యకుమార్ ఉన్నారు..ఆయన స్పందించాలని డిమాండ్ చేశారు.  మంత్రిగా ఉండి బీజేపీ వాళ్లు బడుగు,బలహీన వర్గాలు..భూముులు కబ్జా చేసి మోసం, దగా చేస్తూ ఉంటే ఈ పాటికి స్పందించాల్సి ఉంది. ఇంత వరకూ ఆ మంత్రిగారు స్పందించలేదు. స్థానిక మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కూడా అయిన సత్యకుమార్ యాదవ్ కూడా దీనిపై స్పందించాలన్నారు. . పేదలు, దళితులు, గిరిజనులకు అండగా నిలబడాలి. సత్యసాయి జిల్లా ఇంచార్జ్ మంత్రి.. అనగాని సత్యప్రసాద్.. ఆయన రెవిన్యూ మంత్రి కూడా .. ఆయన బాధ్యతలు తీసుకున్న దగ్గరే ఇలాంటివి జరిగాయంటే యుద్ధ ప్రతిపదికపైనా స్పందించాల్సి ఉంది. యాక్షన్ తీసుకోవాలి. దీన్ని రాష్ట్ర స్థాయి ఉద్యమంగా తీసుకుపోతామని హెచ్చరించారు.  

 బీజేపీపెద్దలు తెలుసని బ్లాక్ మెయింగ్ చేసి దందాలుచేస్తారని ఆరోపణలు

రాష్ట్ర బీజేపీ ముఖ్యులంతా తనకు తెలుసని చెప్పి చెలరేగిపోవడం ప్రారంభించారు. ఆది నారాయణపై ఇటీవలి కాలంలో వరుసగా కేసులు నమోదవుతున్నాయి.   తాను బీజేపీ మంత్రికి అనుచరుడినని. తాను ఏం చేసినా.. పోలీసులు, అధికారులు తన జోలికి  రారని బెదిరిస్తున్నట్లుగా ఓఆరోపణలు ఉన్నాయి.  అధికారంలో ఉన్న పార్టీలో చేరి.. ఆ పార్టీ పేరును ఉపయోగించుకుని నేరాలకు పాల్పడే ఇలాంటి వారిని ఏ మాత్రం సహించినా అది మొత్తం పార్టీనే దెబ్బతీస్తుందని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదినారాయణను పార్టీ నుంచి సాగనంపాలని అగ్రనేతలు ఎవరూ ప్రోత్సహించకూడదని అంటున్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections: టీవీకే విజయ్‌కు బలమైన అభ్యర్థుల కొరత - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులకు సీట్లిస్తారా?
టీవీకే విజయ్‌కు బలమైన అభ్యర్థుల కొరత - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులకు సీట్లిస్తారా?
Janasena expansion in South: దక్షిణాదిన పార్టీ విస్తరణ దిశగా పవన్ మాస్టర్ ప్లాన్స్ - సినిమాలు చేస్తూ సాధ్యమేనా?
దక్షిణాదిన పార్టీ విస్తరణ దిశగా పవన్ మాస్టర్ ప్లాన్స్ - సినిమాలు చేస్తూ సాధ్యమేనా?
Lok Sabha Seats: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
Telangana Congress: గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?
గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?

వీడియోలు

RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam
5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
Stock Market on 24 March: యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
Falls Sick or Dies on a Plane : విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
Vijayawada Crime News: విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
Embed widget