అన్వేషించండి

వివక్ష జరుగుతోందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎప్పుడు గుర్తించారు? ఆత్మకథలో ఏం రాశారు?

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తన ఆత్మకథ 'వెయిటింగ్ ఫర్ ఏ వీసా'లో వివక్ష తర్వాత తనకు ఎదురైన అనుభవాలను వివరించారు.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు తెలియని వ్యక్తులు ఉండరేమో. అంతలా ప్రజల గుండెల్లో ఆయన శాశ్వతంగా ఉండిపోవడానికి రీజన్ ఏంటీ. అలా పోరాడేందుకు ఆయన్ని ప్రేరేపించిన సంఘటనలు ఏంటీ?

కుల ప్రాతిపదికన వివక్షను రెండు విధాలుగా వర్ణించవచ్చని అంబేడ్కర్ తన ఆత్మకథ 'వెయిటింగ్ ఫర్ ఎ వీసా'లో రాశారు. మొదటి నేరుగా సమాచారం చెప్పడం. రెండోది జరిగిన సంఘటనలు గురించి వివరిస్తూ చెప్పడం. రెండో పద్ధతిని ఎంచుకున్న అంబేడ్కర్‌ తన అనుభవాలను పంచుకున్నారు. 

నేను మహర్ కులానికి చెందినవాడిని కాబట్టి తరగతిలో విడిగా కూర్చోవాల్సి వస్తుందని నాకు తెలుసు. నీళ్లు తాగడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయని కూడా గ్రహించాను. ఇలా చాలా ఘటనలు మనసుపై తీవ్ర ప్రభావం చూపాయి.

కోరేగావ్ వెళ్తుండగా ఏం జరిగింది?
మొదటి ఘటన 1901 నాటిదని అంబేడ్కర్ చెప్పారు. తన తండ్రి సతారాలోని కోరేగావ్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్నారు. బొంబాయి ప్రభుత్వం (మహారాష్ట్ర ప్రభుత్వం) కరవు పీడిత రైతులకు పని ఇవ్వడానికి చెరువులు తవ్వుతోంది. తల్లి మరణానంతరం తన అన్న, అక్క ఇద్దరు కుమారులు (సోదరి కూడా చనిపోయింది) తన అన్న, అక్కతో కలిసి నివసిస్తున్నారు.

అంబేడ్కర్ తన అన్న, అక్క కుమారులతో కలిసి వేసవి సెలవుల్లో సతారాలోని తన తండ్రిని కలవడానికి బయలుదేరారు. ప్రజలంతా తమ ఇంటి నుంచి కొత్త దుస్తుల్లో రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి సతారాకు సమీపంలోని మసూర్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత తండ్రి కోసం ఎదురుచూడటం మొదలుపెట్టారు కానీ చాలాసేపటి తర్వాత కూడా ఎవరూ రాలేదు.

కాసేపటి తర్వాత స్టేషన్ మాస్టర్ వచ్చి మా టికెట్ చూసి ఎక్కడికి వెళ్లాలని అడిగారు. మా బట్టలు చూశాక మేము మహర్ కులానికి చెందినవాళ్లమని మాస్టారు గ్రహించారు. ఈ విషయం తెలియగానే అతని ముఖ కవళికలు మారిపోయాయి. దీనికితోడు స్టేషన్‌లో పార్క్ చేసిన ఎడ్ల బండి వాళ్లు కూడా మమ్మల్ని ఎక్కించుకోలేదు. ఎక్కువ డబ్బులు ఇస్తామన్నా కూడా మైలు పడిపోతామనే భయంతో మమ్మల్ని కూర్చోబెట్టడానికి ఇష్టపడలేదు. 

ఇది జరిగిన కొద్దిసేపటికే మాస్టారు మా దగ్గరికి వచ్చి "మీరు ఎడ్ల బండి నడపగలరా?" అని అడిగారు. మేము దానికి అవును అని చెప్పాము. ఎడ్ల బండి నడిపేవాళ్లు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. రావడానికి కూడా అంగీకరించడం లేదు. అందుకే ఎడ్లబండి నడపగలమూ అని చెప్పాం. ఇలా ఎన్నో కష్టాల తర్వాత సతారా చేరుకున్నాం. మేము వస్తున్నట్టు నాన్నకు రాసిన లెటర్ కూడా ఎవరూ ఆయనకు ఇవ్వలేదు. అందుకే మేము వస్తున్న సంగతి నాన్నకు తెలియలేదు. అందుకే మా నాన్న స్టేషన్‌కు రాలేదని గ్రహించాం.  

ఇదంతా జరిగినప్పుడు తన వయసు తొమ్మిదేళ్లేనని, అందుకే ఈ సంఘటన తన మనసులో చెరగని ముద్ర వేసిందని అంబేడ్కర్ చెప్పారు.

అంబేడ్కర్ విదేశాలలో చదువుకుంటున్నప్పుడు బరోడాకు వచ్చారు. ఆయన చదవు, ఇతర ఖర్చులన్నీ బరోడా సంస్థానం భరించేది అందుకే ఆయన అక్కడకు వచ్చారు. అక్కడ పనిచేయవలసి వచ్చేది. కానీ వచ్చిన ప్రతిసారీ ఎక్కడ ఉండాలనేది పెద్ద ప్రశ్న. 

బయట విదేశాల్లో చదువుకుంటున్నప్పుడు అంటరానివాడిననే భావన మనసులో ఉండేది కాదట. మళ్లీ ఇండియాకు వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తుకు వచ్చాయని అంబేడ్కర్ చెప్పారు. అటువంటి పరిస్థితిలో ఆయన పార్శీ హోటల్‌కు చేరుకున్నారు. తాను పార్సీ అని అబద్దం చెప్పి అక్కడ తలదాచుకునే వారు. అయితే కొన్ని రోజుల తర్వాత అసలు విషయం తెలిసిపోయింది. చాలా మంది వచ్చి బయటకు పంపించేశారు. 

అది తలుచుకుంటే నా కళ్లలో నీళ్లు వస్తాయని అంబేడ్కర్ రాశారు. కొందరు కొట్టేందుకు ప్రయత్నిస్తుంటే మరికొందరు వద్దని చెప్పడం నేను ఎప్పటికీ మరచిపోలేను. కాబట్టి హిందువులతోపాటు పార్సీలకు కూడా నేను అంటరానివాడినని గ్రహించాను.

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాలు ఎందుకు విరిగింది?

1929లో బొంబాయి ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ)పై జరుగుతున్న దౌర్జన్యాలపై విచారణ జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అందులో సభ్యులుగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఉన్నారు. కమిటీ విచారణలో భాగంగా చాలా ప్రాంతాలు తిరిగారు. ఎంతో ప్రాధేయపడిన తర్వాత చలిస్‌గావ్‌కు వచ్చేందుకు కమిటీ ఒప్పుకుంది. 

చలిస్‌గావ్‌కు చెందిన ఎస్సీ ప్రజలు అంబేడ్కర్‌ను గుర్రపు బండిలో మహర్వాడకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఓ వాహనం వచ్చిన ఆయన బండిని ఢీ కొట్టింది. వంతెన దాటుతుండగా ప్రమాదం జరిగింది. దీంతో ఆయన రాతి నేలపై పడిపోయారు. అప్పుడే ఆయన చెయ్యి విరిగిపోయింది. 

సహచరులతో కలిసి ఉద్యమించాలని అంబేడ్కర్ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం తొలుత ఔరంగాబాద్‌లో ఉన్న దౌలతాబాద్ కోటకు వెళ్లాలని భావించారు. దౌలతాబాద్ కోట వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న నీటి మడుగులో ఆయనతోపాటు సహచరులంతా కాళ్లు చేతులు కడుక్కున్నారు. దీనిపై దుమారం రేగింది. ఒక ముసలావిడ వారి వద్దకు వచ్చి మీరు ఈ నీటిని పాడు చేశారని అరిచారు. 'మీ హక్కులు మర్చిపోయారా?' అని నిలదీశారు. 

ఆమె చెప్పిన మాటలు విన్న అంబేడ్కర్ ఇలా అంటారు, "మీ మతం మాకు నేర్పింది ఇదేనా? మేం ముస్లింలుగా మారితే నీళ్లు తాగవచ్చా ? అని నిలదీశారు. దీంతో వాతావరణం కాస్త చల్లబడింది. అక్కడి నుంచి కోట లోపలికి అనుమతించారు. తాము హిందువులకే కాదు ముస్లింలకు, పార్సీలకు కూడా అంటరానివాళ్లమని తెలియజేస్తుందన్నారు అంబేడ్కర్. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Security Dispute: జగన్మోహన్ రెడ్డిపై కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు-ప్రధానిని కలిసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ
జగన్మోహన్ రెడ్డిపై కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు-ప్రధానిని కలిసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ
Earthquake prediction for Ramagundam: రామగుండానికి.. గండం…. పొంచి ఉన్న భూకంపం -అప్రమత్తం చేస్తున్న Epic
రామగుండానికి.. గండం…. పొంచి ఉన్న భూకంపం -అప్రమత్తం చేస్తున్న Epic
Harish Rao: జింకను చంపితే సల్మాన్ ఖాన్‌ను జైల్లో పెట్టారు, 3 జింకలు చంపిన రేవంత్ ను ఏం చేయాలి? హరీష్ రావు
జింకను చంపితే సల్మాన్ ఖాన్‌ను జైల్లో పెట్టారు, 3 జింకలు చంపిన రేవంత్ ను ఏం చేయాలి? హరీష్ రావు
TS Indiramma Illu Housing Status Online: ఇందిరమ్మ ఇల్లు పథకం లబ్ధిదారులు స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి, స్కీమ్ పూర్తి వివరాలు
ఇందిరమ్మ ఇల్లు పథకం లబ్ధిదారులు స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి, స్కీమ్ పూర్తి వివరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KL Rahul 93* vs RCB IPL 2025 | కేఎల్ రాహుల్ మాస్ ఇన్నింగ్స్ కు అసలు రీజన్ ఇదేKL Rahul Strong Statement | RCB vs DC మ్యాచ్ లో వీర విజృంభణ తర్వాత కేఎల్ రాహుల్ మాస్RCB vs DC Match Highlights IPL 2025 | ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ జయభేరి | ABP DesamMS Dhoni to Lead CSK IPL 2025 | సీఎస్కే ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్..ఓ బ్యాడ్ న్యూస్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Security Dispute: జగన్మోహన్ రెడ్డిపై కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు-ప్రధానిని కలిసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ
జగన్మోహన్ రెడ్డిపై కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు-ప్రధానిని కలిసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ
Earthquake prediction for Ramagundam: రామగుండానికి.. గండం…. పొంచి ఉన్న భూకంపం -అప్రమత్తం చేస్తున్న Epic
రామగుండానికి.. గండం…. పొంచి ఉన్న భూకంపం -అప్రమత్తం చేస్తున్న Epic
Harish Rao: జింకను చంపితే సల్మాన్ ఖాన్‌ను జైల్లో పెట్టారు, 3 జింకలు చంపిన రేవంత్ ను ఏం చేయాలి? హరీష్ రావు
జింకను చంపితే సల్మాన్ ఖాన్‌ను జైల్లో పెట్టారు, 3 జింకలు చంపిన రేవంత్ ను ఏం చేయాలి? హరీష్ రావు
TS Indiramma Illu Housing Status Online: ఇందిరమ్మ ఇల్లు పథకం లబ్ధిదారులు స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి, స్కీమ్ పూర్తి వివరాలు
ఇందిరమ్మ ఇల్లు పథకం లబ్ధిదారులు స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి, స్కీమ్ పూర్తి వివరాలు
Ram Charan : ఎక్కడికెళ్లినా తనతో పాటు కుక్కర్ వెంట తీసుకెళ్లే గ్లోబల్ స్టార్... కారణం ఏంటో తెలుసా?
ఎక్కడికెళ్లినా తనతో పాటు కుక్కర్ వెంట తీసుకెళ్లే గ్లోబల్ స్టార్... కారణం ఏంటో తెలుసా?
Rajamouli: రాజమౌళి ఎఫెక్ట్... మొత్తం క్లీన్ చేసేశారు - దర్శక ధీరుడు పోస్ట్ చేస్తే అంతేగా!
రాజమౌళి ఎఫెక్ట్... మొత్తం క్లీన్ చేసేశారు - దర్శక ధీరుడు పోస్ట్ చేస్తే అంతేగా!
CSK New Catptain MS Dhoni: కొత్త సార‌థి ధోనీ ముందు క్లిష్ల ప‌రిస్థితులు.. ఆ లోపాలు స‌వ‌రించుకోవాల్సిందే.. నేడు కేకేఆర్ తో చెన్నై మ్యాచ్
కొత్త సార‌థి ధోనీ ముందు క్లిష్ల ప‌రిస్థితులు.. ఆ లోపాలు స‌వ‌రించుకోవాల్సిందే.. నేడు కేకేఆర్ తో చెన్నై మ్యాచ్
Vastu Tips in Telugu: వేసవి కాలం మట్టి కుండ కొన్నారా.. వాస్తు ప్రకారం ఏ దిశలో ఉంచాలో తెలుసా , నల్లటి కుండ కొనొచ్చా!
వేసవి కాలం మట్టి కుండ కొన్నారా.. వాస్తు ప్రకారం ఏ దిశలో ఉంచాలో తెలుసా , నల్లటి కుండ కొనొచ్చా!
Embed widget