అన్వేషించండి

వివక్ష జరుగుతోందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎప్పుడు గుర్తించారు? ఆత్మకథలో ఏం రాశారు?

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తన ఆత్మకథ 'వెయిటింగ్ ఫర్ ఏ వీసా'లో వివక్ష తర్వాత తనకు ఎదురైన అనుభవాలను వివరించారు.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు తెలియని వ్యక్తులు ఉండరేమో. అంతలా ప్రజల గుండెల్లో ఆయన శాశ్వతంగా ఉండిపోవడానికి రీజన్ ఏంటీ. అలా పోరాడేందుకు ఆయన్ని ప్రేరేపించిన సంఘటనలు ఏంటీ?

కుల ప్రాతిపదికన వివక్షను రెండు విధాలుగా వర్ణించవచ్చని అంబేడ్కర్ తన ఆత్మకథ 'వెయిటింగ్ ఫర్ ఎ వీసా'లో రాశారు. మొదటి నేరుగా సమాచారం చెప్పడం. రెండోది జరిగిన సంఘటనలు గురించి వివరిస్తూ చెప్పడం. రెండో పద్ధతిని ఎంచుకున్న అంబేడ్కర్‌ తన అనుభవాలను పంచుకున్నారు. 

నేను మహర్ కులానికి చెందినవాడిని కాబట్టి తరగతిలో విడిగా కూర్చోవాల్సి వస్తుందని నాకు తెలుసు. నీళ్లు తాగడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయని కూడా గ్రహించాను. ఇలా చాలా ఘటనలు మనసుపై తీవ్ర ప్రభావం చూపాయి.

కోరేగావ్ వెళ్తుండగా ఏం జరిగింది?
మొదటి ఘటన 1901 నాటిదని అంబేడ్కర్ చెప్పారు. తన తండ్రి సతారాలోని కోరేగావ్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్నారు. బొంబాయి ప్రభుత్వం (మహారాష్ట్ర ప్రభుత్వం) కరవు పీడిత రైతులకు పని ఇవ్వడానికి చెరువులు తవ్వుతోంది. తల్లి మరణానంతరం తన అన్న, అక్క ఇద్దరు కుమారులు (సోదరి కూడా చనిపోయింది) తన అన్న, అక్కతో కలిసి నివసిస్తున్నారు.

అంబేడ్కర్ తన అన్న, అక్క కుమారులతో కలిసి వేసవి సెలవుల్లో సతారాలోని తన తండ్రిని కలవడానికి బయలుదేరారు. ప్రజలంతా తమ ఇంటి నుంచి కొత్త దుస్తుల్లో రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి సతారాకు సమీపంలోని మసూర్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత తండ్రి కోసం ఎదురుచూడటం మొదలుపెట్టారు కానీ చాలాసేపటి తర్వాత కూడా ఎవరూ రాలేదు.

కాసేపటి తర్వాత స్టేషన్ మాస్టర్ వచ్చి మా టికెట్ చూసి ఎక్కడికి వెళ్లాలని అడిగారు. మా బట్టలు చూశాక మేము మహర్ కులానికి చెందినవాళ్లమని మాస్టారు గ్రహించారు. ఈ విషయం తెలియగానే అతని ముఖ కవళికలు మారిపోయాయి. దీనికితోడు స్టేషన్‌లో పార్క్ చేసిన ఎడ్ల బండి వాళ్లు కూడా మమ్మల్ని ఎక్కించుకోలేదు. ఎక్కువ డబ్బులు ఇస్తామన్నా కూడా మైలు పడిపోతామనే భయంతో మమ్మల్ని కూర్చోబెట్టడానికి ఇష్టపడలేదు. 

ఇది జరిగిన కొద్దిసేపటికే మాస్టారు మా దగ్గరికి వచ్చి "మీరు ఎడ్ల బండి నడపగలరా?" అని అడిగారు. మేము దానికి అవును అని చెప్పాము. ఎడ్ల బండి నడిపేవాళ్లు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. రావడానికి కూడా అంగీకరించడం లేదు. అందుకే ఎడ్లబండి నడపగలమూ అని చెప్పాం. ఇలా ఎన్నో కష్టాల తర్వాత సతారా చేరుకున్నాం. మేము వస్తున్నట్టు నాన్నకు రాసిన లెటర్ కూడా ఎవరూ ఆయనకు ఇవ్వలేదు. అందుకే మేము వస్తున్న సంగతి నాన్నకు తెలియలేదు. అందుకే మా నాన్న స్టేషన్‌కు రాలేదని గ్రహించాం.  

ఇదంతా జరిగినప్పుడు తన వయసు తొమ్మిదేళ్లేనని, అందుకే ఈ సంఘటన తన మనసులో చెరగని ముద్ర వేసిందని అంబేడ్కర్ చెప్పారు.

అంబేడ్కర్ విదేశాలలో చదువుకుంటున్నప్పుడు బరోడాకు వచ్చారు. ఆయన చదవు, ఇతర ఖర్చులన్నీ బరోడా సంస్థానం భరించేది అందుకే ఆయన అక్కడకు వచ్చారు. అక్కడ పనిచేయవలసి వచ్చేది. కానీ వచ్చిన ప్రతిసారీ ఎక్కడ ఉండాలనేది పెద్ద ప్రశ్న. 

బయట విదేశాల్లో చదువుకుంటున్నప్పుడు అంటరానివాడిననే భావన మనసులో ఉండేది కాదట. మళ్లీ ఇండియాకు వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తుకు వచ్చాయని అంబేడ్కర్ చెప్పారు. అటువంటి పరిస్థితిలో ఆయన పార్శీ హోటల్‌కు చేరుకున్నారు. తాను పార్సీ అని అబద్దం చెప్పి అక్కడ తలదాచుకునే వారు. అయితే కొన్ని రోజుల తర్వాత అసలు విషయం తెలిసిపోయింది. చాలా మంది వచ్చి బయటకు పంపించేశారు. 

అది తలుచుకుంటే నా కళ్లలో నీళ్లు వస్తాయని అంబేడ్కర్ రాశారు. కొందరు కొట్టేందుకు ప్రయత్నిస్తుంటే మరికొందరు వద్దని చెప్పడం నేను ఎప్పటికీ మరచిపోలేను. కాబట్టి హిందువులతోపాటు పార్సీలకు కూడా నేను అంటరానివాడినని గ్రహించాను.

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాలు ఎందుకు విరిగింది?

1929లో బొంబాయి ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ)పై జరుగుతున్న దౌర్జన్యాలపై విచారణ జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అందులో సభ్యులుగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఉన్నారు. కమిటీ విచారణలో భాగంగా చాలా ప్రాంతాలు తిరిగారు. ఎంతో ప్రాధేయపడిన తర్వాత చలిస్‌గావ్‌కు వచ్చేందుకు కమిటీ ఒప్పుకుంది. 

చలిస్‌గావ్‌కు చెందిన ఎస్సీ ప్రజలు అంబేడ్కర్‌ను గుర్రపు బండిలో మహర్వాడకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఓ వాహనం వచ్చిన ఆయన బండిని ఢీ కొట్టింది. వంతెన దాటుతుండగా ప్రమాదం జరిగింది. దీంతో ఆయన రాతి నేలపై పడిపోయారు. అప్పుడే ఆయన చెయ్యి విరిగిపోయింది. 

సహచరులతో కలిసి ఉద్యమించాలని అంబేడ్కర్ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం తొలుత ఔరంగాబాద్‌లో ఉన్న దౌలతాబాద్ కోటకు వెళ్లాలని భావించారు. దౌలతాబాద్ కోట వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న నీటి మడుగులో ఆయనతోపాటు సహచరులంతా కాళ్లు చేతులు కడుక్కున్నారు. దీనిపై దుమారం రేగింది. ఒక ముసలావిడ వారి వద్దకు వచ్చి మీరు ఈ నీటిని పాడు చేశారని అరిచారు. 'మీ హక్కులు మర్చిపోయారా?' అని నిలదీశారు. 

ఆమె చెప్పిన మాటలు విన్న అంబేడ్కర్ ఇలా అంటారు, "మీ మతం మాకు నేర్పింది ఇదేనా? మేం ముస్లింలుగా మారితే నీళ్లు తాగవచ్చా ? అని నిలదీశారు. దీంతో వాతావరణం కాస్త చల్లబడింది. అక్కడి నుంచి కోట లోపలికి అనుమతించారు. తాము హిందువులకే కాదు ముస్లింలకు, పార్సీలకు కూడా అంటరానివాళ్లమని తెలియజేస్తుందన్నారు అంబేడ్కర్. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IndiGo Flight Cancelled : శనివారం ఎన్ని ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి? పరిస్థితి ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుంది? CEO ఏం చెప్పారు?
శనివారం ఎన్ని ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి? పరిస్థితి ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుంది? CEO ఏం చెప్పారు?
Birmingham Fire Accident: అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్ని ప్రమాదం! ఇద్దరు తెలుగు విద్యార్దులు మృతి
అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్ని ప్రమాదం! ఇద్దరు తెలుగు విద్యార్దులు మృతి
Varanasi OTT Deal:రాజమౌళి 'వారణాసి' ఓటిటి హక్కుల కోసం తీవ్ర పోటీ! 1000 కోట్లు దాటి వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా!
రాజమౌళి'వారణాసి' ఓటిటి హక్కుల కోసం తీవ్ర పోటీ! 1000 కోట్లు దాటి వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా!
Indigo Issue: ఇండిగోకు వెసులుబాట్లు, ఇతర సంస్థల అదనపు సర్వీసులు - విమానాల సమస్య పరిష్కారానికి రామ్మోహన్ నాయుడు వార్ రూమ్
ఇండిగోకు వెసులుబాట్లు, ఇతర సంస్థల అదనపు సర్వీసులు - విమానాల సమస్య పరిష్కారానికి రామ్మోహన్ నాయుడు వార్ రూమ్

వీడియోలు

Indigo Flights Cancellation Controversy | ఇండిగో వివాదంపై కేంద్రం సీరియస్ | ABP Desam
Putin on oil trade with India | చమురు వాణిజ్యంపై క్లారిటీ ఇచ్చిన వ్లాదిమిర్ పుతిన్ | ABP Desam
Vintage Virat Kohli | సఫారీలతో రెండో వన్డేలో వింటేజ్ స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్న విరాట్
Ruturaj Gaikwad Century in India vs South Africa ODI |  అన్నా! నువ్వు సెంచరీ చెయ్యకే ప్లీజ్ | ABP Desam
Harbhajan Singh about Rohit Sharma Virat Kohli | రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్‌పై హర్బజన్ సింగ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IndiGo Flight Cancelled : శనివారం ఎన్ని ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి? పరిస్థితి ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుంది? CEO ఏం చెప్పారు?
శనివారం ఎన్ని ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి? పరిస్థితి ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుంది? CEO ఏం చెప్పారు?
Birmingham Fire Accident: అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్ని ప్రమాదం! ఇద్దరు తెలుగు విద్యార్దులు మృతి
అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్ని ప్రమాదం! ఇద్దరు తెలుగు విద్యార్దులు మృతి
Varanasi OTT Deal:రాజమౌళి 'వారణాసి' ఓటిటి హక్కుల కోసం తీవ్ర పోటీ! 1000 కోట్లు దాటి వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా!
రాజమౌళి'వారణాసి' ఓటిటి హక్కుల కోసం తీవ్ర పోటీ! 1000 కోట్లు దాటి వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా!
Indigo Issue: ఇండిగోకు వెసులుబాట్లు, ఇతర సంస్థల అదనపు సర్వీసులు - విమానాల సమస్య పరిష్కారానికి రామ్మోహన్ నాయుడు వార్ రూమ్
ఇండిగోకు వెసులుబాట్లు, ఇతర సంస్థల అదనపు సర్వీసులు - విమానాల సమస్య పరిష్కారానికి రామ్మోహన్ నాయుడు వార్ రూమ్
Russia India trade ties: మరో ఐదేళ్లు వాణిజ్య బంధం బలోపేతం - మోదీ, పుతిన్ ఉమ్మడి ప్రకటన
మరో ఐదేళ్లు వాణిజ్య బంధం బలోపేతం - మోదీ, పుతిన్ ఉమ్మడి ప్రకటన
Best Anti-Aging Exercises : వయసును తగ్గించే ఆరు వ్యాయామాలు.. రోజుకు 20 నిమిషాలు చేస్తే అద్భుత ఫలితాలు
వయసును తగ్గించే ఆరు వ్యాయామాలు.. రోజుకు 20 నిమిషాలు చేస్తే అద్భుత ఫలితాలు
Warm-Up Benefits : వార్మ్-అప్ ఎలా చేయాలో తెలుసా? ఉదయాన్నే చేస్తే కలిగే లాభాలివే
వార్మ్-అప్ ఎలా చేయాలో తెలుసా? ఉదయాన్నే చేస్తే కలిగే లాభాలివే
Live in Relationship: భారత్‌లో సహజీవనం నేరమో కాదు ఘోరమో కాదు: రాజస్థాన్ కోర్టు సంచలన కామెంట్స్
భారత్‌లో సహజీవనం నేరమో కాదు ఘోరమో కాదు: రాజస్థాన్ కోర్టు సంచలన కామెంట్స్
Embed widget