అన్వేషించండి

వివక్ష జరుగుతోందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎప్పుడు గుర్తించారు? ఆత్మకథలో ఏం రాశారు?

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తన ఆత్మకథ 'వెయిటింగ్ ఫర్ ఏ వీసా'లో వివక్ష తర్వాత తనకు ఎదురైన అనుభవాలను వివరించారు.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు తెలియని వ్యక్తులు ఉండరేమో. అంతలా ప్రజల గుండెల్లో ఆయన శాశ్వతంగా ఉండిపోవడానికి రీజన్ ఏంటీ. అలా పోరాడేందుకు ఆయన్ని ప్రేరేపించిన సంఘటనలు ఏంటీ?

కుల ప్రాతిపదికన వివక్షను రెండు విధాలుగా వర్ణించవచ్చని అంబేడ్కర్ తన ఆత్మకథ 'వెయిటింగ్ ఫర్ ఎ వీసా'లో రాశారు. మొదటి నేరుగా సమాచారం చెప్పడం. రెండోది జరిగిన సంఘటనలు గురించి వివరిస్తూ చెప్పడం. రెండో పద్ధతిని ఎంచుకున్న అంబేడ్కర్‌ తన అనుభవాలను పంచుకున్నారు. 

నేను మహర్ కులానికి చెందినవాడిని కాబట్టి తరగతిలో విడిగా కూర్చోవాల్సి వస్తుందని నాకు తెలుసు. నీళ్లు తాగడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయని కూడా గ్రహించాను. ఇలా చాలా ఘటనలు మనసుపై తీవ్ర ప్రభావం చూపాయి.

కోరేగావ్ వెళ్తుండగా ఏం జరిగింది?
మొదటి ఘటన 1901 నాటిదని అంబేడ్కర్ చెప్పారు. తన తండ్రి సతారాలోని కోరేగావ్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్నారు. బొంబాయి ప్రభుత్వం (మహారాష్ట్ర ప్రభుత్వం) కరవు పీడిత రైతులకు పని ఇవ్వడానికి చెరువులు తవ్వుతోంది. తల్లి మరణానంతరం తన అన్న, అక్క ఇద్దరు కుమారులు (సోదరి కూడా చనిపోయింది) తన అన్న, అక్కతో కలిసి నివసిస్తున్నారు.

అంబేడ్కర్ తన అన్న, అక్క కుమారులతో కలిసి వేసవి సెలవుల్లో సతారాలోని తన తండ్రిని కలవడానికి బయలుదేరారు. ప్రజలంతా తమ ఇంటి నుంచి కొత్త దుస్తుల్లో రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి సతారాకు సమీపంలోని మసూర్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత తండ్రి కోసం ఎదురుచూడటం మొదలుపెట్టారు కానీ చాలాసేపటి తర్వాత కూడా ఎవరూ రాలేదు.

కాసేపటి తర్వాత స్టేషన్ మాస్టర్ వచ్చి మా టికెట్ చూసి ఎక్కడికి వెళ్లాలని అడిగారు. మా బట్టలు చూశాక మేము మహర్ కులానికి చెందినవాళ్లమని మాస్టారు గ్రహించారు. ఈ విషయం తెలియగానే అతని ముఖ కవళికలు మారిపోయాయి. దీనికితోడు స్టేషన్‌లో పార్క్ చేసిన ఎడ్ల బండి వాళ్లు కూడా మమ్మల్ని ఎక్కించుకోలేదు. ఎక్కువ డబ్బులు ఇస్తామన్నా కూడా మైలు పడిపోతామనే భయంతో మమ్మల్ని కూర్చోబెట్టడానికి ఇష్టపడలేదు. 

ఇది జరిగిన కొద్దిసేపటికే మాస్టారు మా దగ్గరికి వచ్చి "మీరు ఎడ్ల బండి నడపగలరా?" అని అడిగారు. మేము దానికి అవును అని చెప్పాము. ఎడ్ల బండి నడిపేవాళ్లు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. రావడానికి కూడా అంగీకరించడం లేదు. అందుకే ఎడ్లబండి నడపగలమూ అని చెప్పాం. ఇలా ఎన్నో కష్టాల తర్వాత సతారా చేరుకున్నాం. మేము వస్తున్నట్టు నాన్నకు రాసిన లెటర్ కూడా ఎవరూ ఆయనకు ఇవ్వలేదు. అందుకే మేము వస్తున్న సంగతి నాన్నకు తెలియలేదు. అందుకే మా నాన్న స్టేషన్‌కు రాలేదని గ్రహించాం.  

ఇదంతా జరిగినప్పుడు తన వయసు తొమ్మిదేళ్లేనని, అందుకే ఈ సంఘటన తన మనసులో చెరగని ముద్ర వేసిందని అంబేడ్కర్ చెప్పారు.

అంబేడ్కర్ విదేశాలలో చదువుకుంటున్నప్పుడు బరోడాకు వచ్చారు. ఆయన చదవు, ఇతర ఖర్చులన్నీ బరోడా సంస్థానం భరించేది అందుకే ఆయన అక్కడకు వచ్చారు. అక్కడ పనిచేయవలసి వచ్చేది. కానీ వచ్చిన ప్రతిసారీ ఎక్కడ ఉండాలనేది పెద్ద ప్రశ్న. 

బయట విదేశాల్లో చదువుకుంటున్నప్పుడు అంటరానివాడిననే భావన మనసులో ఉండేది కాదట. మళ్లీ ఇండియాకు వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తుకు వచ్చాయని అంబేడ్కర్ చెప్పారు. అటువంటి పరిస్థితిలో ఆయన పార్శీ హోటల్‌కు చేరుకున్నారు. తాను పార్సీ అని అబద్దం చెప్పి అక్కడ తలదాచుకునే వారు. అయితే కొన్ని రోజుల తర్వాత అసలు విషయం తెలిసిపోయింది. చాలా మంది వచ్చి బయటకు పంపించేశారు. 

అది తలుచుకుంటే నా కళ్లలో నీళ్లు వస్తాయని అంబేడ్కర్ రాశారు. కొందరు కొట్టేందుకు ప్రయత్నిస్తుంటే మరికొందరు వద్దని చెప్పడం నేను ఎప్పటికీ మరచిపోలేను. కాబట్టి హిందువులతోపాటు పార్సీలకు కూడా నేను అంటరానివాడినని గ్రహించాను.

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాలు ఎందుకు విరిగింది?

1929లో బొంబాయి ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ)పై జరుగుతున్న దౌర్జన్యాలపై విచారణ జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అందులో సభ్యులుగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఉన్నారు. కమిటీ విచారణలో భాగంగా చాలా ప్రాంతాలు తిరిగారు. ఎంతో ప్రాధేయపడిన తర్వాత చలిస్‌గావ్‌కు వచ్చేందుకు కమిటీ ఒప్పుకుంది. 

చలిస్‌గావ్‌కు చెందిన ఎస్సీ ప్రజలు అంబేడ్కర్‌ను గుర్రపు బండిలో మహర్వాడకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఓ వాహనం వచ్చిన ఆయన బండిని ఢీ కొట్టింది. వంతెన దాటుతుండగా ప్రమాదం జరిగింది. దీంతో ఆయన రాతి నేలపై పడిపోయారు. అప్పుడే ఆయన చెయ్యి విరిగిపోయింది. 

సహచరులతో కలిసి ఉద్యమించాలని అంబేడ్కర్ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం తొలుత ఔరంగాబాద్‌లో ఉన్న దౌలతాబాద్ కోటకు వెళ్లాలని భావించారు. దౌలతాబాద్ కోట వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న నీటి మడుగులో ఆయనతోపాటు సహచరులంతా కాళ్లు చేతులు కడుక్కున్నారు. దీనిపై దుమారం రేగింది. ఒక ముసలావిడ వారి వద్దకు వచ్చి మీరు ఈ నీటిని పాడు చేశారని అరిచారు. 'మీ హక్కులు మర్చిపోయారా?' అని నిలదీశారు. 

ఆమె చెప్పిన మాటలు విన్న అంబేడ్కర్ ఇలా అంటారు, "మీ మతం మాకు నేర్పింది ఇదేనా? మేం ముస్లింలుగా మారితే నీళ్లు తాగవచ్చా ? అని నిలదీశారు. దీంతో వాతావరణం కాస్త చల్లబడింది. అక్కడి నుంచి కోట లోపలికి అనుమతించారు. తాము హిందువులకే కాదు ముస్లింలకు, పార్సీలకు కూడా అంటరానివాళ్లమని తెలియజేస్తుందన్నారు అంబేడ్కర్. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget