అన్వేషించండి

China provokes India: భారత్‌లోని భూభాగాలతో చైనా మ్యాప్‌-మరోసారి కవ్వింపు చర్యలు

China provokes India: భారత్‌లోని భూభాగాలతో చైనా మ్యాప్‌. డ్రాగన్‌ మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తోంది.

డ్రాగన్‌ మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తోంది.  భారత భూభాగాల విషయంలో వివాదాస్పదంగా వ్యవహరిస్తోంది . చైనా తాజాగా తమ దేశ అధికార మ్యాప్‌ 2023 ఎడిషన్‌ను సోమవారం విడుదల చేసింది. అయితే ఇందులో భారత్‌ భూభాగాలను తమవిగా చూపిస్తోంది. సోమవారం చైనా అధికారికంగా విడుదల చేసిన మ్యాప్‌లో భారత్‌కు చెందిన అరుణాచల్‌ ప్రదేశ్‌, అక్సాయిచిన్‌లు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతాలను చైనా తమ భూభాగాలుగా పేర్కొంటోంది. అలాగే తైవాన్‌, వివాదాస్పద సౌత్‌ చైనా సముద్రాన్ని కూడా తమ స్టాండర్డ్‌ మ్యాప్‌లో చూపించింది. ఇంతకుముందు కూడా చైనా ఇలా పలుమార్లు భారత్‌ను రెచ్చగొట్టే విధంగా మ్యాప్‌లు విడుదల చేసింది. తాజాగా మరోసారి పొరుగుదేశం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. కాగా అరుణాచల్‌ ప్రదేశ్‌ భారత్‌లో అంతర్భాగమని, ముందు నుంచీ అలాగే ఉందని.. ఇక ముందు కూడా అలాగే ఉంటుందని భారత్‌ పలుమార్లు వెల్లడించింది.

చైనా సహజ వనరుల శాఖ ఈ మ్యాప్‌ను విడుదల చేసింది. 2023 ఎడిషన్‌ ఆఫ్‌ ద స్టాండర్డ్‌ మ్యాప్‌ ఆఫ్‌ చైనా పేరుతో మ్యాప్స్‌ను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు చైనా అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌) పోస్ట్‌ ద్వారా వెల్లడించింది. డిజిటల్‌ మ్యాప్స్‌, నావిగేషన్‌ మ్యాప్స్‌ను కూడా విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.  చైనా జాతీయ సరిహద్దులు, ప్రపంచంలో ఇతర దేశాల సరిహద్దుల డ్రాయింగ్‌ ఆధారంగా ఈ మ్యాప్స్‌ను రూపొందించినట్లు  వెల్లడించింది. 

చైనా విడుదల చేసిన మ్యాప్‌ ప్రకారం.. అరుణాచల్‌ ప్రదేశ్‌ను సౌత్‌ టిబెట్‌గా, అక్సాయిచిన్‌ను 1962 యుద్ధంలో చైనా ఆక్రమించుకున్నట్లుగా చూపిస్తోంది. తాజా ఎడిషన్‌ మ్యాప్‌లో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాలు తమవేనని చూపించింది . అలాగే వివాదాస్పద వివాదాస్పదమైన తొమ్మిది డ్యాష్‌ లైన్స్‌ కూడా చైనా మ్యాప్‌లో చూపించింది. దీని ప్రకారం దక్షిణ చైనా సముద్రంలో చాలా భాగాన్ని చైనా భూభాగంగా పేర్కొంటోంది. ఈ చర్య కారణంగా వియత్నాం, ఫిలిప్పీన్స్‌, మలేషియా, బ్రూనై, తైవాన్‌ వంటి దేశాల నుంచి కూడా డ్రాగన్‌ వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ఈ దేశాలు కూడా సముద్రంలోని కొన్ని ప్రాంతాలను తమవంటే తమవి అని పోటీ పడుతున్నాయి.

డ్రాగన్‌ ఇలా చేయడం కొత్తేమీ కాదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పదకొండు ప్రాంతాలకు చైనీస్‌, టిబెటిన్‌, పిన్‌యున్‌ భాషల్లో విడుదల చేయగా, వాటిని అక్కడి సివిల్‌ ఎఫైర్స్‌ మంత్రిత్వ శాఖ ఆమోదించింది. అప్పుడు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని భూభాగాలను దక్షిణ టిబెట్‌లోని జాంగ్నాన్‌గా సూచించింది. అంతేకాకుండా ఇటానగర్‌ దగ్గరలో ఉన్న ఓ పట్టణాన్ని దానికి రాజధానికి చూపించింది. 

భారత్‌ ఈ విషయంపై ఎన్నో సార్లు స్పందించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రం భారత్‌లో అంతర్భాగమని గట్టిగా నొక్కి చెప్తోంది. ఎల్లప్పుడూ అరుణాచల్‌ భారత్‌తోనే ఉందని, ఇక ముందు కూడా అలాగే ఉంటుందని వెల్లడించింది. భారత్‌లో త్వరలో జీ 20  సమావేశాలు జరగనున్న నేపథ్యంలో చైనా ఇలాంటి వివాదాస్పద మ్యాప్స్‌ విడుదల చేయడం గమనార్హం. చైనా అధ్యక్షుడు జీ జిన్‌ పింగ్‌ సహా 42 మంది దేశాధినేతలను సదస్సుకు భారత్‌ ఆహ్వానించింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vallabhaneni Vamsi Latest News: వైసీపీ నేత వల్లభనేని వంశీకి బిగ్‌ షాక్‌- ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు 
వైసీపీ నేత వల్లభనేని వంశీకి బిగ్‌ షాక్‌- ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు 
Bhupalpally News: మేడిగడ్డ ప్రాజెక్ట్‌ అక్రమాలపై కేసు వేసిన వ్యక్తి హత్య- విచారణకు ఒక్కరోజు ముందే మర్డర్‌- రేవంత్ సీరియస్‌- కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ 
మేడిగడ్డ ప్రాజెక్ట్‌ అక్రమాలపై కేసు వేసిన వ్యక్తి హత్య- విచారణకు ఒక్కరోజు ముందే మర్డర్‌- రేవంత్ సీరియస్‌- కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ 
YS Jagan Latest News: వైఎస్ జగన్ భద్రతపై గవర్నర్‌కు వైసీపీ ఫిర్యాదు- ఏం తగ్గిందని ప్రశ్నిస్తున్న మంత్రి గొట్టిపాటి 
వైఎస్ జగన్ భద్రతపై గవర్నర్‌కు వైసీపీ ఫిర్యాదు- ఏం తగ్గిందని ప్రశ్నిస్తున్న మంత్రి గొట్టిపాటి 
Delhi CM Rekha Gupta Oath Ceremony:ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం- వేడుకకు మోదీ, అమిత్‌షా, చంద్రబాబు, పవన్ హాజరు
ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం- వేడుకకు మోదీ, అమిత్‌షా, చంద్రబాబు, పవన్ హాజరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Qatar AL Thani Family Wealth | మోదీ ఎయిర్ పోర్ట్ కు వెళ్లారంటే అర్థమవ్వలేదా ఖతార్ అమీర్ రేంజ్ | ABPTrolls on Pawan kalyan Body | కుంభమేళా స్నానంపైనా కుళ్లు ట్రోలింగులు | ABP DesamKakinada Shilparamam Photo Shoots | ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ పెట్టిన శిల్పారామం ఇప్పుడు ఇలా | ABP DesamKTR Photo in Sircilla Tea Shop | టీ షాపునకు కేటీఆర్ ఫోటో..ఈ లోగా కలెక్టర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Latest News: వైసీపీ నేత వల్లభనేని వంశీకి బిగ్‌ షాక్‌- ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు 
వైసీపీ నేత వల్లభనేని వంశీకి బిగ్‌ షాక్‌- ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు 
Bhupalpally News: మేడిగడ్డ ప్రాజెక్ట్‌ అక్రమాలపై కేసు వేసిన వ్యక్తి హత్య- విచారణకు ఒక్కరోజు ముందే మర్డర్‌- రేవంత్ సీరియస్‌- కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ 
మేడిగడ్డ ప్రాజెక్ట్‌ అక్రమాలపై కేసు వేసిన వ్యక్తి హత్య- విచారణకు ఒక్కరోజు ముందే మర్డర్‌- రేవంత్ సీరియస్‌- కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ 
YS Jagan Latest News: వైఎస్ జగన్ భద్రతపై గవర్నర్‌కు వైసీపీ ఫిర్యాదు- ఏం తగ్గిందని ప్రశ్నిస్తున్న మంత్రి గొట్టిపాటి 
వైఎస్ జగన్ భద్రతపై గవర్నర్‌కు వైసీపీ ఫిర్యాదు- ఏం తగ్గిందని ప్రశ్నిస్తున్న మంత్రి గొట్టిపాటి 
Delhi CM Rekha Gupta Oath Ceremony:ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం- వేడుకకు మోదీ, అమిత్‌షా, చంద్రబాబు, పవన్ హాజరు
ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం- వేడుకకు మోదీ, అమిత్‌షా, చంద్రబాబు, పవన్ హాజరు
YS Jagan Latest News: వైసీపీ అధినేత జగన్‌పై కేసు నమోదు - నిందితులుగా  కొడాలి నాని, అంబటి రాంబాబు సహా ఏడుగురు
వైసీపీ అధినేత జగన్‌పై కేసు నమోదు - నిందితులుగా  కొడాలి నాని, అంబటి రాంబాబు సహా ఏడుగురు
Allu Arjun: అల్లు అర్జున్ ఖాతాలో మరో అరుదైన రికార్డు... హాలీవుడ్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఫోటో
అల్లు అర్జున్ ఖాతాలో మరో అరుదైన రికార్డు... హాలీవుడ్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఫోటో
Nandamuri Mokshagna: నందమూరి అభిమానులకు షాకింగ్ న్యూస్... మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పట్లో లేనట్టేనా?
నందమూరి అభిమానులకు షాకింగ్ న్యూస్... మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పట్లో లేనట్టేనా?
YS Jagan:   సైలెంట్‌గా యాక్టివ్ - జగన్ జిల్లాల టూర్లు ప్రారంభమయినట్లేనా ?
సైలెంట్‌గా యాక్టివ్ - జగన్ జిల్లాల టూర్లు ప్రారంభమయినట్లేనా ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.