అన్వేషించండి

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

సూర్య గతేడాది నటించిన ‘జై భీమ్’ సినిమా భారీ విజయం సాధించింది. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని అందరూ అనుకున్నారు. చాలా రోజుల తర్వాత దానిపై నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.

తమిళ నటుడు సూర్యకు తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన అన్ని సినిమాలు తెలుగులో కూడా విడుదల అవుతాయి. ఎప్పటికప్పుడు విభిన్న పాత్రలు చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటారు సూర్య. ఆయన గతేడాది నటించిన ‘జై భీమ్’ సినిమా భారీ విజయం సాధించింది. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని అందరూ అనుకున్నారు. తర్వాత దానిపై చిత్ర దర్శక నిర్మాతలు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ‘జై భీమ్’ సీక్వెల్ పై చిత్ర నిర్మాత రాజశేఖర్, దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో వీరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘జై భీమ్’ సీక్వెల్ పై అడిగిన ప్రశ్నలకు వారు ఇలా సమాధానం చెప్పారు. ‘‘ప్రముఖ న్యాయవాది జస్టిస్ చంద్రు ఎన్నో కేసులను వాదించారు. అందులో ఓ కేసును తీసుకొని జై భీమ్ ను తెరకెక్కించాం. ఆయన వాదించిన మరిన్ని కేసులతో సీక్వెల్ ను తీయవచ్చు’’ అని సమాధానమిచ్చారు. దీనిబట్టి చూస్తే త్వరలోనే ‘జై భీమ్’ సీక్వెల్ పై ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

ప్రముఖ న్యాయవాది చంద్రు జీవితం ఆధారంగా ‘జై భీమ్’ సినిమా రూపొందించారు. చేయని తప్పుకు జైలు శిక్ష అనుభవిస్తూ ప్రాణాలు కోల్పోయిన తన భర్త లాంటి పరిస్థితి ఇంకెవరికీ రాకూడదు అని ఓ మహిళ చేసిన పోరాటానికి న్యాయవాది చంద్రు అండగా ఎలా నిలబడ్డారు అనేదే ‘జైభీమ్’ సినిమా. న్యాయవాది చంద్రు పాత్రలో హీరో సూర్య ఒదిగిపోయారనే చెప్పాలి. అందుకే ఈ సినిమా బెస్ట్ ఫీచర్ పిల్మ్ (విదేశి) ఆస్కార్ అవార్డుల షార్ట్ లిస్ట్ జాబితాలో నిలిచింది. 2022 నవంబర్ లో ఓటీటీ వేదికగా ‘జై భీమ్’ సినిమాను విడుదల చేశారు మేకర్స్. ఆ సమయంలో కోవిడ్ కారణంగా థియేటర్లు మూత పడటంతో సినిమాను ఓటీటీ వేదికగా రిలీజ్ చేశారు. అయితే సినిమాకు ఊహించని విధంగా రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీ సీక్వెల్ పై ఉత్కంఠ నెలకొంది. 

ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో హీరో సూర్య ఎప్పుడూ ముందుంటాడు. అలాగే కమర్షియల్ సినిమాలు కూడా బ్యాలెన్స్ గా చేస్తూ ఉంటాడు. ‘జై భీమ్’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సూర్య.. ఆ తర్వాత కమర్షియల్ సినిమాల్లో బిజీ అయ్యారు. ప్రస్తుతం ‘సూర్య 42’ వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నారు. పీరియాడిక్ స్టోరీ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దిశా పటానీ హీరోయిన్. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ‘సూర్య 42’ ను 2డీ, 3డీ ఫార్మాట్ లలో దాదాపు 10 భాషల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. గ్రీన్, యూవీ క్రియేషన్ బ్యానర్లు కలసి నిర్మిస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

Also Read: రాంచరణ్‌తో జతకట్టేందుకు జాన్వీ గ్రీన్ సిగ్నల్? బుచ్చిబాబు-చెర్రీ మూవీలో హీరోయిన్‌ ఆమేనా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు, ప్రతివాదులకు నోటీసులు
కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు, ప్రతివాదులకు నోటీసులు
Black Monday: బ్లాక్ మండే భయం నిజమైంది - సెన్సెక్స్ 3300 పాయింట్లు, నిఫ్టీ 1000 పాయింట్లు పతనం
బ్లాక్ మండే భయం నిజమైంది - సెన్సెక్స్ 3300 పాయింట్లు, నిఫ్టీ 1000 పాయింట్లు పతనం
Annamayya Crime News: రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి, సీఎం చంద్రబాబు సంతాపం
రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి, సీఎం చంద్రబాబు సంతాపం
Waqf Amendment Act:  కొత్త వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో వరుస పిటిషన్లు, విచారణకు వచ్చేది ఎప్పుడంటే..
కొత్త వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో వరుస పిటిషన్లు, విచారణకు వచ్చేది ఎప్పుడంటే..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tilakvarma removed Mumbai Indians Name | ముంబై ఇండియన్స్ పేరును తొలగించిన తిలక్ వర్మ | ABP DesamJasprit Bumrah Re Entry | బుమ్రాను గాల్లోకి ఎత్తి మరీ ప్రకటించిన పొలార్డ్ | ABP DesamMI vs RCB Match preview IPL 2025 | పదేళ్ల గడిచిపోయాయి..ఇప్పటికైనా దక్కేనా.? | ABP DesamSiraj Bowling in IPL 2025 | ఐపీఎల్ లో వంద వికెట్ల క్లబ్ లోకి దూసుకొచ్చిన హైదరాబాదీ సిరాజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు, ప్రతివాదులకు నోటీసులు
కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు, ప్రతివాదులకు నోటీసులు
Black Monday: బ్లాక్ మండే భయం నిజమైంది - సెన్సెక్స్ 3300 పాయింట్లు, నిఫ్టీ 1000 పాయింట్లు పతనం
బ్లాక్ మండే భయం నిజమైంది - సెన్సెక్స్ 3300 పాయింట్లు, నిఫ్టీ 1000 పాయింట్లు పతనం
Annamayya Crime News: రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి, సీఎం చంద్రబాబు సంతాపం
రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి, సీఎం చంద్రబాబు సంతాపం
Waqf Amendment Act:  కొత్త వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో వరుస పిటిషన్లు, విచారణకు వచ్చేది ఎప్పుడంటే..
కొత్త వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో వరుస పిటిషన్లు, విచారణకు వచ్చేది ఎప్పుడంటే..
Avanthika Sundar: ఖుష్బూ కూతురి కష్టాలు... పేరెంట్స్‌ ముందుకు రావట్లేదు... సినిమా ఎంట్రీ కష్టాలు విన్నారా?
ఖుష్బూ కూతురి కష్టాలు... పేరెంట్స్‌ ముందుకు రావట్లేదు... సినిమా ఎంట్రీ కష్టాలు విన్నారా?
YS Sharmila: ఏపీలో నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు, కూటమి ప్రభుత్వంపై షర్మిల మండిపాటు
ఏపీలో నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు, కూటమి ప్రభుత్వంపై షర్మిల మండిపాటు
AP Economic Growth: ‘ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్’, వృద్ధి రేటులో ఏపీ రికార్డు - తమిళనాడు తర్వాత స్థానం ఏపీదే
‘ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్’, వృద్ధి రేటులో ఏపీ రికార్డు - తమిళనాడు తర్వాత స్థానం ఏపీదే
Peddi First Shot Reactions: ప్రభాస్ బౌలింగ్‌లో చరణ్ సిక్సర్... క్యాచ్ పట్టిన బాలయ్య, పవన్, ఎన్టీఆర్... 'పెద్ది' మీమ్స్ అదుర్స్ అంతే
ప్రభాస్ బౌలింగ్‌లో చరణ్ సిక్సర్... క్యాచ్ పట్టిన బాలయ్య, పవన్, ఎన్టీఆర్... 'పెద్ది' మీమ్స్ అదుర్స్ అంతే
Embed widget