అన్వేషించండి

Sri Rama Pattabhishekam 2025:ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రామరాజ్యం కోరుకోవడం అత్యాశే కదా!

Sri Rama Pattabhishekam :రామరాజ్యం కావాలని కోరుకోవడంతో తప్పులేదు కానీ అది సాధ్యమవుతుందా అని ఆలోచించారా? పైగా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రామరాజ్యం సాధ్యమా? అసలు రామరాజ్యం ఎలా ఉంటుందో తెలుసా

Importance of Rama Rajyam 

కలియుగంలో రామరాజ్యం సాధ్యమేనా!

  • అధికారం కోసం కుట్రలు...
  • గెలుపు కోసం ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు.. 
  • తప్పొప్పులతో సంబంధం లేకుండా బురదచల్లుకోవడం.. 
  • ప్రజావసరాలతో పట్టింపులేదు..
  • అభివృద్ధి అనేమాటే అస్సలు వినిపించదు..
  • అవినీతిలో పోటీ పడుతుంటారు...

కలియుగంలో పాలకుల లక్షణాలు 

స్వధర్మాన్ని విడిచిపెట్టి చెడ్డవారితో స్నేహం చేస్తారు. శూరత్వం ఉండదు. దొంగలే పాలకులవుతారు, పాలకులు దొంగల్లా ప్రవర్తిస్తారు..ఇవే కలియుగంలో పాలకుల లక్షణాలు అని పండితులు ఎప్పుడో చెప్పారు. అసలు కలియుగం అంటేనే ధర్మం ఒంటికాలిపై నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన పాలకులు...రామరాజ్యం తీసుకొచ్చేస్తాం అని ప్రసంగాల్లో ఊదరగొడుతుంటారు. ఇది సాధ్యం కావాలంటే అసలు రామరాజ్యం ఎలా ఉంటుందో తెలుసా?

Also Read: రామాయణం - మహాభారతం రెండింటిలోనూ కామన్ గా కనిపించే ముఖ్యమైన క్యారెక్టర్స్ ఇవే!

ఘనంగా పట్టాభిషేకం 

వనవాసం పూర్తిచేసుకుని అయోధ్యలో అడుగుపెట్టిన రాముడికి సాదరంగా స్వాగతం పలికాడు తమ్ముడు భరతుడు. తిరిగి రమ్మని అడిగితే నీ పాదుకలని ఇచ్చి రాజ్య పాలన చేయమన్నావు...నాకు నువ్వు రాజ్యాన్ని ఎలా ఇచ్చావో అలాగే తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెడుతున్నాను అన్నాడు. భరతుడి మాటలకి సంతోషించిన రాముడు తిరిగి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించాడు. నలుగురు సోదరులు క్షురకర్మలు చేయించుకుని మంగళస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి..దివ్యాభరణాలు వేసుకున్నారు. కోడలికి అభ్యంగన స్నానం చేసి అలంకరించి చూసుకుని మురిసిపోయింది కౌసల్యాదేవి. మంగళవాయిద్యాలు, వేదమంత్రాలలో అయోధ్య మారుమోగిపోయింది. వశిష్ఠుడు, జాబాలి, కాశ్యపుడు, గౌతముడు సహా ఋషులందరూ  రాముడి పట్టాభిషేకానికి అన్నీ సిద్ధం చేశారు.  నాలుగు సముద్రాల నుంచి జలాలు, ఐదువందల నదుల జలాలను వానరులు తీసుకొచ్చారు. ఆ జలాలతో అభిషేకం చేసి ఘనంగా పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించారు. యువరాజుగా పట్టాభిషేకం భరతుడికి జరిగింది. ఈ సందడంతా పూర్తయ్యాక రాముడి పాలన ప్రారంభమైంది..

Also Read: ఎవరినైనా పొగిడినప్పుడు 'సాక్షాత్తు రామచంద్రుడే' అంటాం - రాముడిలో అంత గొప్పదనం ఏంటి!

రామరాజ్యం ఇలా ఉండేది

  • శ్రీ రామచంద్రుడు సింహాసనం అధిష్టించిన రోజు నుంచీ రామ అనే మాట తప్ప ఆ రాజ్యంలో మరో పేరు వినిపించలేదు
  • ప్రజలు, పాలకులు ధర్మబద్ధులై వుండేవాళ్లు..రామరాజ్యంలో దొంగల భయం లేదు
  • అందరూ ఆరోగ్యవంతులుగా ఎలాంటి రోగాలు లేకుండా సుఖంగా జీవించేవారు
  • వర్షాలు సకాలంలో కురిసేవి..ప్రజలు  తమ వృత్తుల్లో రాణించేవారు
  • రామచంద్రుని పాలనలో అసత్యాలు, దుర్వార్త ప్రచారం, పుకార్లకు చోటులేదు
  • మనిషి ప్రశాంతంగా, సంతృప్తిగా ఎలా జీవించాలో అందుకు అవసరమైన పరిస్థితులు రాముడు పాలించిన రాజ్యంలోనే ఉన్నాయి
  • ధర్మ ప్రవర్తనతో అకాల మరణాలు ఉండేవి కావు

Also Read: వనవాసానికి వెళ్లేముందు తల్లిదండ్రులు, రాజగురువుతో రాముడి సంభాషణ ఇదే!

పాలకులు ప్రజలకు ఏం చెబుతారో ముందుగా ఆచరించి చూపాలి. అప్పుడే ప్రజానీకానికి మార్గదర్శిగా ఉంటారు. రామరాజ్యంలో పాలకుడు ధర్మం తప్పకుండా ఉండడం వల్ల ప్రజలు కూడా పాలకులను అనుసరించారు.  అందుకనే పాలన అంటే ఎలా ఉండాలో చెప్పేటప్పుడు రామరాజ్యంని ఉదారహణగా చెబుతారు.. ఇలాంటి పాలన ఈ రోజుల్లో సాధ్యమా-కాదా? అనేది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా...!

Also Read: అధికార పీఠం కోసం కుట్రలు జరిగే ఈ రోజుల్లో - రామాయణంలో ఈ క్యారెక్టర్ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే!

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kashmir Terror Attack: కశ్మీర్‌లో ఉగ్ర దాడి - టూరిస్టులపై కాల్పులు - ఒకరి మృతి
కశ్మీర్‌లో ఉగ్ర దాడి - టూరిస్టులపై కాల్పులు - ఒకరి మృతి
BJP Vishnu Meet AP CM: సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
Glod Price Rs 1 Lakh: బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
UPSC Results : యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Gujarat Titans Winning Strategy IPL 2025 | టాప్ లో ఉంటే చాలు..ఇంకేం అవసరం లేదంటున్న గుజరాత్ టైటాన్స్Trolling on Ajinkya Rahane vs GT IPL 2025 | బ్యాటర్ గా సక్సెస్..కెప్టెన్ గా ఫెయిల్..?GT vs KKR IPL 2025 Match Review | డిఫెండింగ్ ఛాంపియన్ దమ్ము చూపించలేకపోతున్న KKRSai Sudharsan 52 vs KKR IPL 2025 | నిలకడకు మారు పేరు..సురేశ్ రైనా ను తలపించే తీరు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kashmir Terror Attack: కశ్మీర్‌లో ఉగ్ర దాడి - టూరిస్టులపై కాల్పులు - ఒకరి మృతి
కశ్మీర్‌లో ఉగ్ర దాడి - టూరిస్టులపై కాల్పులు - ఒకరి మృతి
BJP Vishnu Meet AP CM: సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
Glod Price Rs 1 Lakh: బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
UPSC Results : యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
Singer Sunitha: నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
IPS PSR Anjaneyulu arrested: నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
Musical horn: భారతీయ సంగీతంలోకి వాహనాల హార్న్ - గడ్కరీ వినూత్న ఆలోచన -ఇంటర్నెట్ బ్లాస్ట్
భారతీయ సంగీతంలోకి వాహనాల హార్న్ - గడ్కరీ వినూత్న ఆలోచన -ఇంటర్నెట్ బ్లాస్ట్
Mahesh Babu: మహేష్ బాబు వెనుక డైనోసార్లు పరిగెడితే... మైండ్ బ్లాక్ అయ్యేలా రాజమౌళి సినిమాలో యాక్షన్ ఎపిసోడ్!
మహేష్ బాబు వెనుక డైనోసార్లు పరిగెడితే... మైండ్ బ్లాక్ అయ్యేలా రాజమౌళి సినిమాలో యాక్షన్ ఎపిసోడ్!
Embed widget