అన్వేషించండి

PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!

Prime Minister Modi: విందు భేటీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీల పనితీరుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మరింత యాక్టివ్ గా పని చేయాలని దిశానిర్దేశం చేశారు.

Prime Minister Modi took a class for BJP MPs from Telugu states:  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్  బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ అల్పాహార విందు ఇచ్చారు.  పార్టీ భవిష్యత్ వ్యూహాలపై చర్చించారు. రాష్ట్రాల్లో పార్టీ  పరిస్థితి, ప్రతిపక్ష పాత్ర వంటి వాటిపై మాట్లాడారు.   ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ముందుకు సాగడం మంచి పరిణామమని ప్రశంసించారు.  వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శలకు బీజేపీ ఎంపీలు ఎందుకు స్పందించడం లేదని అడిగినట్లుగా చెబుతున్నారు.  తెలంగాణలో పార్టీ ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషించకపోవడంపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. 
 
గురువారం దిల్లీలో ప్రధాని మోదీ ఏపీ, తెలంగాణ, అండమాన్ కు చెందిన 15 మంది ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు. సుమారు అరగంట పాటు ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాల్లో పార్టీ పరిణామాలు, ప్రభుత్వ చర్యలు, రాజకీయ వ్యూహాలపై దృష్టి సారించారు. ఏపీకి పెట్టుబడులు ఎక్కువగా  వస్తున్నాయని, ఇది రాష్ట్ర అభివృద్ధికి చాలా మంచి అవకాశమని మోదీ ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర పరిపాలనపై మంచి ఫీడ్‌బ్యాక్ వస్తోందని, ఇది  బీజేపీకి  కూడా ప్రయోజకరమని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తోందన్నారు. 
  
వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నాయకులు సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలకు భాజపా దీటుగా స్పందించాలని ఎంపీలకుప్రధాని మోదీ దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, కేంద్ర-రాష్ట్ర సహకారాలపై వైసీపీ చేస్తున్న దాడులకు పార్టీ నేతలు, ఎంపీలు సమర్థవంతంగా కౌంటర్ ఇవ్వాలని ఆయన సూచించారు. ఇటీవల జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడును విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ విషయంపై   ఎంపీలు, నేతలు మరింత యాక్టివ్‌గా ఉండాలని మోదీ హైలైట్ చేశారు.

తెలంగాణ బీజేపీ ఎంపీల తీరుపై విమర్శలు

తెలంగాణలో  బీజేపీ ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషించడం లేదని, మంచి టీమ్ ఉన్నప్పటికీ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నారని ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదుర్కొనే అంశాలను హైలైట్ చేయడంలో, పార్టీ గ్రాఫ్‌ను పెంచుకోవడంలో ఎంపీలు, నేతలు సీరియస్ గా పని చేయడం లేదని  ఆయన విమర్శించారు. తెలంగాణలో  మంచి అవకాశాలు ఉన్నా, వాటిని ఉపయోగించుకోవడంలో సమస్యలు ఎదురవుతున్నాయని మోదీ పేర్కొన్నారు.  
 
తెలుగు రాష్ట్రాల ఎంపీలు జాతీయ పరిణామాలపై మరింత యాక్టివ్‌గా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. పలు రాష్ట్రాల్లో పర్యటించి, కేంద్ర ప్రభుత్వ చర్యలు, జాతీయ సంకల్పాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన ఆదేశించారు. ‘వికసిత భారత్’, ‘అమృత్ కాలం’ వంటి కార్యక్రమాలపై ఎంపీలు ప్రచారం చేయాలని, ఇతర రాష్ట్రాల్లో భాజపా బలోపేతానికి కృషి చేయాలని మోదీ చెప్పారు. అండమాన్ ఎంపీలపై  ఆయన సానుకూల వ్యాఖ్యలు చేశారు.                                 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Advertisement

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget