అన్వేషించండి

PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!

Prime Minister Modi: విందు భేటీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీల పనితీరుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మరింత యాక్టివ్ గా పని చేయాలని దిశానిర్దేశం చేశారు.

Prime Minister Modi took a class for BJP MPs from Telugu states:  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్  బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ అల్పాహార విందు ఇచ్చారు.  పార్టీ భవిష్యత్ వ్యూహాలపై చర్చించారు. రాష్ట్రాల్లో పార్టీ  పరిస్థితి, ప్రతిపక్ష పాత్ర వంటి వాటిపై మాట్లాడారు.   ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ముందుకు సాగడం మంచి పరిణామమని ప్రశంసించారు.  వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శలకు బీజేపీ ఎంపీలు ఎందుకు స్పందించడం లేదని అడిగినట్లుగా చెబుతున్నారు.  తెలంగాణలో పార్టీ ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషించకపోవడంపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. 
 
గురువారం దిల్లీలో ప్రధాని మోదీ ఏపీ, తెలంగాణ, అండమాన్ కు చెందిన 15 మంది ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు. సుమారు అరగంట పాటు ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాల్లో పార్టీ పరిణామాలు, ప్రభుత్వ చర్యలు, రాజకీయ వ్యూహాలపై దృష్టి సారించారు. ఏపీకి పెట్టుబడులు ఎక్కువగా  వస్తున్నాయని, ఇది రాష్ట్ర అభివృద్ధికి చాలా మంచి అవకాశమని మోదీ ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర పరిపాలనపై మంచి ఫీడ్‌బ్యాక్ వస్తోందని, ఇది  బీజేపీకి  కూడా ప్రయోజకరమని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తోందన్నారు. 
  
వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నాయకులు సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలకు భాజపా దీటుగా స్పందించాలని ఎంపీలకుప్రధాని మోదీ దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, కేంద్ర-రాష్ట్ర సహకారాలపై వైసీపీ చేస్తున్న దాడులకు పార్టీ నేతలు, ఎంపీలు సమర్థవంతంగా కౌంటర్ ఇవ్వాలని ఆయన సూచించారు. ఇటీవల జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడును విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ విషయంపై   ఎంపీలు, నేతలు మరింత యాక్టివ్‌గా ఉండాలని మోదీ హైలైట్ చేశారు.

తెలంగాణ బీజేపీ ఎంపీల తీరుపై విమర్శలు

తెలంగాణలో  బీజేపీ ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషించడం లేదని, మంచి టీమ్ ఉన్నప్పటికీ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నారని ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదుర్కొనే అంశాలను హైలైట్ చేయడంలో, పార్టీ గ్రాఫ్‌ను పెంచుకోవడంలో ఎంపీలు, నేతలు సీరియస్ గా పని చేయడం లేదని  ఆయన విమర్శించారు. తెలంగాణలో  మంచి అవకాశాలు ఉన్నా, వాటిని ఉపయోగించుకోవడంలో సమస్యలు ఎదురవుతున్నాయని మోదీ పేర్కొన్నారు.  
 
తెలుగు రాష్ట్రాల ఎంపీలు జాతీయ పరిణామాలపై మరింత యాక్టివ్‌గా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. పలు రాష్ట్రాల్లో పర్యటించి, కేంద్ర ప్రభుత్వ చర్యలు, జాతీయ సంకల్పాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన ఆదేశించారు. ‘వికసిత భారత్’, ‘అమృత్ కాలం’ వంటి కార్యక్రమాలపై ఎంపీలు ప్రచారం చేయాలని, ఇతర రాష్ట్రాల్లో భాజపా బలోపేతానికి కృషి చేయాలని మోదీ చెప్పారు. అండమాన్ ఎంపీలపై  ఆయన సానుకూల వ్యాఖ్యలు చేశారు.                                 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Advertisement

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget