అన్వేషించండి

Mahabharat and Ramayan: రామాయణం - మహాభారతం రెండింటిలోనూ కామన్ గా కనిపించే ముఖ్యమైన క్యారెక్టర్స్ ఇవే!

Mahabharat and Ramayan: త్రేతాయుగం - ద్వాపరయుగం...ఈ రెండు యుగాల్లోనూ కామన్ గా కనిపించే క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే రామాయణం -మహాభారతం రెండింటిలోనూ ఉంటారు వీళ్లు...ఎవరెవరంటే...

Mahabharat and Ramayan:  మహాభారతం - రామాయణం రెండింటిలోనూ కనిపించే పాత్రలివే....

హనుమంతుడు

సప్త చిరంజీవుల్లో ఒకడు హనుమంతుడు. అంటే ఇప్పటికీ బతికే ఉన్నాడని చెబుతారు...త్రేతాయుగంలో శ్రీరాముడి వెంటే ఉండి  సీతమ్మ జాడ తెలియజేయడంతో పాటూ రావణుడి లంకపై దండెత్తి వెళ్లేందుకు శ్రీరాముడి సైన్యాన్ని ముందుండి నడిపించాడు ఆంజనేయుడు. ఆ తర్వాత మహాభారత యుద్ధంలో..అర్జునుడి రథంపై కూర్చుని తనని విజయం వరించేలా సహాయం చేశాడు...

పరశురాముడు

రామాయణంలో సీతా స్వయంవరంలో శివధనస్సు విరిచిన శ్రీరాముడికి..సవాల్ విసురుతాడు పరశురాముడు.  ‘ రామా !నీ పరాక్రమము అద్భుతం! శివధనుస్సు ఎక్కుపెట్టావని తెలియగానే నీవెంతటి వాడివో తెలుసుకోవాలని మరొక ధనస్సు తీసుకొచ్చానంటాడు. ఇది అత్యంత దృఢమైన వైష్ణవధనువు అని చేతికందించాడు. దాన్ని కూడా ఎక్కుపెట్టాడు శ్రీరాముడు. ఆసమయంలో రాముడు తన సుదర్శన చక్రాన్ని పరశురాముడికి అప్పగించాడు. ద్వాపర యుగంలో పరశురాముడు అదే చక్రాన్ని  శ్రీకృష్ణుడికి తిరిగి ఇచ్చాడని పురాణాల్లో చెబుతారు.

Also Read: ఎవరినైనా పొగిడినప్పుడు 'సాక్షాత్తు రామచంద్రుడే' అంటాం - రాముడిలో అంత గొప్పదనం ఏంటి!

జాంబవంతుడు

జాంబవంతుడి పాత్ర రామాయణంలో కనిపిస్తుంది...ఒంటిమిట్టలో కోదండ రామాలయం నిర్మించింది జాంబవంతుడే. అయితే త్రేతాయుగంలో జాంబవంతుడిని ఓ సందర్భంలో శ్రీరాముడు...నీ కోర్కె ఏంటో చెప్పు తీరుస్తానని అడిగాడు. అప్పుడు జాంబవంతుడు...స్వామీ మీతో ద్వంద యుద్ధం చేయాలని ఉందన్నాడు. ఈ కోర్కె ఈ జన్మలో తీరదు...నేను మరో అవతారంలో వచ్చినప్పుడు తీరుతుందని మాటిచ్చాడు శ్రీరాముడు.  అలా ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుడిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు... శ్యమంతకమణి విషయంలో నిందలు పడడం, ఆ నిందను చెరిపేసుకునేందుకు జాంబవంతుడితో యుద్ధం చేసి మణిని తీసుకొచ్చి తిరిగి సత్రాజిత్తుకి ఇవ్వడం...ఈ కథ వినాయకచవితి రోజు చెప్పుకుంటాం.  అలా త్రేతాయుగంలో ఇచ్చిన కోర్కెను ద్వాపరయుగంలో జాంబవంతుడితో ద్వందయుద్ధం చేసి తీర్చాడన్నమాట...

Also Read: వనవాసానికి వెళ్లేముందు తల్లిదండ్రులు, రాజగురువుతో రాముడి సంభాషణ ఇదే!

దుర్వాస మహర్షి

రామాయణం, మహాభారతాలను కూడా చూసిన మరో గొప్ప వ్యక్తి దూర్వాసుడు. ఓ పురాణం ప్రకారం  దుర్వాసుడి శాపం కారణంగానే లక్ష్మణుడు రాముడికి ఇచ్చిన వాగ్ధానం ఉల్లంఘించాల్సి వచ్చిందని చెబుతారు (సీతకు కాపలా ఉండమని రాముడు చెప్పి వెళితే...మారీచుడి అరుపు విని సీతాదేవి వెళ్లమంటే లక్ష్మణరేఖ గీసి రాముడికే ప్రమాదం జరిగిందని భావించి వెళ్లిపోతాడు). ఇక మహాభారంతో కుంతీదేవికి.. దేవతా ఉపాసనా మంత్రాలను ఉపదేశించింది దూర్వాసుడే. ఆ మంత్రాల సాయంతో ఆమె కోరుకున్న దేవతలను ప్రార్థించి పిల్లల్ని పొందింది. పెళ్ళి కాక  ముందు సూర్యుడిని ప్రార్థించి కర్ణుడిని కని నీటిలో వదిలేసింది..  పాండురాజుతో వివాహం తర్వాత  కూడా ఇంద్రుడు, యముడు, అశ్వినీదేవతలను ప్రార్థించి సంతానాన్ని పొందింది. 

Also Read: జై శ్రీరామ్ - మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెప్పయండిలా!

మయాసురుడు

మయుడు అసురుల, దైత్యుల, రాక్షసుల రాజు.  మయాసురుడు అని కూడా పిలుస్తారు. మయుడు త్రిపుర అను మూడు ఎగిరే పట్టణాలు నిర్మించి వాటికి రాజుగా ఉన్నాడు. ఈ పట్టణాలు   ఐశ్వర్యం, బలంతో ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించడంతో శివుడు వాటిని నాశనం చేస్తాడు. ఆ తర్వాత మయ రాష్ట్ర అనే పట్టణాన్ని నిర్మించి రాజధానిగా మార్చుకున్నాడు. అదే ఇప్పటి మీరట్.  రామాయణంలో మయుడి ప్రస్తావన విషయానికొస్తే.. రావణుడు పెళ్లిచేసుకున్న మండోదరి తండ్రి మయుడు. మహాభారతంలో..ఇంద్రప్రస్థంలో పాండవులకు అద్భుతమైన భవనాన్ని నిర్మించి ఇచ్చింది మయుడే. ఆ భవనమే మయసభగా పేరొందింది.

Also Read: అధికార పీఠం కోసం కుట్రలు జరిగే ఈ రోజుల్లో - రామాయణంలో ఈ క్యారెక్టర్ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే!

ఈ ఐదుగురితో పాటూ అగస్త్యుడు, శక్తి మహర్షి, భారద్వాజ మహర్షి, కుబేరుడు ఇంకా చాలామంది త్రేతాయుగం, ద్వారపయుగం రెండింటిలోనూ కనిపిస్తారు...

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ఏ పనులకు ఏ స్తోత్రం? విష్ణు సహస్రనామం నుంచి సంతాన గోపాల స్తోత్రం వరకు మీ సమస్యలకు ఇదిగో పరిష్కారం!
ఏ పనులకు ఏ స్తోత్రం? విష్ణు సహస్రనామం నుంచి సంతాన గోపాల స్తోత్రం వరకు మీ సమస్యలకు ఇదిగో పరిష్కారం!
Office Astrology: మీరు ఆఫీసు పనిలో వెనుకబడుతున్నారా? కెరీర్‌లో దూసుకెళ్లేందుకు 5 శక్తివంతమైన చిట్కాలు!
మీరు ఆఫీసు పనిలో వెనుకబడుతున్నారా? కెరీర్‌లో దూసుకెళ్లేందుకు 5 శక్తివంతమైన చిట్కాలు!
Middle East War: మీన రాశిలో శని-కుజుల కలయిక.. ప్రపంచంపై తీవ్ర ప్రభావం! యుద్ధాలు, విపత్తులు మరింత పెరుగుతాయా?
మీన రాశిలో శని-కుజుల కలయిక.. ప్రపంచంపై తీవ్ర ప్రభావం! యుద్ధాలు, విపత్తులు మరింత పెరుగుతాయా?
Gen-Z Vastu: Gen-Z కోసం అద్భుతమైన వాస్తు చిట్కాలు! ఈ మార్పులతో మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది!
Gen-Z కోసం అద్భుతమైన వాస్తు చిట్కాలు! ఈ మార్పులతో మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది!

వీడియోలు

TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
Priyansh Arya 39 vs CSK IPL 2026 | పవర్ ప్లే లో రఫ్పాడించి మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పేశాడు | ABP Desam
Sanju Samson Failures CSK IPL 2026 | తొలి రెండు మ్యాచుల్లోనూ సంజూ విఫలం | ABP Desam
CSK vs PBKS Match Highlights IPL 2026 | సీఎస్కేపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi: దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల తగ్గింపు ఉండదు: ప్రధాని మోదీ కీలక ప్రకటన
దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల తగ్గింపు ఉండదు: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Khanapur Municipal Chairman: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
Chandrababu Amaravati Review: అమరావతి ఇన్ ఫ్రా పనులు వేగంగా జరగాల్సిందే - అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి ఇన్ ఫ్రా పనులు వేగంగా జరగాల్సిందే - అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం
Basra Development: బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
IPL 2026లో కొందరు స్టార్ ప్లేయర్లు ఎందుకు ఆడటం లేదు, ఫ్యాన్స్ మాత్రం వెయిటింగ్
IPL 2026లో కొందరు స్టార్ ప్లేయర్లు ఎందుకు ఆడటం లేదు, ఫ్యాన్స్ వెయిటింగ్
Tiger In Polavaram: వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
Tyson Naidu OTT : టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
Telugu Desam Party:'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
Embed widget