అన్వేషించండి

Ram Charan New Movie: రాంచరణ్‌తో జతకట్టేందుకు జాన్వీ గ్రీన్ సిగ్నల్? బుచ్చిబాబు-చెర్రీ మూవీలో హీరోయిన్‌ ఆమేనా?

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులో సినిమా చేయబోతున్నట్లు చాలా కాలంగా వార్తలు విపిస్తున్నాయి. త్వరలో ఈ వార్తలు నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఓ క్రేజీ మూవీలో చేయబోతున్నట్లు తెలుస్తోంది.

పాన్ ఇండియన్ స్టార్ రాంచరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్నది. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు సైతం శరవేగంగా కొనసాగుతున్నాయి.  ప్రస్తుతం ఈ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ విషయం సినీ ఇండస్ట్రీలో సర్క్యులేట్ అవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చాలా కాలంగా తను తెలుగులో సినిమాలు చేయాలనుకుంటోంది. అయితే, కొన్ని అవకాశాలు వచ్చినా పలు కారణాలతో వాటిని చేయలేదు. 

జాన్వీ హీరోయిన్ గా ఓకే అయ్యేనా?

ప్రస్తుతం తన టాలీవుడ్ తొలి సినిమాకు రాంచరణ్ మూవీ అయితే బాగుంటుందని అతిలోక సుందరి ముద్దుల కూతురు భావిస్తోందట. ఈ సినిమా నటించేందుకు ప్రయత్నిస్తోందట. ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. వాస్తవానికి దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను ఎన్టీఆర్ తో కలిసి స్పోర్ట్స్ డ్రామాగా తెరెక్కించాలి అనుకున్నాడు. కొన్ని కారణాతో ఈ మూవీలో ఇప్పుడు ఎన్టీఆర్ స్థానంలో రాంచరణ్ నటిస్తున్నాడు. లీడ్ యాక్టర్ తప్ప స్క్రిప్ట్‌ లో ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో అనుకున్నట్లుగానే జాన్వీ కపూర్‌ ను హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉంది.

వచ్చే ఏడాది షూటింగ్ మొదలయ్యే అవకాశం!

ఈ సినిమా 2023 ఫస్ట్ హాఫ్ లో మొదలయ్యే అవకాశం ఉంది. జాన్వీ కపూర్ ఈ సినిమాకు సంతకం చేస్తే, దేశవ్యాప్తంగా మరింత క్రేజ్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. జాన్వీ కపూర్ తల్లి, దివంగత అతిలోక సుందరి శ్రీదేవి, రామ్ చరణ్ తండ్రి చిరంజీవితో కలిసి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో కలిసి నటించారు.  వీరిద్దరు కలిసి నటించిన పలు సినిమా చక్కటి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు వారి పిల్లలు రామ్ చరణ్,  జాన్వీ కపూర్ కలిసి నటించే అవకాశం కనిపిస్తోంది.

శంకర్ మూవీలో నటిస్తున్న రాంచరణ్

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'RRR' మూవీ విజయం తర్వాత, రామ్ చరణ్ పాన్-ఇండియన్ స్టార్ గా గుర్తింపు పొందాడు. ఈ చిత్రంలో రాంచరణ్ సీతారామ రాజు పాత్రలో నటించి మెప్పించాడు. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ఆర్‌సీ 15 అనే సినిమా చేస్తున్నాడు చెర్రీ. ఈ ప్రాజెక్టుతో చాలా బిజీగా ఉన్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతున్నది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి న్యూజీలాండ్ లో షూటింగ్ జరుగుతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ చేస్తోంది. శ్రీకాంత్‌, ఎస్‌జే సూర్య, అంజలి సహా పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై దిల్‌ రాజు భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Read Also: ‘పుష్ప’ రష్యన్ ట్రైలర్ వచ్చేసింది, రిలీజ్ ఎప్పుడంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget