అన్వేషించండి

Donkey Milk Scam: గాడిద పాల కోసం ఆశ పడితే రూ.100 కోట్లు పోయాయి- హైదరాబాద్‌ నుంచి చెన్నై వరకు బాధితులు

Crime News: తెలుగు రాష్ట్రాల్లో గాడిద పాల పేరిట భారీ కుంభకోణం వెలుగుచూసింది. చెన్నైలోని ఫ్రాంచైజీ గ్రూప్ సభ్యులు తమను నమ్మించి మోసం చేశారని బాధితులు వాపోయారు.

Donkey Milk Scam In AP And Telangana: తెలుగు రాష్ట్రాల్లో భారీ స్కాం వెలుగుచూసింది. తమిళనాడుకు చెందిన ఓ ముఠా గాడిద పాల (Donkey Milk) పేరిట నిండా ముంచేసింది. ఓ సంస్థ దాదాపు రూ.100 కోట్ల వరకూ ఎగవేసిందని బాధితులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మార్కెట్‌లో గాడిద పాలకు ఉన్న డిమాండ్, హైప్ ఆసరాగా తీసుకుని ఓ సంస్థ ఉత్పత్తి, లాభాల పేరుతో ఆశ చూపి ఔత్సాహిక రైతులను నమ్మించి మోసం చేసింది. ఫ్రాంచైజీ మోడల్‌లో గాడిద పాలు తీసుకుని డబ్బులు ఎగవేసిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధిత రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. చెన్నైలోని డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీ గ్రూప్ సభ్యులు తమను నమ్మించి నిలువునా ముంచారని మండిపడ్డారు. 

బాధితులు ఏం చెప్పారంటే.?

కొవిడ్ నేపథ్యంలో బహుళ పోషకాలు, రోగ నిరోధక శక్తి ఇచ్చే గాడిద పాలకు డిమాండ్ ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో అది చూసి సంప్రదించినట్లు బాధితులు తెలిపారు. 'డాంకీ ప్యాలెస్ మిస్టర్ బాబు ఉలగనాథన్ ఆధ్వర్యంలో గిరి సుందర్, బాలాజీ, సోనికరెడ్డి, డాక్టర్ రమేశ్ బృందం సెక్యూరిటీ డిపాజిట్ కింద ఒక్క రైతు వద్ద రూ.5 లక్షలు తీసుకున్నారు. ఒక్కో పాడి గాడిదను రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షల చొప్పున విక్రయించారు. ఆ గాడిదల నుంచి ఉత్పత్తి చేసిన పాలు లీటరు రూ.1600 చొప్పున సేకరిస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత నమ్మకం కలిగించేలా 3 నెలలు నగదు చెల్లింపులు చేశారు. అయితే, గత 18 నెలలుగా డాంకీ ప్యాలెస్‌కు సరఫరా చేసిన పాల డబ్బులు, నిర్వహణ ఖర్చులు, షెడ్ నిర్మాణం, సిబ్బంది జీతాలు, వెటర్నరీ చికిత్స ఖర్చులు ఇవ్వడం లేదు.' అని వాపోయారు.

'400 మంది రైతులు.. రూ.100 కోట్ల నష్టం'

దీనిపై ప్రశ్నిస్తే ఒక్కొక్కరికీ రూ.15 లక్షల నుంచి రూ.70 లక్షల వరకూ బ్యాంకు చెక్కులు రాసిచ్చారని బాధితులు తెలిపారు. 'ఈ చెక్కులు బ్యాంకులో వేస్తే బౌన్సయ్యాయి. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 400 మందికి పైగా రైతులు తమలాగా రూ.100 కోట్ల వరకూ నష్టపోయారు. ఇదో పెద్ద స్కాం. దీని వెనుక రాజకీయ పెద్దల హస్తం ఉండొచ్చు. ఈ విషయంపై చెన్నై పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు పట్టించుకోలేదు. ఒప్పందం క్రమంలో ఇచ్చిన జీఎస్టీ సంఖ్య, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ కూడా నకిలీవేనని తేలింది. తెలుగు రాష్ట్రాల సీఎంలు న్యాయం చేయాలి. లేకుంటే మాకు ఆత్మహత్యలే శరణ్యం.' అని బాధితులు ఆందోళన చెందారు.

ఇదీ జరిగింది

కాగా, గాడిదల ఫామ్ ఏర్పాటు చేస్తే రూ.కోట్లు గడించవచ్చని కేటుగాళ్లు కొందరిని నమ్మించారు. వీరి మాటలు నమ్మి రూ.20 లక్షల నుంచి రూ.90 లక్షల వరకూ చాలామంది పెట్టుబడులు పెట్టారు. గ‌తేడాది జూలై 23న త‌మిళ‌నాడులో ది డాంకీ ప్యాలెస్‌ను ప్రారంభించిన అనంతరం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. అధిక లాభాలు పొందొచ్చంటూ ఆశ చూపారు.

Also Read: Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nandu World Couple Reaction : డబ్బులు తీసుకుని ఫేక్ ప్రచారం... ఎవరూ నమ్మొద్దు - యూకే వీసా స్కాంపై నందు వరల్డ్ జంట రియాక్షన్
డబ్బులు తీసుకుని ఫేక్ ప్రచారం... ఎవరూ నమ్మొద్దు - యూకే వీసా స్కాంపై నందు వరల్డ్ జంట రియాక్షన్
Nandu World Insta Couple Scam: సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
IPL final match driving accident: ఐపీఎల్ ఫైనల్ చూస్తూ డ్రైవింగ్ - బావిలోకి వెళ్లిపోయిన కారు - వ్యక్తి మృతి !
ఐపీఎల్ ఫైనల్ చూస్తూ డ్రైవింగ్ - బావిలోకి వెళ్లిపోయిన కారు - వ్యక్తి మృతి !
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Ticket Price Hike In Telangana:
Peddi Ticket Price Hike In Telangana: "పెద్ది"కి గుడ్ న్యూస్- తెలంగాణలో టికెట్‌ ధరలు పెంపు
Minister Ponnam Prabhakar counter to Pawan Kalyan: ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
NHAI Toll Exemption List: టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
AP DSC Sports Quota Controversy: ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
Annamalai Resigns BJP Tamil Nadu: బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
Kanpur Petrol Pump Scam: ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Embed widget