అన్వేషించండి

Union Budget 2022 LIVE: ఉద్యోగులను కనికరించని నిర్మల.. ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పుల్లేవ్‌

Union Budget 2022 India LIVE Updates: ఎప్పటికప్పుడు బడ్జెట్‌ లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

LIVE

Key Events
Union Budget 2022 LIVE: ఉద్యోగులను కనికరించని నిర్మల.. ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పుల్లేవ్‌

Background

సామాన్య ప్రజలు, ఉద్యోగులు, పారిశ్రామిక రంగం ఎంతో ఆశగా ఎదురు చూసే బిగ్ డే రానే వచ్చింది. కరోనా రక్కసి ఇంకా పీడిస్తున్న వేళలో  కేంద్రం ఎలాంటి బడ్జెట్ ప్రవేశపెడుతుందన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. 

కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోయింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నిల నగారా మోగి ప్రచారం హోరాహోరీన సాగుతోంది. రైతుల తమ పోరుకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. వేతన జీవులు సీతమ్మ కరుణించమ్మా అంటు వేడుకుంటున్నారు.  ఈ పరిస్థితుల్లో ఇవాళ 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్రం బడ్జెట్ 2022-23ను సభ ముందు ఉంచనున్నారు. 

నిర్మలా సీతారామన్‌ ఈ సారి పన్ను మినహాయింపు పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచుతారని అంతా భావిస్తున్నారు. రూ.15 లక్షల పైనా శ్లాబులను సవరిస్తారన్న అంచనాలు ఉన్నాయి.

వేతన జీవులు, పింఛన్‌దారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించే అవకాశం కనిపిస్తోంది. త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్‌ ద్వారా పెరుగుతున్న ద్రవ్యోల్బణం భారం తగ్గించే దిశగా సాగుతున్నట్టు తెలిసింది. పన్ను భారం తగ్గించేందుకు స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిమితిని పెంచుతారని సమాచారం. 2022, ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌ ద్వారా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుభవార్త చెబుతారని అంతా అంచనా వేస్తున్నారు.

పన్ను మినహాయింపు రూ.75వేలకు పెంపు!

ప్రస్తుతం స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.50,000గా ఉంది. నిర్మలా సీతారామన్ ఈ పరిమితిని రూ.75,000 లేదా 50 శాతానికి పెంచే అవకాశం ఉంది. ఒకవేళ పెంచితే నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఇది నాలుగో సారి అవుతుంది. బిజినెస్‌ ఛాంబర్లు, చాలామంది ఆర్థిక వేత్తలు బడ్జెట్‌లో స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిమితిని పెంచి పన్ను చెల్లింపుదారులపై ధరలు, పన్ను భారాన్ని తగ్గించాలని కోరుతున్నారు.

CM.. ఇంకా చెప్పాలంటే కామన్‌ మ్యాన్‌! ఈ ఏడాది బడ్జెట్‌ నుంచి భారీగానే ఆశిస్తున్నాడు! పన్నులు తగ్గించాలని, గృహ రుణాల వడ్డీలపై మినహాయింపు పెంచాలని, సింపుల్‌గా ఆదాయపన్ను దాఖలు చేసేలా సరళీకరించాలని, స్టాండర్డ్‌ డిడక్షన్‌ పెంచాలని FM.. అదే కేంద్ర ఫైనాన్స్‌ మినిస్టర్‌ నిర్మలా సీతారామన్‌ను కోరుతున్నాడు. మరి సామాన్యుడి వినతులను మేడమ్‌ ఆలకిస్తారా!!

కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం అన్ని రంగాల్లాగే ఆటోమొబైల్ పరిశ్రమ కూడా ఎదురుచూస్తుంది. దేశవాళీ ఉత్పత్తి పెంచడానికి, కొత్త టెక్నాలజీలు తీసుకురావడానికి, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఫెసిలిటీలు కావాలంటే భవిష్యత్తులు పెట్టుబడులను ఆహ్వానించడం తప్పనిసరి. ఈ తరహా పెట్టుబడులకు ప్రభుత్వం ఏమైనా ఇన్సెంటివ్‌లు ప్రకటిస్తుందేమో అని పరిశ్రమ ఎదురుచూస్తోంది.

గ్రాండ్ థోర్టన్ సర్వే ప్రకారం 84 శాతం మంది ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యక్ష పన్ను రాయితీలు, ఇన్సెంటివ్‌లు అందిస్తారని అంచనా వేస్తున్నారు. స్టార్టప్ కంపెనీలకు ఆర్థిక సాయం కావాలని 74 శాతం మంది, మెరుగైన ఆటోమోటివ్ రీసెర్చ్, డెవలప్‌మెంట్ బేస్ కావాలని 75 శాతం మంది కోరారు.

 

12:37 PM (IST)  •  01 Feb 2022

లోక్ సభ రేపటికి వాయిదా

లోక్ సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసింది. దాదాపు గంటన్నర పాటు ఆమె బడ్జెట్ ప్రసంగం సాగింది. బడ్జెట్ ప్రసంగం పూర్తవగానే స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా సభను బుధవారం (ఫిబ్రవరి 2) సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు.

12:27 PM (IST)  •  01 Feb 2022

జనవరిలో నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు

‘‘జనవరి నెలలో జీఎస్టీ కలెక్షన్లు రూ.1,40, 986 లక్షల కోట్లుగా తేలాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇదే అత్యధిక ఆదాయం. కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందనేందుకు ఇదే ఉదాహరణ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల విషయంలో తీసుకున్న విధానాలు కూడా ఇందుకు కారణం.’’

12:22 PM (IST)  •  01 Feb 2022

రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

‘‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడానికి, వారిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తీసుకురానున్నాం. కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగుల పన్ను మినహాయింపు పరిమితిని 10 శాతం నుండి 14 శాతానికి పెంచుతాం. ఏదైనా వర్చువల్ డిజిటల్ ఆస్తిని ట్రాన్స్‌ఫర్ చేయడం ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను విధించాలని ప్రతిపాదిస్తున్నాం. ఆ ఆదాయాన్ని లెక్కల్లోకి తీసుకున్నప్పుడు ఎటువంటి మినహాయింపు అనుమతించబడదు. మరోవైపు, కార్పొరేట్ సర్‌ఛార్జ్ 12 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తున్నాం.’’

12:12 PM (IST)  •  01 Feb 2022

రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కరోనా కారణంగా ఆదాయం పడిపోయి ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలకు వడ్డీ లేని అప్పులు ఇస్తామని తీపి కబురు చెప్పింది కేంద్రం. లక్షల కోట్ల వడ్డీ రహిత రుణాలు ఇవ్వబోతున్నట్టు పేర్కొంది.  

12:08 PM (IST)  •  01 Feb 2022

త్వరోనే అందుబాటులోకి డిజిటల్ రూపీ

క్రిప్టో కెరన్సీకి కౌంటర్‌ అన్నట్టుగానే ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  భారత్ తరహా క్రిప్టో కరెన్సీని తీసుకొస్తున్నట్టు బడ్జెట్‌లో పెట్టింది. ఇండియన్ డిజిటల్ కరెన్సీని తీసుకొస్తున్నట్టు పేర్కొెంది. దీన్ని త్వరలోనే RBI విడుదల చేయనుంది. 

12:08 PM (IST)  •  01 Feb 2022

ఈ ఏడాది నుంచే డిజిటల్ కరెన్సీ

‘‘బ్లాక్‌చెయిన్, ఇతర సాంకేతికతలను ఉపయోగించి డిజిటల్ రూపాయిని జారీ చేస్తాం. 2022-23 నుంచే ఆర్బీఐ ఈ డిజిటల్ కరెన్సీని జారీ చేస్తుంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు మరింతగా ఊపునిస్తుందని ఆశిస్తున్నాం’’

12:01 PM (IST)  •  01 Feb 2022

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి స్పెషల్‌ స్కీమ్‌

దేశవ్యాప్తంగా జిల్లాల వారీగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి స్పెషల్‌ స్కీమ్‌

ఐటీఐల్లో ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు 

రాష్ట్రాల భాగస్వామ్యంతో కొత్తగా ఎస్‌ఈజెడ్‌లు ఏర్పాటు 

త్వరలో డిజిటల్ చిప్‌తో కూడిన పాస్‌పోర్టులు జారీ 

కొత్తగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ 2.0 ప్రారంభం 

ఉపాధ్యాయులకు డిజిటల్‌ నైపుణ్యాల శిక్షణ 

75 నగరాల్లో డిజిటల్‌ బ్యాంకింగ్ యూనిట్లు 

 

12:01 PM (IST)  •  01 Feb 2022

యానిమేషన్ రంగం సామర్థ్యం మరింత పెంపు

‘‘యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (AVGC) రంగంలో  యువతకు అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. దీన్ని గుర్తించి ఆ దిశగా యువతకు ఆ మార్గాన్ని సూచిస్తున్నాం. దేశీయ యానిమేషన్ మార్కెట్‌‌.. ప్రపంచ డిమాండ్‌కు అనుగుణంగా సేవలందించడానికి AVGC ప్రమోషన్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తాం. ఈ రంగంలో దేశీయ సామర్థ్యాన్ని మరింత పెంపొందించడానికి ఇంకా కృషి చేస్తాం’’

11:51 AM (IST)  •  01 Feb 2022

గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లోనూ ఆప్టికల్ ఫైబర్ సేవలు

‘‘టెలికాం సెక్టర్‌లో 5జీ టెక్నాలజీ కోసం స్పెక్ట్రం వేలాన్ని 2022లోనే చేపడతాం. 2022-23లోనే 5జీ అందుబాటులోకి వస్తుంది. 5జీ ద్వారా ఉత్పత్తి, ఉద్యోగావకాశాలు ఇంకా పెరుగుతాయి. అన్ని గ్రామాల్లోని ఇళ్లలో పట్టణాల తరహాలో ఈ- సర్వీసులు, డిజిటల్ సౌకర్యాలు అందాలనే ఉద్దేశంతో పని చేస్తున్నాం. ‘భారత్ నెట్ ప్రాజెక్ట్‌’లో భాగంగా పీపీపీ పద్ధతిలో గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లోనూ ఆప్టికల్ ఫైబర్ సేవలు అందేలా చూస్తాం. ఈ ప్రాజెక్టు 2025 వరకూ పూర్తవుతుంది.’’ 

11:48 AM (IST)  •  01 Feb 2022

నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ ఎకో సిస్టమ్‌ ఏర్పాటు

మహిళల, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య, సక్షం అంగన్‌వాడీ, పోషణ్ 2.0 వంటి పథకాలను మా ప్రభుత్వం సమగ్రంగా పునరుద్ధరించింది.

నేచురల్‌, జీరో-బడ్జెట్ & సేంద్రీయ వ్యవసాయం, ఆధునిక వ్యవసాయం అవసరాలను తీర్చడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయాల సిలబస్‌లు సవరించాలి. దీని కోసం రాష్ట్రాలకు పూర్తి స్వేచ్చ ఇస్తున్నాం. 

నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ ఎకో సిస్టమ్‌ రూపొందిస్తున్నాం. ఇందులో ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సౌకర్యాలు, యునీక్‌ హెల్త్ ఐడెంటిటీ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సౌకర్యాలు ఉంచుతాం. 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Delhi Capitals vs Gujarat Titans Highlights | రషీద్ ఖాన్ ట్రై చేసినా.. విజయం దిల్లీదే | ABP DesamPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురంలో ప్రజలు ఎటు వైపు..? | ABP DesamCM Revanth Reddy vs Harish Rao | రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన హరీశ్ రావు | ABP DesamPawan Kalyan Dance in Nomination Ryally | కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి నామినేషన్ లో పవన్ చిందులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
KCR News: ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
Medak BRS Candidate :  రూ. వంద కోట్లిస్తా -  మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
రూ. వంద కోట్లిస్తా - మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
Actor Naresh On Pawan Kalyan :  సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
Embed widget