Union Budget 2022 LIVE: ఉద్యోగులను కనికరించని నిర్మల.. ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పుల్లేవ్
Union Budget 2022 India LIVE Updates: ఎప్పటికప్పుడు బడ్జెట్ లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజ్ను రిఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE

Background
లోక్ సభ రేపటికి వాయిదా
లోక్ సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసింది. దాదాపు గంటన్నర పాటు ఆమె బడ్జెట్ ప్రసంగం సాగింది. బడ్జెట్ ప్రసంగం పూర్తవగానే స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా సభను బుధవారం (ఫిబ్రవరి 2) సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు.
జనవరిలో నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు
‘‘జనవరి నెలలో జీఎస్టీ కలెక్షన్లు రూ.1,40, 986 లక్షల కోట్లుగా తేలాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇదే అత్యధిక ఆదాయం. కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందనేందుకు ఇదే ఉదాహరణ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల విషయంలో తీసుకున్న విధానాలు కూడా ఇందుకు కారణం.’’
రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
‘‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడానికి, వారిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తీసుకురానున్నాం. కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగుల పన్ను మినహాయింపు పరిమితిని 10 శాతం నుండి 14 శాతానికి పెంచుతాం. ఏదైనా వర్చువల్ డిజిటల్ ఆస్తిని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను విధించాలని ప్రతిపాదిస్తున్నాం. ఆ ఆదాయాన్ని లెక్కల్లోకి తీసుకున్నప్పుడు ఎటువంటి మినహాయింపు అనుమతించబడదు. మరోవైపు, కార్పొరేట్ సర్ఛార్జ్ 12 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తున్నాం.’’
రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా ఆదాయం పడిపోయి ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలకు వడ్డీ లేని అప్పులు ఇస్తామని తీపి కబురు చెప్పింది కేంద్రం. లక్షల కోట్ల వడ్డీ రహిత రుణాలు ఇవ్వబోతున్నట్టు పేర్కొంది.
త్వరోనే అందుబాటులోకి డిజిటల్ రూపీ
క్రిప్టో కెరన్సీకి కౌంటర్ అన్నట్టుగానే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భారత్ తరహా క్రిప్టో కరెన్సీని తీసుకొస్తున్నట్టు బడ్జెట్లో పెట్టింది. ఇండియన్ డిజిటల్ కరెన్సీని తీసుకొస్తున్నట్టు పేర్కొెంది. దీన్ని త్వరలోనే RBI విడుదల చేయనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

