అన్వేషించండి

Adani Group: రూ.2 లక్షల కోట్ల మెగా ప్లాన్.. అదానీ నిర్ణయంతో ఆ స్టాక్ ఇన్వెస్టర్లకు డబ్బుల పంటే..

Stock Market: దేశంలో 40,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని నిర్మించేందుకు అదానీ గ్రూప్ 2030 నాటికి సుమారు రూ.2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తోంది

Adani Energy: అదానీ గ్రూప్ తన పెట్టుబడుల జోరును భారీగా పెంచేస్తోంది. మోదీ 3.0లో ఎనర్జీ రంగంపై గౌతమ్ అదానీ భారీగా దృష్టి సారించారు. భారత్ భవిష్యత్తు ఎనర్జీ అవసరాలను తీర్చే క్రమంలో వేగంగా అడుగులు వేస్తున్నారు. 

దేశంలో 40,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని నిర్మించేందుకు అదానీ గ్రూప్ 2030 నాటికి సుమారు రూ.2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తోంది. గ్రూప్ 2050 నాటికి తన కంపెనీల్లో నికర సున్నా కర్భన ఉద్గారాలను సాధించాలనే లక్ష్యాన్ని నిర్థేశించుకుంది. ఈ క్రమంలో అదానీ గ్రూప్ సోలార్, విండ్ ఎనర్జీ సహా పునరుత్పాదక వనరుల నుంచి 10,000 MW కంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. అలాగే ప్రతి సంవత్సరం కొత్తగా 6000 MW నుంచి 7000 MW సామర్థ్యాన్ని జోడిచటం ద్వారా 2030 నాటికి 50,000 MW సామర్థ్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.  

అదానీ గ్రీన్ ప్లాన్స్:
అదానీ గ్రూప్ పునరుత్పాదక ప్రణాళికలు ఎక్కువగా లాభాన్ని కలిగించే కంపెనీల జాబితాలో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్(AGEL) ముందు స్థానంలో ఉంది. ఈ కంపెనీలో దీర్ఘకాలిక వ్యూహంతో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు అదానీ తాజా పెట్టుబడి ప్రణాళికల వల్ల రానున్న కాలంలో లాభపడతారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కంపెనీ ఇప్పటికే దేశంలో భారీ స్థాయిలో సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తూ అగ్రగామిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

రాత్రి పూట అవసరాల కోసం:
ఒక మెగావాట్‌కు రూ.5 కోట్ల చొప్పున, 2030 నాటికి పెట్టుబడి రూ.2 లక్షల కోట్ల వరకు ఉంటుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్, సీఈవో అమిత్ సింగ్ వెల్లడించారు. రాత్రి సమయంలో గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకోవడానికి కంపెనీ 5,000 మెగావాట్ల పంప్‌డ్ స్టోరేజీ సామర్థ్యాన్ని కూడా సృష్టిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. దీనికి కారణం రాత్రిపూట సూర్యరశ్మి అందుబాటులో లేకపోవడం, విద్యుత్ ఉత్పత్తికి విండ్‌మిల్‌ నడిచేందుకు అవసరమైన గాలి తీవ్రత వాతావరణంలో ఉండకపోవటమే కారణంగా వెల్లడించారు. 

అదానీ సొంత ఉత్పత్తి:
ఈ ఏడాది 6000 మెగావాట్ల సామర్థ్యం పెంచాలనే లక్ష్యం అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ ముందు ఉంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కొత్తగా 2800 మెగావాట్ల సామర్థ్యాన్ని జోడించినట్లు సీఈవో అమిత్ సింగ్ వెల్లడించారు. దేశంలో ఏడాదిలో సృష్టించిన మొత్తం ఉత్పత్తి సామర్థ్యంలో ఇది 15 శాతమని పేర్కొన్నారు. ఈ ఏడాది 6000 మెగావాట్లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నట్లు వెల్లడించారు. 2030 నాటికి లక్ష్యంగా పెట్టుకున్న 50,000 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీలో 80 శాతం సోలార్ నుంచి మిగిలినది విండ్ ఎనర్జీ నుంచి ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.  

ఇందుకోసం బృందం సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్‌లలో ఉపయోగించే పొరలను తయారు చేయడానికి ఫ్యాక్టరీలను కూడా ఏర్పాటు చేస్తోంది. తక్కువ గాలి వేగం ఉన్న ప్రాంతాల కోసం మూడు మెగావాట్ల విండ్ ఫామ్‌ను నిర్మించాలని గ్రూప్ ప్రస్తుతం పరిశీలిస్తోందని సీఈవో స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రస్తుతం గుజరాత్‌లోని ఖవ్రా వంటి అధిక సామర్థ్యం గల ప్రాంతాలకు అనువైన 5.2 మెగావాట్ల సామర్థ్యం గల విండ్ టర్బైన్‌లను తయారు చేస్తోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Embed widget