అన్వేషించండి

Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు

Perni Jayasudha PDS Rice News | ఏపీ మాజీ మంత్రి పేర్ని నానికి పోలీసులు నోటీసులు ఇచ్చినా పోలీస్ స్టేషన్‌కు వచ్చి వివరాలు సమర్పించలేదు. దాంతో ఆయన మళ్లీ ఆజ్ఞాతంలోకి వెళ్లారని ప్రచారం జరుగుతోంది.

Police will issue another notice to Perni Nani In Machilipatnam house | మచిలీపట్నం: ఏపీ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. పేర్ని నాని కుటుంబానికి సంబంధించిన గోదాముల్లో క్వింటాళ్ల కొద్దీ బియ్యం మాయం కావడంపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కేసులో ఇంకా దాగుడుమూతలు కొనసాగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. డిసెంబర్ 10న పేర్ని నాని భార్య పేర్ని జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు. పౌరసరఫరాలశాఖ అధికారి ఫిర్యాదు మేరకు పేర్ని జయసుధతో పాటు గోదాముల మేనేజర్ మానస తేజపై కేసు నమోదు చేయగా.. ముందస్తు బెయిల్ పిటిషన్ ఈ నెల 24కి వాయిదా పడింది. 

నిన్న ముగిసిన డెడ్‌లైన్

గోదాముల్లో భారీ ఎత్తున బియ్యం మాయం అయిన కేసులో వివరాలు సమర్పించాలని, వివరణ ఇచ్చుకునేందుకు పేర్నినానికి, ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు రాబర్ట్ సన్ పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలలోగా పీఎస్‌కు వచ్చి వివరాలు సమర్పించాలని శనివారం ఇచ్చిన నోటీసులలో పేర్కొన్నారు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడం ఇంటికి నోటీసులు అంటించినట్లు తెలుస్తోంది. అయితే గడువు ముగిసినా పేర్నినాని గానీ, ఆయన కుమారుడు గానీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేదు, వివరాలు సమర్పించకపోవడంతో మాజీ మంత్రి ఎక్కడ ఉన్నారనేది హాట్ టాపిక్ అవుతోంది. రెండు వారాల కిందట పేర్ని జయసుధపై బియ్యం మాయం కేసు నమోదైన సమయంలోనూ కొన్నిరోజులు పేర్ని నాని ఆజ్ఞాతంలోకి వెళ్లారు. తరువాత బయటకు వచ్చి మచిలీపట్నం వైసీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు.

ఏ2 ఆచూకీ సైతం లభించడం లేదు

అందుబాటులో ఉన్న సమయంలో నోటీసులు ఇవ్వని పోలీసులు, ఆయన ఎక్కడ ఉన్నారో సమాచారం లేని సమయంలో వెళ్లి నోటీసులు ఇవ్వడంపై అనుమానులు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ఏ2గా ఉన్న మానస తేజ ఆచూకీ సైతం పోలీసులకు లభ్యం కావడం లేదు. కుటుంబసభ్యులు, స్నేహితులను విచారించినా ప్రయోజనం లేకపోయింది.

ఎవరినీ వదిలిపెట్టేది లేదన్న మంత్రి నాదెండ్ల

ఇటీవల ఏపీ పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పేర్ని జయసుధకు చెందిన గోదాములో 3 వేల బస్తాలు కాదు, 4840 బస్తాలు మాయం చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తరువాత 1300 రైస్ మిల్లులకు అందించి బియ్యంగా మార్చుతాం. ఆ బియ్యాన్ని గోడౌన్లలో భద్రపరుస్తాం. రేషన్ కార్డుదారులకు, అంగన్వాడీ కేంద్రాలకు, సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లకు ప్రభుత్వం ఆ బియ్యాన్ని సరఫరా చేస్తుంది.  అయితే నవంబర్ 26న ప్రభుత్వం “వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్” సాఫ్ట్‌వేర్ తీసుకొచ్చింది. దాని ద్వారా గోదాముల్లో బియ్యం నిల్వలు అక్కడికి వెళ్లకుండానే తెలుసుకోవచ్చు. 

గోదాము యజమానులకు ట్రైనింగ్ ఇచ్చాం. ఆ మరుసటిరోజే బియ్యం తగ్గిందని పేర్ని జయసుధ గోదాము నుంచి లేఖ వచ్చింది. తగ్గిన బియ్యానికి లెక్క చెబితే నగదు చెల్లిస్తామని లేఖలో పేర్కొన్నారు. డబ్బుల గురించి ఎవరూ చూడటం లేదు. జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకుని పేదలకు బియ్యం అందేలా చేయడం ప్రభుత్వం ఉద్దేశం. బియ్యం ఎక్కడికి తరలిపోయిందనే దానిపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. ఎవరినీ వదిలిపెట్టేది లేదు’ అన్నారు.   

Also Read: Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్ 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
RC16: రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది - 'పెద్ది'గా గ్లోబల్ స్టార్, మాస్ లుక్ అదిరిపోయిందిగా..
రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది - 'పెద్ది'గా గ్లోబల్ స్టార్, మాస్ లుక్ అదిరిపోయిందిగా..
AP Inter Results 2025: పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్‌ ఫలితాలు! విడుదల ఎప్పుడు అంటే?
పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్‌ ఫలితాలు! విడుదల ఎప్పుడు అంటే?
Shruthi Narayanan : ఆన్‌లైన్‌లో క్యాస్టింగ్ కౌచ్ - ప్రైవేట్ వీడియో లీకైన తమిళ నటి శృతి నారాయణన్ ఎవరో తెలుసా?
ఆన్‌లైన్‌లో క్యాస్టింగ్ కౌచ్ - ప్రైవేట్ వీడియో లీకైన తమిళ నటి శృతి నారాయణన్ ఎవరో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Quinton de Kock 97 vs RR IPL 2025 | ఐపీఎల్ లో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చిన డికాక్ | ABP Desam#Hidden Agenda at TDP Social Media | టీడీపీ సోషల్ మీడియాలో సొంత పార్టీపైనే ఎటాక్స్..అసలు రీజన్ ఇదేనా | ABP DesamSouth Industry Domination | బాలీవుడ్ లో సౌత్ ఇండస్ట్రీ డామినేషన్ | ABP DesamShreyas Iyer Ishan Kishan BCCI Contracts | ఐపీఎల్ ఆడినంత మాత్రాన కాంట్రాకులు ఇచ్చేస్తారా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో నాలా రద్దు, అధికారులు విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు: సీఎం చంద్రబాబు
RC16: రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది - 'పెద్ది'గా గ్లోబల్ స్టార్, మాస్ లుక్ అదిరిపోయిందిగా..
రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది - 'పెద్ది'గా గ్లోబల్ స్టార్, మాస్ లుక్ అదిరిపోయిందిగా..
AP Inter Results 2025: పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్‌ ఫలితాలు! విడుదల ఎప్పుడు అంటే?
పేరెంట్స్ వాట్సాప్‌కే ఏపీ ఇంటర్‌ ఫలితాలు! విడుదల ఎప్పుడు అంటే?
Shruthi Narayanan : ఆన్‌లైన్‌లో క్యాస్టింగ్ కౌచ్ - ప్రైవేట్ వీడియో లీకైన తమిళ నటి శృతి నారాయణన్ ఎవరో తెలుసా?
ఆన్‌లైన్‌లో క్యాస్టింగ్ కౌచ్ - ప్రైవేట్ వీడియో లీకైన తమిళ నటి శృతి నారాయణన్ ఎవరో తెలుసా?
Telugu Desam : వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
వైసీపీ, టీడీపీకి ఉన్న తేడా అదే ! మరి తెలుగు తమ్ముళ్లను కంట్రోల్ చేసేదెవరు?
Salman Khan: 'దేవుడే అన్నీ చూసుకుంటాడు' - బెదిరింపులపై స్పందించిన సల్మాన్, అట్లీతో సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన కండలవీరుడు
'దేవుడే అన్నీ చూసుకుంటాడు' - బెదిరింపులపై స్పందించిన సల్మాన్, అట్లీతో సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన కండలవీరుడు
Venky Atluri : పరువు పోయింది... 'మ్యాడ్ స్క్వేర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆంటోనీని భీమ్స్ అని పొరపాటు పడిన వెంకీ అట్లూరి
పరువు పోయింది... 'మ్యాడ్ స్క్వేర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆంటోనీని భీమ్స్ అని పొరపాటు పడిన వెంకీ అట్లూరి
Jobs In Grok: Elon Muskతో పనిచేసే అవకాశం, టాలెంటెడ్‌ ఇంజినీర్ కోసం చూస్తున్న Grok, జీతం ఎంతో తెలుసా?
Elon Muskతో పనిచేసే అవకాశం, టాలెంటెడ్‌ ఇంజినీర్ కోసం చూస్తున్న Grok, జీతం ఎంతో తెలుసా?
Embed widget