అన్వేషించండి

Chandrababu: అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం: సీఎం చంద్రబాబు

Andhra Pradesh : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రకటించారు. ఆయన స్వగ్రామంలో మ్యూజియం, ఆధునిక పాఠశాలలు ఏర్పాటుకు కూడా హామీ ఇచ్చారు.

Potti Sriramulu | ఆంధ్ర జాతి పిత, అమరజీవి పొట్టి శ్రీరాములు 58రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఆదివారం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా  ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నారాయణ, డూండి రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. సీఎం  చంద్రబాబు మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు స్వగ్రామాన్ని అభివృద్ది చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆయన నివాసం ఉన్న ఇంటిని ప్రభుత్వమే కొనుగోలు చేసి మ్యూజియంగా అభివృద్ధి చేస్తుందని చంద్రబాబు ప్రకటించారు. ఆయన దీక్షను గుర్తు చేసుకుంటూ పొట్టి శ్రీరాములు 120వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.

మ్యూజియం ఏర్పాటు 
ఆమరణ దీక్షతో ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టిన మహనీయుడంటూ పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తుచేశారు.ఆయన ఆమరణ దీక్షకు గుర్తుగా 58 అడుగుల భారీ విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అలాగే రాజధానిలో పొట్టి శ్రీరాములు స్మారక పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. నెల్లూరు జిల్లాలోని పొట్టి శ్రీరాములు స్వగ్రామంలోని ఆధునిక ఉన్నత పాఠశాలను ఆయన పేరుతో నిర్మించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ప్రతి ఒక్కరూ పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో పనిచేయాలన్నారు. ప్రతి ఒక్కరూ 10 మంది తెలుగువారిని పైకి తీసుకు రావాలని కోరారు. వచ్చే ఏడాది మార్చి 16 వరకు.. అంటే ఏడాది పాటు పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.

ఆయనను స్మరించుకోవాలి
కర్నూలుతో ప్రారంభమైన తెలుగు రాష్ట్రం పెద్ద మనుషుల ఒప్పందంతో కలిశాయని చంద్రబాబు తెలిపారు. ఆ తర్వాత హైదరాబాద్‌ను రాజధానిగా మార్చగా.. 11ఏళ్ల క్రితం జూన్ 2న మళ్లీ ఏపీ విభజన జరిగిందని చంద్రబాబు గుర్తు చేశారు. ఏపీ ఏర్పాటుకు చాలా తేదీలు వచ్చినా.. డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం చేసిన రోజు కాబట్టి ఆరోజున పొట్టి శ్రీరాములను మనం స్మరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగాలను నేటి తరానికి తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. జనం కోసం, తెలుగు జాతి కోసం జీవించిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని సీఎం ఉద్ఘాటించారు.

నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు..
 నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు కూడా తామే పెట్టామన్నారు.పొట్టి శ్రీరాములు త్యాగానికి స్పూర్తిగా రాజధాని అమరావతిలో 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. ఏడాది లోపు పార్కు కూడా నిర్మించి ప్రారంభిస్తామన్నారు. ఎంతోమంది పుట్టినా కొందరే చరిత్రలో మిగిలిపోతారు. తెలుగు వాళ్ల చరిత్ర ఉన్నంత వరకు పొట్టి శ్రీరాములు గుర్తుంటారు. ఆయన కృషి వల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికిందన్నారు. తెలుగు భాష మాట్లాడేవారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసుకున్నారు.అందుకే ఈరోజు నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు ఏడాది పాటు నిర్వహించిన మార్చికి ముగింపు సభ పెడతామని చంద్రబాబు వెల్లడించారు.   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Challenges KCR: హరీష్ రావు పిల్లకాకి, తాటిచెట్టులా పెరిగాడు కానీ! కేసీఆర్ వస్తే చర్చకు మేం రెడీ: సీఎం రేవంత్ రెడ్డి
హరీష్ రావు పిల్లకాకి, తాటిచెట్టులా పెరిగాడు కానీ! కేసీఆర్ వస్తే చర్చకు మేం రెడీ: సీఎం రేవంత్ రెడ్డి
AP Capital News: హడ్కో, సీఆర్‌డీఏ మధ్య ఒప్పందం - రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్ల రుణం
AP Capital News: హడ్కో, సీఆర్‌డీఏ మధ్య ఒప్పందం - రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్ల రుణం
SpaceX Crew 10 Mission Success: నాసా, స్పేస్ ఎక్స్ మిషన్ సక్సెస్- త్వరలో భూమికి తిరిగిరానున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్
నాసా, స్పేస్ ఎక్స్ మిషన్ సక్సెస్- త్వరలో భూమికి తిరిగిరానున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్
Pushpa 3 Movie: 'పుష్ప 3' మూవీ వచ్చేది ఎప్పుడంటే? - ఫ్యాన్స్ ఖుష్ అయ్యే న్యూస్ చెప్పేసిన నిర్మాత రవిశంకర్
'పుష్ప 3' మూవీ వచ్చేది ఎప్పుడంటే? - ఫ్యాన్స్ ఖుష్ అయ్యే న్యూస్ చెప్పేసిన నిర్మాత రవిశంకర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TDP Activist Loss life in Punganur | పెద్దిరెడ్డి ఇలాకాలో బలైపోయిన మరో టీడీపీ కార్యకర్త | ABP DesamDrunk man travels beneath RTC bus | పీకల దాకా తాగి..బస్సు కింద వేలాడుతూ జర్నీ చేసిన తాగుబోతు | ABP DesamCM Revanth Reddy on KCR Life Threat | కేసీఆర్ ప్రాణాలకు ప్రమాదం..సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు | ABPPawan Kalyan vs Tamilnadu Leaders | తమిళనాడు నుంచి వస్తున్న రియాక్షన్స్ పై పవన్ సంజాయిషీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Challenges KCR: హరీష్ రావు పిల్లకాకి, తాటిచెట్టులా పెరిగాడు కానీ! కేసీఆర్ వస్తే చర్చకు మేం రెడీ: సీఎం రేవంత్ రెడ్డి
హరీష్ రావు పిల్లకాకి, తాటిచెట్టులా పెరిగాడు కానీ! కేసీఆర్ వస్తే చర్చకు మేం రెడీ: సీఎం రేవంత్ రెడ్డి
AP Capital News: హడ్కో, సీఆర్‌డీఏ మధ్య ఒప్పందం - రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్ల రుణం
AP Capital News: హడ్కో, సీఆర్‌డీఏ మధ్య ఒప్పందం - రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్ల రుణం
SpaceX Crew 10 Mission Success: నాసా, స్పేస్ ఎక్స్ మిషన్ సక్సెస్- త్వరలో భూమికి తిరిగిరానున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్
నాసా, స్పేస్ ఎక్స్ మిషన్ సక్సెస్- త్వరలో భూమికి తిరిగిరానున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్
Pushpa 3 Movie: 'పుష్ప 3' మూవీ వచ్చేది ఎప్పుడంటే? - ఫ్యాన్స్ ఖుష్ అయ్యే న్యూస్ చెప్పేసిన నిర్మాత రవిశంకర్
'పుష్ప 3' మూవీ వచ్చేది ఎప్పుడంటే? - ఫ్యాన్స్ ఖుష్ అయ్యే న్యూస్ చెప్పేసిన నిర్మాత రవిశంకర్
AR Rahman Health Update: ఆస్పత్రి నుంచి ఏఆర్ రెహమాన్ డిశ్చార్జ్ - అసలు ఆయనకు ఏం జరిగిందంటే..?
ఆస్పత్రి నుంచి ఏఆర్ రెహమాన్ డిశ్చార్జ్ - అసలు ఆయనకు ఏం జరిగిందంటే..?
స్టేషన్ ఘన్‌పూర్‌లో రూ. 800 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి - వాటి పూర్తి వివరాలివే
స్టేషన్ ఘన్‌పూర్‌లో రూ. 800 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి - వాటి పూర్తి వివరాలివే
Serial Actress Kavya: అరేంజెడ్ మ్యారేజ్ Vs లవ్ మ్యారేజ్ అంటే నో మ్యారేజ్ - ఆ వ్యక్తిని మైండ్‌లోంచి తీసేశానన్న బుల్లి తెర స్టార్ కావ్య
అరేంజెడ్ మ్యారేజ్ Vs లవ్ మ్యారేజ్ అంటే నో మ్యారేజ్ - ఆ వ్యక్తిని మైండ్‌లోంచి తీసేశానన్న బుల్లి తెర స్టార్ కావ్య
Secunderabad Kavach Center: సికింద్రాబాద్‌లో కవచ్ రీసెర్చ్ సెంటర్ - శంషాబాద్ ఎయిర్ పోర్టులాగ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్: కిషన్ రెడ్డి
సికింద్రాబాద్‌లో కవచ్ రీసెర్చ్ సెంటర్ - శంషాబాద్ ఎయిర్ పోర్టులాగ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్: కిషన్ రెడ్డి
Embed widget