Janmabhoomi Express Latest News :జన్మభూమి ఎక్స్ప్రెస్ స్టేషన్ మళ్లీ మారింది- అసలు ఎన్నిసార్లు మార్చారో తెలుసా?
Janmabhoomi Express Latest News:జన్మభూమి ఎక్స్ప్రెస్కి మళ్లీ చేసిన మార్చేశారు. ఇప్పటికే చాలాసార్లు డెస్టినేషన్లు మార్చారు. ఇప్పుడు ఎందుకు మార్చారో తెలుసా?

Janmabhoomi Express Latest News: విశాఖపట్నం- లింగంపల్లి మధ్య తిరిగే జన్మభూమి ఎక్స్ప్రెస్కి మళ్లీ స్టేషన్ మార్చేశారు. ఇకపై అది సికింద్రాబాద్ వెళ్లదు. చర్లపల్లి మీదుగా లింగంపల్లి వెళుతుంది. ఏప్రిల్ 25 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుందని రైల్వేశాఖ ప్రకటించింది. జన్మభూమి ఎక్స్ప్రెస్కి ఇలా స్టేషన్లు మార్చడం ఇది తొలిసారి కాదు. ఆ మాటకొస్తే ఆ ట్రైన్ అసలు పేరు కూడా అది కాదు. ఇప్పటికే చాలాసార్లు ఆ ట్రైన్ డెస్టినేషన్స్ మారుతూ వచ్చాయి.
అవేంటో చూద్దామా?
చంద్రబాబు విజ్ఞప్తితో జన్మభూమి పేరు మార్పు
విజయవాడ -విశాఖపట్నం మధ్య తిరిగే రత్నాచల్ ఎక్స్ప్రెస్కి కౌంటర్ ట్రైన్గా దీన్ని తీసుకొచ్చారు. విశాఖపట్నం- విజయవాడ మధ్య ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ని పరిచయం చేశారు. అంటే ఉదయం పూట రత్నాచల్ విజయవాడలో బయలుదేరితే ఇంచుమించు అదే సమయానికి విశాఖపట్నంలో ఆ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ బయలుదేరేది. సాయంత్రానికి రత్నాచల్ విజయవాడ వచ్చేస్తే ఇంటర్సిటీ వైజాగ్ చేరుకునేది. అయితే తర్వాత ఇంటర్ సిటీని తెనాలి వరకూ పొడిగించారు.
2004 ముందు చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రమదానం, జన్మభూమి వంటి కార్యక్రమాలు జోరుగా సాగేవి. ఆ సమయంలో కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఇంటర్సిటీకి " జన్మభూమి" అనే పేరు పెట్టారు. అప్పట్లో సికింద్రాబాద్- తెనాలి మధ్య నాగార్జున ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ (2719/2720) తిరిగేది. ఫీజిబిలిటీని దృష్టిలో పెట్టుకుని 2007 జూన్లో ఆ ట్రైన్ రద్దు చేసి జన్మభూమి ఎక్స్ప్రెస్ను సికింద్రాబాద్ వరకూ పొడిగించారు.
గుంటూరు,నల్గొండ మీదుగా సికింద్రాబాద్ వరకూ వెళ్లే జన్మభూమి ఎక్స్ప్రెస్ (12806/12806) దక్షిణ మధ్య రైల్వే నడిపే అతి పొడవైన రైళ్లలో ఒకటి. దీనికి ప్రస్తుతం 24 బోగీలు ఉంటున్నాయి. దీనిలో రిజర్వేషన్ బోగీలు (18), జనరల్ బోగీలు (3),pc (1),DLR (2) ఉంటాయి. విశాఖపట్నం- సికింద్రాబాద్ మధ్య తిరిగే రైళ్లలో జన్మభూమి అతి ముఖ్యమైనది. మిగిలిన ట్రైన్లతో పోలిస్తే తక్కువ ఖర్చుతో ఆంధ్ర తెలంగాణలోని రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణికుల రాకపోకలకు వీలుగా ఉంటుంది. ఈ రెండు నగరాల మధ్య దురంతో, కోణార్క్, గోదావరి, గరీబ్ రథ్, ఈస్ట్ కోస్ట్, వందేభారత్ వంటి రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఖర్చుపరంగా, సీట్ల లభ్యత పరంగా " జన్మభూమి ఎక్స్ప్రెస్" ప్రయాణికులకు అందుబాటులో ఉండటం వల్ల ఈ ట్రైన్కు డిమాండ్ చాలా ఎక్కువ. ఇప్పుడు చర్లపల్లి స్టేషన్ అధునాతన సౌకర్యాలతో అందుబాటులోకి రావడంవల్ల సికింద్రాబాద్ స్టేషన్ రద్దీ తగ్గించేందుకు జన్మభూమిని చర్లపల్లి మీదుగా నడిపేలా కొత్త షెడ్యూల్ రిలీజ్ చేశారు అధికారులు.
Before You Go
Adulterated Paneer in Hyderabad | పనీర్ పేరుతో మోసం..హైదరాబాద్లో భారీ దాడులు
ట్రెండింగ్ వార్తలు






















