అన్వేషించండి

Yadadri Temple Income: రికార్డు స్థాయిలో యాదాద్రీశుడి హుండీ ఆదాయం, 20 రోజుల్లోనే 2 కోట్లు!

Yadadri Temple Income: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం నెలకొంది. గత 20 రోజుల్లోనే 2 కోట్ల 12 లక్షల 17 వేల 700 రూపాయాలు సమకూరింది. 

Yadadri Temple Income: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. గత 20 రోజుల వ్యవధిలోనే రూ. 2 కోట్ల 12 ల‌క్ష‌ల 16 వేల 700 లు హుండీ ఆదాయం సమకూరింది. బంగారం 167 గ్రాములు రాగా.. 2 కిలోల 600 గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇక అమెరికా డాల‌ర్లు 1194, యూఏఈ దిర్హామ్స్ 140, ఆస్ట్రేలియా డాల‌ర్స్ 150, ఇంగ్లండ్ పౌండ్స్ 30, కెన‌డా డాల‌ర్స్ 45, ఒమాన్ బైసా 10,500, న్యూజిలాండ్ డాల‌ర్స్ 45, సింగ‌పూర్ 74 డాల‌ర్స్, మ‌లేషియా రింగ్గిట్స్ 69, సౌదీ రియ‌ల్స్ 27 వ‌చ్చినట్లు వివరించారు.

నవంబర్ లో ఒక్కరోజే 1.09 కోట్ల హుండీ ఆదాయం 

నవంబర్ 13వ తేదీ ఆదివారం ఒక్క రోజే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఆదివారం ఒక్కరోజే రూ. 1.09 కోట్ల ఆదాయం నెలకొనగా.. ఆలయ చరిత్రలో తొలిసారి కోటి రూపాయలు దాటిందని ఆలయ అధికారులు చెప్పారు.

ఇటీవలే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రపతితోపాటు గవర్నర్ తమిళిసై కూడా ఉన్నారు. రాష్ట్రపతి, గవర్నర్  శుక్రవారం ఉదయం ఆలయానికి చేరుకోగానే మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ పుష్పగుచ్చాలతో ఆహ్వానం పలికారు. ఆలయం వద్ద అర్చకులు, అధికారులతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వయంభువు లక్ష్మీ నరసింహ స్వామి వారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. దర్శనానంతరం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు, రాష్ట్రపతి ముర్ముకు ఆలయ ప్రధాన అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. అలాగే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందించారు. ఆ తర్వాత యాదాద్రి ఆలయ నిర్మాణం, పరిసరాలను పరిశీలించారు. అద్దాల మండపం, ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. అయితే యాదాద్రిని దర్శించుకున్న ఐదో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కావడం గమనార్హం. శ్రీశ్రీశ్రీ చిన జీయర్ స్వామి సారథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం రోజు హైదరాబాద్‌లోని సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paritala Sunitha Files Nomination | వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ రెడ్డిపై పరిటాల సునీత ఫైర్Singanamala YCP MLA Candidate Veeranjaneyulu | శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ఇంటర్వ్యూCongress Leader Feroz Khan |ఒవైసీ ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా: ABP Straight Talkలో ఫిరోజ్‌ఖాన్SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Embed widget